ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లపై వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆ ముగ్గురు 420 చేష్టలు చేస్తున్నారని, వారిపై చీటింగ్ కేసు పెట్టి బొక్కలో వెయ్యాలని షాకింగ్ కామెంట్లు చేశారు.
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు మాట తప్పారని జగన్ విమర్శించారు. ఎన్నికలకు ముందు అన్ని బస్సులలో ఉచిత ప్రయాణం అని చెప్పిన చంద్రబాబు గెలిచిన తర్వాత కొన్ని బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం అని మోసం చేశారని దుయ్యబట్టారు.
ఇదే తరహాలో ఏదైనా చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు మోసం చేస్తే వారిపై చీటింగ్ కేసు పెట్టి ఉండేవారు కదా అని జగన్ ప్రశ్నించారు. ఈ ముగ్గురి మోసాలపై ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 రాయరని, వాళ్ళంతా ఒకటే దొంగల ముఠా అని, దోచుకుని పంచుకుని తింటుంటారని ఎద్దేవా చేశారు.
అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ కాకుండా రైతులకు ఏటా రూ.20 వేలు ఇస్తామన్నారని, రెండేళ్లకు రూ.40 వేలు ఇస్తామన్నారని, ఇచ్చింది రూ.10 వేలు అని, ఇది మోసం కాదా? అని ప్రశ్నించారు.
తల్లికి వందనం లబ్ధిదారులను రెండో ఏడాది ఏకంగా 20 లక్షల మందికి తగ్గించారని ఆరోపణలు చేశారు.
నిరుద్యోగ భృతి కింద నెలకు 3 వేల చొప్పున రెండేళ్లకు 72 వేలు ఇవ్వాలని, ఇచ్చారా? అని ప్రశ్నించారు.
18 ఏళ్లు నిండిన మహిళలకు ఆడబిడ్డ నిధి కింద ఏడాదికి రూ.18000ల చొప్పున రెండేళ్లకు రూ.36,000 ఇవ్వలేదని విమర్శించారు.
వచ్చే మూడేళ్లలో తానేంటో చూపిస్తానని.. వైసీపీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…
ఏదైనా థియేటర్ వెళ్ళినప్పుడు సినిమా ప్రారంభానికి ముందు జనాన్ని ఇబ్బంది పెడుతున్నవి స్మోకింగ్ యాడ్సే. వాటి వెనుక మంచి ఉద్దేశం…
పదిహేనేళ్ల కుర్రాడే కదా అని స్లెడ్జింగ్ చేస్తే రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందో శ్రీలంక బౌలర్లకు ప్రాక్టికల్ గా అర్థమైంది.…
జూన్ 21.. ప్రపంచ యోగా దినోత్సవం. భారత్ లో రూపుదిద్దుకున్న ఈ ప్రాచీన యోగా విద్యను యావత్తు ప్రపంచం ఆనుసరించడం…
2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…
ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిలీజ్రోజు ఇచ్చిన థియేటర్లను జనంతో నింపడమే కష్టమైపోతోంది. జనం థియేటర్లకు రావడం…