40 % ఓటు బ్యాంకు గత ఎన్నికల్లో వచ్చిందని చెబుతున్న వైసిపికి అదే ఓటు బ్యాంకు నిలబడుతుందా లేదా అన్నది పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడు ఒకే రకంగా ఉండవు. ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. గత ఎన్నికల్లో ఉన్నట్టుగానే వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితిలు ఉండకపోవచ్చు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఇస్తున్న నిధులు, చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ప్రజల్లో సంతృప్తిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న సీఎం చంద్రబాబు ఓటు బ్యాంకును కాపాడుకునే విషయంలో జాగ్రత్త పడుతున్నారు.
అదే విధంగా మరింత ఓటు బ్యాంకు పెంచుకునే విషయంలోనూ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీకి ఉన్న ఎస్టీ ఓటు బ్యాంకును భారీ స్థాయిలో దెబ్బతీసే విషయంపై దృష్టి పెట్టారు. ఇప్పటికే ఆయన ఎస్టీ సామాజిక వర్గాలకు చాలా చేరువయ్యారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వారికి ఉపాధి అదేవిధంగా సంప్రదాయ వృత్తుల్లో శిక్షణ కూడా ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవి ఎస్టీ ఓటు బ్యాంకు పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తుంది.
మరోవైపు మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో తీసుకువచ్చిన భారీ మార్పులు కారణంగా అక్కడ కూడా ఎస్సీ ఓటు బ్యాంకు ప్రభావితం అవుతుంది. వైసిపి హయాంలో ఎలా ఉన్నప్పటికీ ఇప్పుడు భారీ మార్పులు అయితే కనిపిస్తున్నాయి. ఎస్సీ సామాజిక వర్గం ఉన్న నియోజకవర్గాల్లో రహదారుల ఏర్పాటు, మౌలిక సదుపాయాల కల్పన, పాఠశాలల నిర్మాణం లాంటివి చేపడుతున్నారు. తద్వారా ఎస్సి ఓటు బ్యాంకు అటు బిజెపికి, టిడిపికి అన్నట్టుగా ప్రస్తుతం పరిస్థితి ఉంది.
ఈ నేపథ్యంలో గతంలో తెచ్చుకున్న ఓటు బ్యాంకు పూర్తి స్థాయిలో నిలబడుతుందా అంటే చెప్పడం కష్టమనేది ప్రస్తుతం విశ్లేషకులు వేస్తున్న అంచనా. కానీ, వైసీపీ నాయకులు మాత్రం ప్రభుత్వ వ్యతిరేకత అంతా అనుకూలంగా మారుతుందని భావిస్తున్నారు. నిజానికి ఏ ప్రభుత్వంలో అయినా వ్యతిరేకత ఉంటుంది. అయితే అదే సమయంలో దాన్ని అనుకూలంగా మార్చుకునే దిశగా వైసిపి ప్రయత్నాలు అయితే చేయాలి. ఆ ప్రయత్నాలు ఎక్కడ జరగట్లేదు. పైగా ప్రత్యర్థుల నుంచి ఎదురవుతున్న దాడిని తట్టుకునే స్థాయిలో వైసిపి బలమైన కౌంటర్ ఇవ్వడం లేదు.
దీంతో గత ఎన్నికల్లో వచ్చిన ఓటు బ్యాంకు నిలబడుతుందా లేదా అనేది సందేహంగా ఉంది. ఇక, ఓటు బ్యాంకు పెరగడం అనేది పెద్ద అవకాశం లేదన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. దీన్ని బట్టి భవిష్యత్తు వ్యూహాలు, భవిష్యత్తు అంచనాలు మార్చుకునే నూతన దిశగా అడుగులు వేస్తే తప్ప వైసీపీకి మరోసారి ఓటు బ్యాంకు దక్కించుకునే అవకాశం కష్టం అన్నది ప్రస్తుతం ఉన్న అంచనా. మరి ఏం జరుగుతుంది ఏం చేస్తారు అనేది చూడాలి.
This post was last modified on December 14, 2025 2:00 pm
అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…
టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…
అమెరికాలో గ్రీన్కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…