ఎప్పుడూ ట్విట్టర్ లో, బయట హడావిడి చేసే ఎలన్ మస్క్ ఇప్పుడు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇది ఆయనకి ఆయనగా తీసుకున్న నిర్ణయం కాదు, భయం అలా ఉంది మరి. ఇన్నాళ్లు ఎంతో జోష్ గా కనిపించిన మస్క్ లో ఇప్పుడు టెన్షన్ క్లియర్ గా కనిపిస్తోంది. దీనికి మెయిన్ రీజన్ అమెరికాలో జరిగిన చార్లీ కిర్క్ హత్యే. ఆ ఒక్క సంఘటన మస్క్ ను పూర్తిగా మార్చేసింది.
“లైఫ్ ఇప్పుడు హార్డ్ కోర్ లాగా డేంజర్ జోన్ లో ఉంది.. ఒక్క చిన్న తప్పు జరిగినా ప్రాణం పోతుంది” అని మస్క్ అన్న మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చార్లీ కిర్క్ ను చంపిన తీరు చూశాక మస్క్ బాగా డిస్టర్బ్ అయ్యారు. మన చుట్టూ ఎంత సెక్యూరిటీ ఉన్నా, ఒక్క చిన్న ఛాన్స్ దొరికితే చాలు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని ఆయన అంటున్నారు. అందుకే పబ్లిక్ లోకి రావడం తగ్గించేశానని క్లారిటీ ఇచ్చారు.
చార్లీ కిర్క్ ను పట్టపగలే, అందరూ చూస్తుండగానే కాల్చి చంపడం మామూలు విషయం కాదు. ఒక బిల్డింగ్ పై నుంచి స్నైపర్ లాగా గురి చూసి మరీ కాల్చేశారు. షూటర్ వాడిన గన్ మీద వీడియో గేమ్స్ లో ఉండే గుర్తులు ఉండటం చూస్తుంటే.. ఇది పక్కా ప్లాన్ తో చేసిన పని అని అర్థమవుతుంది. ఇలాంటి సిచువేషన్ లో ఎవరి ప్రాణానికైనా గ్యారెంటీ ఎక్కడుంది అనేదే ఇప్పుడు అందరిలో ఉన్న భయం అని మస్క్ లాంటి వాళ్లు అంటున్నారు.
ఒక మనిషి చనిపోతే అయ్యో అనాల్సింది పోయి, సోషల్ మీడియాలో కొందరు పండగ చేసుకోవడం మస్క్ కు కోపం తెప్పించింది. ఇది రాక్షస ఆనందం అని, ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేసేది హత్యకే అని ఆయన మండిపడ్డారు. మనం గట్టిగా తిరిగి పోరాడకపోతే, చివరికి వాళ్ళు మనల్ని చంపేస్తారంటూ మస్క్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా దీనిపై గట్టిగానే రియాక్ట్ అయ్యారు. ఆ తుపాకీ చార్లీ వైపు గురిపెట్టినా, నిజానికి అది మనందరినీ భయపెట్టడానికే అని ఆయన అన్నారు. మనసులో ఉన్న మాట చెప్పినందుకే అతన్ని చంపేశారని ఫీల్ అయ్యారు.
This post was last modified on December 11, 2025 6:15 pm
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…