Political News

చావు భయంలో ఎలన్ మస్క్

ఎప్పుడూ ట్విట్టర్ లో, బయట హడావిడి చేసే ఎలన్ మస్క్ ఇప్పుడు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇది ఆయనకి ఆయనగా తీసుకున్న నిర్ణయం కాదు, భయం అలా ఉంది మరి. ఇన్నాళ్లు ఎంతో జోష్ గా కనిపించిన మస్క్ లో ఇప్పుడు టెన్షన్ క్లియర్ గా కనిపిస్తోంది. దీనికి మెయిన్ రీజన్ అమెరికాలో జరిగిన చార్లీ కిర్క్ హత్యే. ఆ ఒక్క సంఘటన మస్క్ ను పూర్తిగా మార్చేసింది.

“లైఫ్ ఇప్పుడు హార్డ్ కోర్ లాగా డేంజర్ జోన్ లో ఉంది.. ఒక్క చిన్న తప్పు జరిగినా ప్రాణం పోతుంది” అని మస్క్ అన్న మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చార్లీ కిర్క్ ను చంపిన తీరు చూశాక మస్క్ బాగా డిస్టర్బ్ అయ్యారు. మన చుట్టూ ఎంత సెక్యూరిటీ ఉన్నా, ఒక్క చిన్న ఛాన్స్ దొరికితే చాలు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని ఆయన అంటున్నారు. అందుకే పబ్లిక్ లోకి రావడం తగ్గించేశానని క్లారిటీ ఇచ్చారు.

చార్లీ కిర్క్ ను పట్టపగలే, అందరూ చూస్తుండగానే కాల్చి చంపడం మామూలు విషయం కాదు. ఒక బిల్డింగ్ పై నుంచి స్నైపర్ లాగా గురి చూసి మరీ కాల్చేశారు. షూటర్ వాడిన గన్ మీద వీడియో గేమ్స్ లో ఉండే గుర్తులు ఉండటం చూస్తుంటే.. ఇది పక్కా ప్లాన్ తో చేసిన పని అని అర్థమవుతుంది. ఇలాంటి సిచువేషన్ లో ఎవరి ప్రాణానికైనా గ్యారెంటీ ఎక్కడుంది అనేదే ఇప్పుడు అందరిలో ఉన్న భయం అని మస్క్ లాంటి వాళ్లు అంటున్నారు.

ఒక మనిషి చనిపోతే అయ్యో అనాల్సింది పోయి, సోషల్ మీడియాలో కొందరు పండగ చేసుకోవడం మస్క్ కు కోపం తెప్పించింది. ఇది రాక్షస ఆనందం అని, ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేసేది హత్యకే అని ఆయన మండిపడ్డారు. మనం గట్టిగా తిరిగి పోరాడకపోతే, చివరికి వాళ్ళు మనల్ని చంపేస్తారంటూ మస్క్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా దీనిపై గట్టిగానే రియాక్ట్ అయ్యారు. ఆ తుపాకీ చార్లీ వైపు గురిపెట్టినా, నిజానికి అది మనందరినీ భయపెట్టడానికే అని ఆయన అన్నారు. మనసులో ఉన్న మాట చెప్పినందుకే అతన్ని చంపేశారని ఫీల్ అయ్యారు. 

Kumar

Recent Posts

రాజు గారి స్థలంలో వైసీపీ కార్యాలయమా…?

ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…

9 minutes ago

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

1 hour ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

2 hours ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

2 hours ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

2 hours ago

ప‌ద్మ అవార్డులు అడిగి ఇస్తారా?

దేశ అత్యున్న‌త పౌర పుర‌స్కారాలైన ప‌ద్మ అవార్డుల‌ను ఎంత ప్రతిష్ఠాత్మ‌కంగా భావిస్తారో తెలిసిందే. ప్ర‌తిసారీ అవార్డులు ప్ర‌క‌టించిన‌పుడు గ్ర‌హీత‌ల అర్ఙ‌త‌ల…

3 hours ago