ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లపై వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆ ముగ్గురు 420 చేష్టలు చేస్తున్నారని, వారిపై చీటింగ్ కేసు పెట్టి బొక్కలో వెయ్యాలని షాకింగ్ కామెంట్లు చేశారు.
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు మాట తప్పారని జగన్ విమర్శించారు. ఎన్నికలకు ముందు అన్ని బస్సులలో ఉచిత ప్రయాణం అని చెప్పిన చంద్రబాబు గెలిచిన తర్వాత కొన్ని బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం అని మోసం చేశారని దుయ్యబట్టారు.
ఇదే తరహాలో ఏదైనా చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు మోసం చేస్తే వారిపై చీటింగ్ కేసు పెట్టి ఉండేవారు కదా అని జగన్ ప్రశ్నించారు. ఈ ముగ్గురి మోసాలపై ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 రాయరని, వాళ్ళంతా ఒకటే దొంగల ముఠా అని, దోచుకుని పంచుకుని తింటుంటారని ఎద్దేవా చేశారు.
అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ కాకుండా రైతులకు ఏటా రూ.20 వేలు ఇస్తామన్నారని, రెండేళ్లకు రూ.40 వేలు ఇస్తామన్నారని, ఇచ్చింది రూ.10 వేలు అని, ఇది మోసం కాదా? అని ప్రశ్నించారు.
తల్లికి వందనం లబ్ధిదారులను రెండో ఏడాది ఏకంగా 20 లక్షల మందికి తగ్గించారని ఆరోపణలు చేశారు.
నిరుద్యోగ భృతి కింద నెలకు 3 వేల చొప్పున రెండేళ్లకు 72 వేలు ఇవ్వాలని, ఇచ్చారా? అని ప్రశ్నించారు.
18 ఏళ్లు నిండిన మహిళలకు ఆడబిడ్డ నిధి కింద ఏడాదికి రూ.18000ల చొప్పున రెండేళ్లకు రూ.36,000 ఇవ్వలేదని విమర్శించారు.
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…