Political News

పవర్ స్టార్… ఇప్పుడు అభినవ శ్రీకృష్ణదేవరాయ!

ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవద్గీత ఒకసారి చదివి, ఎర్ర వస్త్రంతో కప్పి పూజా గదిలో దాచే గ్రంథం కాదన్నారు. మన జీవితంలో ప్రతి నిర్ణయం, ప్రతి గందరగోళం, ప్రతి మానసిక సమస్యకు పరిష్కారంగా మనల్ని నడిపించే ఙ్ఞానం భగవద్గీత అని పేర్కొన్నారు. భగవద్గీతలోని అంశాలను ప్రత్యేకంగా స్మరించుకునేందుకు, నేటి తరానికి భగవద్గీత గొప్పతనాన్ని వివరించేందుకు ఉడుపిలో ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహించారు..

అనంతరం పవన్ కళ్యాణ్ కు”అభినవ కృష్ణ దేవరాయ” అనే బిరుదును పీఠాధిపతి సుగుణేంద్ర స్వామీజీ ప్రధానం చేశారు. విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయల ఆశయాలకు అనుగుణంగా భారతీయ సంస్కృతిని, హిందూ ధర్మాన్ని కాపాడటానికి పవన్ కళ్యాణ్‌ చేస్తున్న కృషిని, ప్రయత్నాలను గుర్తించి ఉడిపి శ్రీ కృష్ణ మఠానికి చెందిన పీఠాధిపతి ఆయనను “అభినవ శ్రీ కృష్ణ దేవరాయ” అనే బిరుదుతో గౌరవించారు. విశేషం ఏమిటంటే ఉడిపి శ్రీ కృష్ణ మఠం అభినవ శ్రీ కృష్ణ దేవరాయ బిరుదు ప్రదానం చేస్తూ ఒకర్ని సత్కరించటం ఇదే తొలిసారి. 

పవన్ కళ్యాణ్ ఇంకా ఏమన్నారంటే.. సినిమాలు, వినోదానికి ప్రజలు భారీగా ఖర్చు చేస్తున్నాం. మన సంస్కృతికి ప్రతీక అయిన గోమాతను కాపాడడం కూడా అందరి బాధ్యత అని పిలుపునిచ్చారు. “వ్యక్తిగతంగా నేను 60 ఆవులను సంరక్షిస్తూ గోశాల న‌డుపుతున్నాను. మనం పూజించే పవిత్ర గోమాతను రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. అక్రమ వధపై కఠిన చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో ఆవులను సంరక్షించడం కూడా ఎంతో అవసరం,” అని అన్నారు.

This post was last modified on December 8, 2025 9:58 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పెద్ద ప్రభాస్ రిటర్న్స్… టికెట్ ధరలు నార్మల్

నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…

33 minutes ago

శ్రీలీల కోరుకున్న బ్రేక్ దొరికిందా

సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…

1 hour ago

ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే రచ్చే

రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…

2 hours ago

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

5 hours ago

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

7 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

7 hours ago