Political News

విఫ‌ల‌మైన నేత‌ల‌తో టీడీపీ ప్ర‌యోగం..

టీడీపీ అధినేత చంద్ర‌బాబు వేస్తున్న వ్యూహాలు.. పార్టీలోనే కాకుండా రాజ‌కీయంగా కూడా చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి. గ‌త ఏడా ది ఎన్నిక‌ల‌కు ముందు వేసిన వ్యూహాలు ఒక్క‌టి కూడా ఫ‌లించ‌లేదు. త‌ర్వాత కూడా పార్టీని పుంజుకునేలా చేయ‌డంలో ఆయ‌న అనుస‌రించిన వ్యూహాల‌పై.. పార్టీ ప‌ద‌వుల పంప‌కంలో చేప‌ట్టిన‌.. స‌మీక‌ర‌ణ‌ల‌పైనా ఇదే త‌ర‌హా అభిప్రాయం పార్టీ సీనియ‌ర్ నేత ల్లోనూ.. సానుభూతి ప‌రుల్లోనూ క‌నిపించింది. ఇక‌, ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నిక‌ల విష‌యంలోనూ చంద్ర‌బాబువేస్తున్న అడు గులు విమ‌ర్శ‌ల‌కు దారితీస్తున్నాయి. ఈ ఎన్నిక టీడీపీకి అత్యంత కీల‌కంగా మారింది. గ‌త ఏడాది ఎన్నిక‌ల త‌ర్వాత‌.. రాష్ట్రంలో జ‌రుగుతున్న తొలి ఉప పోరు ఇదే. దీనిని చంద్ర‌బాబు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు.

అన్ని పార్టీల‌క‌న్నా ముందుగానే చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా ఇక్క‌డ అభ్య‌ర్థిని ఖ‌రారు చేశారు. కేంద్ర మాజీ మంత్రి, గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున ప‌న‌బాక లక్ష్మి పోటీ చేసి ఓడిపోయారు. దాదాపు 2 ల‌క్ష‌ల ఓట్ల పైచిలుకు తేడాతో ఆమె ఓడిపోయారు. అప్ప‌టి నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారు. అయినా స‌రే.. మ‌ళ్లీ చంద్ర‌బాబు ప‌న‌బాక‌కే ప‌గ్గాలు అప్ప‌గించారు. అంద‌రిక‌న్నా ముందుగానేఆమెకు ఇక్క‌డి టికెట్ ప్ర‌క‌టించి.. గ్రూపు రాజ‌కీయాల‌కు, ఆశావ‌హుల నిర‌స‌న‌ల‌కు చెక్ పెట్టారు. ఇప్ప‌టి వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇప్పుడు ఇక్క‌డ ప్ర‌చార బాధ్య‌త‌ల విష‌యంలో మాత్రం చంద్ర‌బాబు చేస్తున్న ప్ర‌యోగంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నా యి.

తిరుప‌తిలో ప‌న‌బాక‌ను గెలిపించే బాధ్య‌త‌ను ప్ర‌ధానంగా ఇద్ద‌రికి అప్ప‌గించిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఒక‌రు నెల్లూరు జిల్లా స‌ర్వేప‌ల్లి మాజీ ఎమ్మెల్యే, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి, తెలుగు మ‌హిళ రాష్ట్ర అధ్య‌క్షురాలు.. వంగ‌ల‌పూడి అనిత ల‌కు చంద్ర‌బాబు ఇప్ప‌టికే దిశానిర్దేశం చేశార‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా అనిత‌.. తిరుప‌తిలో మ‌కాం వేశారు.. రెండు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం తిరుప‌తి వ‌చ్చిన అనిత‌.. స్థానిక ప‌రిస్థితుల‌ను అధ్య‌య‌నం చేశారు. అదే స‌మ‌యంలో సోమిరెడ్డి కూడా తిరుప‌తి ప‌ర్య‌ట‌న‌కు శ్రీకారం చుడుతున్నారు. అయితే.. ఇక్క‌డ చిత్ర‌మైన విష‌యం ఏంటంటే.. ఇప్ప‌టికి ఐదుసార్లు త‌న‌నుతాను గెలిపించుకోలేక పోతున్న సోమిరెడ్డి.. ప‌న‌బాక విజ‌యానికి ఏ ర‌కంగా ప్ర‌య‌త్నం చేస్తార‌నేది ప్ర‌శ్న‌.

అదేవిధంగా గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో అనిత విఫ‌ల‌మ‌య్యారు. ఈమెకు తిరుప‌తి గురించి ఏం తెలుసున‌ని ప‌గ్గాలు అప్ప‌గించార‌నేది మ‌రో కీల‌క ప్ర‌శ్న‌. పైగా ఇక్క‌డ మాజీ ఎమ్మెల్యే సుగుణ‌మ్మ ప్ర‌త్యేక వ‌ర్గంగా ఉన్నారు. ఆమె త‌న వారికి పార్టీలో ప్రాధాన్యం ద‌క్క‌లేద‌ని అల‌క‌బూనారు. ఇక్క‌డ పార్టీలో అంతో ఇంతో బ‌లం ఉన్న నాయ‌కురాలిగా సుగుణ‌మ్మ‌కు ప్రాధాన్యం ఉంది. అయితే.. ఈమెను ప‌క్క‌న పెట్టి.. చంద్ర‌బాబు.. ఎక్క‌డివారికో ఇక్క‌డ ప‌గ్గాలు ఇస్తే.. ప్ర‌యోజ‌నం ఉంటుందా? అనేది ప‌న‌బాక వ‌ర్గంలో మెదులుతున్న ప్ర‌ధాన సందేహం. మ‌రి ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.

This post was last modified on December 9, 2020 8:31 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

1 hour ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

5 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

6 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

7 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

8 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

8 hours ago