40 % ఓటు బ్యాంకు గత ఎన్నికల్లో వచ్చిందని చెబుతున్న వైసిపికి అదే ఓటు బ్యాంకు నిలబడుతుందా లేదా అన్నది పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడు ఒకే రకంగా ఉండవు. ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. గత ఎన్నికల్లో ఉన్నట్టుగానే వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితిలు ఉండకపోవచ్చు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఇస్తున్న నిధులు, చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ప్రజల్లో సంతృప్తిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న సీఎం చంద్రబాబు ఓటు బ్యాంకును కాపాడుకునే విషయంలో జాగ్రత్త పడుతున్నారు.
అదే విధంగా మరింత ఓటు బ్యాంకు పెంచుకునే విషయంలోనూ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీకి ఉన్న ఎస్టీ ఓటు బ్యాంకును భారీ స్థాయిలో దెబ్బతీసే విషయంపై దృష్టి పెట్టారు. ఇప్పటికే ఆయన ఎస్టీ సామాజిక వర్గాలకు చాలా చేరువయ్యారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వారికి ఉపాధి అదేవిధంగా సంప్రదాయ వృత్తుల్లో శిక్షణ కూడా ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవి ఎస్టీ ఓటు బ్యాంకు పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తుంది.
మరోవైపు మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో తీసుకువచ్చిన భారీ మార్పులు కారణంగా అక్కడ కూడా ఎస్సీ ఓటు బ్యాంకు ప్రభావితం అవుతుంది. వైసిపి హయాంలో ఎలా ఉన్నప్పటికీ ఇప్పుడు భారీ మార్పులు అయితే కనిపిస్తున్నాయి. ఎస్సీ సామాజిక వర్గం ఉన్న నియోజకవర్గాల్లో రహదారుల ఏర్పాటు, మౌలిక సదుపాయాల కల్పన, పాఠశాలల నిర్మాణం లాంటివి చేపడుతున్నారు. తద్వారా ఎస్సి ఓటు బ్యాంకు అటు బిజెపికి, టిడిపికి అన్నట్టుగా ప్రస్తుతం పరిస్థితి ఉంది.
ఈ నేపథ్యంలో గతంలో తెచ్చుకున్న ఓటు బ్యాంకు పూర్తి స్థాయిలో నిలబడుతుందా అంటే చెప్పడం కష్టమనేది ప్రస్తుతం విశ్లేషకులు వేస్తున్న అంచనా. కానీ, వైసీపీ నాయకులు మాత్రం ప్రభుత్వ వ్యతిరేకత అంతా అనుకూలంగా మారుతుందని భావిస్తున్నారు. నిజానికి ఏ ప్రభుత్వంలో అయినా వ్యతిరేకత ఉంటుంది. అయితే అదే సమయంలో దాన్ని అనుకూలంగా మార్చుకునే దిశగా వైసిపి ప్రయత్నాలు అయితే చేయాలి. ఆ ప్రయత్నాలు ఎక్కడ జరగట్లేదు. పైగా ప్రత్యర్థుల నుంచి ఎదురవుతున్న దాడిని తట్టుకునే స్థాయిలో వైసిపి బలమైన కౌంటర్ ఇవ్వడం లేదు.
దీంతో గత ఎన్నికల్లో వచ్చిన ఓటు బ్యాంకు నిలబడుతుందా లేదా అనేది సందేహంగా ఉంది. ఇక, ఓటు బ్యాంకు పెరగడం అనేది పెద్ద అవకాశం లేదన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. దీన్ని బట్టి భవిష్యత్తు వ్యూహాలు, భవిష్యత్తు అంచనాలు మార్చుకునే నూతన దిశగా అడుగులు వేస్తే తప్ప వైసీపీకి మరోసారి ఓటు బ్యాంకు దక్కించుకునే అవకాశం కష్టం అన్నది ప్రస్తుతం ఉన్న అంచనా. మరి ఏం జరుగుతుంది ఏం చేస్తారు అనేది చూడాలి.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…