Political News

ఆ ఆస్తులపై షర్మిలకు హక్కు లేదా?

రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్ఠను చెల్లి దెబ్బతీయాలని ప్రయత్నించిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ కంపెనీ అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ)కి నివేదిక అందించారు. ఈ పరిణామాల నేపథ్యంలో గతంలో చెల్లితో చేసుకున్న ఆస్తుల సంబంధిత ఒప్పందాలను రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తన కౌంటర్‌లో పేర్కొన్నారు. వివాదానికి కారణమైన ఆస్తులన్నీ తన స్వార్జితమని స్పష్టం చేసిన ఆయన, ఈ మేరకు ఎన్‌సీఎల్‌ఏటీలో సమగ్ర కౌంటర్‌ దాఖలు చేశారు.

సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో వాటాల బదిలీ అంశంపై గతంలో వైఎస్‌ జగన్‌, వైఎస్‌ భారతి ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్‌ వేశారు. తమకు చెందిన షేర్లను అక్రమంగా తల్లి వైఎస్‌ విజయమ్మ పేరుపైకి బదిలీ చేశారని ఆరోపిస్తూ, ఆ షేర్ల బదిలీని రద్దు చేయాలని వారు కోరారు. ఈ పిటిషన్‌పై వైఎస్‌ షర్మిల అప్పీల్‌ చేయడంతో, ఆమెకు ఈ వ్యవహారంలో ఎలాంటి చట్టబద్ధమైన హక్కులు లేవన్నారు. అప్పీల్‌ చేసే అర్హత కూడా లేదని జగన్‌ తన కౌంటర్‌లో స్పష్టంగా పేర్కొన్నారు.

చెల్లిపై ఉన్న ప్రేమాభిమానాలతో గతంలో భవిష్యత్తులో ఆస్తులు బదిలీ చేయాలనే ఉద్దేశంతో ఒప్పందం కుదిరిందని జగన్‌ తెలిపారు. అయితే ఆ మేరకు జరిగిన వాటాల బదిలీకి మూడేళ్లు పూర్తైనప్పటికీ, ఇంతకాలం మౌనంగా ఉన్న షర్మిల ఇప్పుడు అప్పీల్‌ చేయడం వెనుక ఉద్దేశాలపై ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్‌సీఎల్‌ఏటీ ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని కోరుతూ, తన వాదనలను ట్రిబ్యునల్‌ ముందు జగన్‌ ఉంచారు.

This post was last modified on December 13, 2025 10:29 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

సీనియర్ స్టార్ల సంక్రాంతి… క్లాష్ సాధ్యమేనా

పెళ్లి లేదు ప్రెగ్నెంటూ లేదు, కొడుకు పేరు కృష్ణమనోహర్ అనేది కొత్త సామెత. కొన్ని రిలీజ్ డేట్ల వ్యవహారం చూస్తుంటే…

1 hour ago

ఫ‌లించిన ప‌వ‌న్ ప్ర‌య‌త్నం.. బ‌డ్జెట్‌లో `కొబ్బ‌రి`కి కీల‌క స్థానం

ఏపీలోని కోన‌సీమ ప్రాంతంలో కొబ్బ‌రి సాగు ఎక్కువ‌. దేశంలో కేర‌ళ త‌ర్వాత‌.. కోన‌సీమ‌లో భారీ ఎత్తున కొబ్బ‌రి సాగు చేస్తున్నారు.…

2 hours ago

వరప్రసాద్ గారు కాస్త ఊపిరినిచ్చారు

సంక్రాంతి సినిమాల్లో బ్లాక్ బస్టర్ రన్ తో రికార్డులు సృష్టించిన మన శంకరవరప్రసాద్ గారు తర్వాత బాగా స్లో అయిపోయింది.…

2 hours ago

మూడోసారి దొరికిపోయిన మర్దాని

ఏదైనా సూపర్ హిట్ ఫ్రాంచైజ్ కి కొనసాగింపు చేయడం అంత సులభం కాదు. దాని మీద అంచనాలు అందుకునేలా దర్శక…

3 hours ago

శాంతి కోసం చాలా కష్టపడ్డారు కానీ

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన ఓం శాంతి శాంతి శాంతి మొన్న శుక్రవారం విడుదలయ్యింది. ప్రమోషన్లు బాగానే…

4 hours ago

పాక్ నక్క బుద్ధి… నష్టం తట్టుకోలేరు

టీ20 వరల్డ్ కప్ 2026 విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఒక వింత నిర్ణయం తీసుకుంది. టోర్నీలో పాల్గొనేందుకు అనుమతినిస్తూనే, ఫిబ్రవరి…

5 hours ago