తమిళనాడులో రాజకీయాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. అక్కడున్నన్ని పార్టీలు బహుశా మరే రాష్ట్రంలోను ఉండవేమో అన్నట్లుగా ఉంటుంది పరిస్ధితి. రాష్ట్రవ్యాప్తంగా పాపులరైన ఉన్న పార్టీలే కనీసం అరడజనుంటాయి. ఇక రాష్ట్రంలోని ఏదో ఓ ప్రాంతానికి మాత్రమే పరిమితమైన పార్టీలు కూడా కొన్నున్నాయి. అంటే ప్రాంతీయ పార్టీల మధ్యలోనే ఉపప్రాంతాయ పార్టీల్లాగ అన్నమాట. ఎన్నికలు వస్తున్నాయంటేనే గందరగోళంగా ఉండే తమిళనాడులో తలైవా రజనీకాంత్ ఆధ్వర్యంలో తొందరలోనే మరో పార్టీ రాబోతోంది.
నిజానికి తలైవా ఆధ్వర్యంలో పార్టీ అంటేనే కొత్త సినిమా రిలీజప్పుడుండే హడావుడి ఉండలి. కానీ రజనీ పొలిటికల్ ఎంట్రీ విషయంలో పెద్దగా సందడి లేదని సమాచారం. డిసెంబర్ 31వ తేదీన రాజకీయ పార్టీ పేరు, దాని విధి విదానాలను ప్రకటిస్తానని స్వయంగా రజనీయే తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు. అయితే రజనీ స్టేట్మెంట్ పై ఇతర రాజకీయ పార్టీల్లో కానీ లేదా ప్రముఖుల్లో గానీ పెద్దగా స్పందనే కనబడటం లేదు.
ఇంతకీ విషయం ఏమిటంటే గతంలో కూడా రజనీ పార్టీ పెడతానని చాలాసార్లు చెప్పినట్లే ఇఫుడు కూడా చెప్పారంటూ ముఖ్యమంత్రి పళనిస్వామి చాలా తేలిగ్గా తీసిపారేశారు. పార్టీ పేరు, విధి విధానాలు ప్రకటించినపుడు చూసుకోవచ్చులే అని మీడియాతోనే చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. అలాగే ఇతర పార్టీల్లో కూడా రజనీ పెట్టబోయే పార్టీ విషయంలో పెద్దగా టెన్షన్ కూడా ఉన్నట్లు లేదు. ఎందుకంటే కొత్తగా పార్టీ పెట్టి దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళేటప్పటికే ఎన్నికలైపోతాయి.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే 2021, మేలో ఎన్నికలు జరగబోతున్నాయి. మేలో ఎన్నికలంటే కనీసం 45 రోజుల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి. అంటే ఏప్రిల్ రెండోవారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. రజనీ ఏమో పార్టీని డిసెంబర్ 31న ప్రకటిస్తానని చెప్పారు. అంటే పార్టీ ప్రకటన నుండి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు మధ్యలో మహా అయితే ఓ మూడు నెలలు మాత్రమే వ్యవధి ఉంటుంది. మరి ఈ మూడు నెలల్లో జనాల్లోకి పార్టీని తీసుకెళ్ళేదెలాగ ? సభ్యత్వ నమోదును పక్కనపెట్టేసినా అభ్యర్ధుల ఎంపికంటే మామూలు విషయం కాదు.
రజనీ పార్టీ ప్రకటిస్తే చాలు ఓట్లవే వచ్చి పడిపోతాయని చెప్పటానికి ఇదేమీ సినిమా కాదు. ఎందుకంటే బలమైన డిఎంకే, అధికార ఏఐఏడిఎంకె లాంటి గట్టిపార్టీలు చాలానే ఉన్నాయి. వాటన్నింటినీ తట్టుకుని తన అభ్యర్ధులను గెలిపించుకోవాలంటే మూడు, నాలుగు మాసాల సమయం ఏ విధంగాను సరిపోదు. ఈ విషయాలన్నింటినీ అంచనా వేసుకునే మిగిలిన పార్టీలు రజనీ పొలిటికల్ ఎంట్రీని చాలా తేలిగ్గా తీసుకున్నట్లున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న లెక్కలు రజనీకి తెలియకుండానే ఉంటాయా ? మరి తెలిసి కూడా ఏ లెక్క ప్రకారం ప్రకటనిచ్చేసి మళ్ళీ హైడవుట్ లోకి వెళ్ళిపోయారు? చూద్దాం డిసెంబర్ 31వ తేదీన ఏం చేస్తారో ?
This post was last modified on December 9, 2020 7:10 am
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…