ఏపీలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కొనసాగుతోంది. దీనికి డెడ్లైన్ను మళ్లీ మళ్లీ పొడిగించారు. కోటి సంతకాలు సేకరించి గవర్నర్ నజీర్ను కలిసి పీపీపీకి వ్యతిరేకంగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకోవాలన్నది వైసీపీ అధినేత జగన్ ఉద్దేశం.
అయితే వైసీపీ చేస్తున్న ఈ ప్రయత్నాలను తిప్పికొట్టాలని సీఎం చంద్రబాబు టీడీపీ నేతలకు పిలుపునిస్తున్నారు. కానీ టీడీపీ నుంచి ఆశించిన స్థాయిలో స్పందన కనిపించడం లేదు. ఒకరిద్దరు నాయకులు మాత్రమే ఈ అంశంపై స్పందిస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా మంత్రి సుభాష్ సీరియస్ కామెంట్లు చేశారు. మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై వైసీపీ చేస్తున్నది రాజకీయమేనని, ప్రజలకు మేలు జరుగుతున్నావారు ఓర్చుకోలేకపోతున్నారని ఆయన విమర్శించారు. ఇదే సమయంలో వైసీపీకి బలమైన కౌంటర్ ఇచ్చారు.
“వైసీపీ కోటి సంతకాల సేకరణ చేయాల్సింది పీపీపీ విధానంపై కాదు. 2024 ఎన్నికల్లో ప్రజలు 151 సీట్ల నుంచి 11 సీట్లకు ఎందుకు దింపేశారో దానిపై కోటి సంతకాలు సేకరించాలి. కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఎందుకు చేశారో దానికి కోటి సంతకాలు సేకరించాలి. వైసీపీ నాయకులను ఎందుకు చిత్తుచిత్తుగా ఓడించారో దానికి కోటి సంతకాలు సేకరించాలి” అని వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో గుడివాడ మాజీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ నాయకుడు కొడాలి నానిపై కూడా మంత్రి సుభాష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు రెడ్ బుక్ అంటే ఆయనకు జోక్గా ఉండేదని, ఇప్పుడు ఆ పేరు ఎత్తితేనే చలి జ్వరం వస్తోందన్నారు. అందుకే ఇన్నాళ్లైనా బయటకు రావడం లేదని ఎద్దేవా చేశారు.
రెడ్ బుక్ అంటే కొడాలి నాని కలలో కూడా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. అందుకే గజగజ వణుకుతున్నాడని విమర్శించారు. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వారు ఇప్పుడు బయటకు రావాలని సవాల్ విసిరారు. ప్రజలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటోందని మంత్రి చెప్పారు. కనుచూపు మేరలో కూడా వైసీపీకి భవిష్యత్తు కనిపించడం లేదని విమర్శించారు.
This post was last modified on December 13, 2025 6:29 pm
సంగీత దర్శకుడు తమన్ అఖండ 2 కోసం ఇచ్చిన సంగీతం మీద మిశ్రమ స్పందనే దక్కింది. ఆడియో శివ భక్తులకు…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…