Political News

పవర్ స్టార్… ఇప్పుడు అభినవ శ్రీకృష్ణదేవరాయ!

ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవద్గీత ఒకసారి చదివి, ఎర్ర వస్త్రంతో కప్పి పూజా గదిలో దాచే గ్రంథం కాదన్నారు. మన జీవితంలో ప్రతి నిర్ణయం, ప్రతి గందరగోళం, ప్రతి మానసిక సమస్యకు పరిష్కారంగా మనల్ని నడిపించే ఙ్ఞానం భగవద్గీత అని పేర్కొన్నారు. భగవద్గీతలోని అంశాలను ప్రత్యేకంగా స్మరించుకునేందుకు, నేటి తరానికి భగవద్గీత గొప్పతనాన్ని వివరించేందుకు ఉడుపిలో ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహించారు..

అనంతరం పవన్ కళ్యాణ్ కు”అభినవ కృష్ణ దేవరాయ” అనే బిరుదును పీఠాధిపతి సుగుణేంద్ర స్వామీజీ ప్రధానం చేశారు. విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయల ఆశయాలకు అనుగుణంగా భారతీయ సంస్కృతిని, హిందూ ధర్మాన్ని కాపాడటానికి పవన్ కళ్యాణ్‌ చేస్తున్న కృషిని, ప్రయత్నాలను గుర్తించి ఉడిపి శ్రీ కృష్ణ మఠానికి చెందిన పీఠాధిపతి ఆయనను “అభినవ శ్రీ కృష్ణ దేవరాయ” అనే బిరుదుతో గౌరవించారు. విశేషం ఏమిటంటే ఉడిపి శ్రీ కృష్ణ మఠం అభినవ శ్రీ కృష్ణ దేవరాయ బిరుదు ప్రదానం చేస్తూ ఒకర్ని సత్కరించటం ఇదే తొలిసారి. 

పవన్ కళ్యాణ్ ఇంకా ఏమన్నారంటే.. సినిమాలు, వినోదానికి ప్రజలు భారీగా ఖర్చు చేస్తున్నాం. మన సంస్కృతికి ప్రతీక అయిన గోమాతను కాపాడడం కూడా అందరి బాధ్యత అని పిలుపునిచ్చారు. “వ్యక్తిగతంగా నేను 60 ఆవులను సంరక్షిస్తూ గోశాల న‌డుపుతున్నాను. మనం పూజించే పవిత్ర గోమాతను రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. అక్రమ వధపై కఠిన చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో ఆవులను సంరక్షించడం కూడా ఎంతో అవసరం,” అని అన్నారు.

This post was last modified on December 8, 2025 9:58 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

విజయ్ కి మద్దతు.. కాంగ్రెస్ కు పెద్ద లాసే?

తమిళనాడు రాజకీయాల్లో ఏర్పడ్డ కొత్త సమీకరణాలు దేశ రాజకీయాల్లో పెను మార్పునకు దారి తీశాయని చెప్పక తప్పదు. మరో మూడేళ్లలో…

24 minutes ago

పవన్ చొరవతో క్షేమంగా ఇల్లు చేరిన ముస్లిం మహిళ

బతుకుదెరువు కోసం విదేశం వెళ్లిన ఏపీకి చెందిన ముస్లిం మహిళ అక్కడ విష వలయంలో చిక్కుకుంది. ఆ ఉచ్చు నుంచి…

7 hours ago

రిస్క్ ఉన్నా ముందుకెళ్తున్న అబ్బవరం

ఇటీవలే కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి తిమ్మరాజుపల్లి టీవీ తీశారు. మొదటి మూడు రోజులు తెగ హడావిడి చేశారు. గొప్ప…

7 hours ago

ఎల్లమ్మ సమస్యకు ఏది ముగింపు

దేవిశ్రీ ప్రసాద్ ని హీరోగా పరిచయం చేస్తూ నిర్మాత దిల్ రాజు ప్రకటించిన ఎల్లమ్మ ఇప్పటికీ రెగ్యులర్ షూటింగ్ కు…

8 hours ago

దేవిశ్రీ.. అంత:కరణశుద్ధితో..

సంగీత దర్శకులు హీరోలు కావడం తమిళ ఇండస్ట్రీలో ఇప్పటికే చూశాం. విజయ్ ఆంటోనీ, జి.వి.ప్రకాష్ కుమార్ లాంటి వాళ్లు సినీ…

10 hours ago

ఇక కాంగ్రెస్ వాళ్లతో కూర్చోలేం

ఇటీవల జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్తో డీఎంకే పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే అయితే కేవలం ఐదు సీట్లు…

11 hours ago