ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లపై వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆ ముగ్గురు 420 చేష్టలు చేస్తున్నారని, వారిపై చీటింగ్ కేసు పెట్టి బొక్కలో వెయ్యాలని షాకింగ్ కామెంట్లు చేశారు.
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు మాట తప్పారని జగన్ విమర్శించారు. ఎన్నికలకు ముందు అన్ని బస్సులలో ఉచిత ప్రయాణం అని చెప్పిన చంద్రబాబు గెలిచిన తర్వాత కొన్ని బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం అని మోసం చేశారని దుయ్యబట్టారు.
ఇదే తరహాలో ఏదైనా చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు మోసం చేస్తే వారిపై చీటింగ్ కేసు పెట్టి ఉండేవారు కదా అని జగన్ ప్రశ్నించారు. ఈ ముగ్గురి మోసాలపై ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 రాయరని, వాళ్ళంతా ఒకటే దొంగల ముఠా అని, దోచుకుని పంచుకుని తింటుంటారని ఎద్దేవా చేశారు.
అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ కాకుండా రైతులకు ఏటా రూ.20 వేలు ఇస్తామన్నారని, రెండేళ్లకు రూ.40 వేలు ఇస్తామన్నారని, ఇచ్చింది రూ.10 వేలు అని, ఇది మోసం కాదా? అని ప్రశ్నించారు.
తల్లికి వందనం లబ్ధిదారులను రెండో ఏడాది ఏకంగా 20 లక్షల మందికి తగ్గించారని ఆరోపణలు చేశారు.
నిరుద్యోగ భృతి కింద నెలకు 3 వేల చొప్పున రెండేళ్లకు 72 వేలు ఇవ్వాలని, ఇచ్చారా? అని ప్రశ్నించారు.
18 ఏళ్లు నిండిన మహిళలకు ఆడబిడ్డ నిధి కింద ఏడాదికి రూ.18000ల చొప్పున రెండేళ్లకు రూ.36,000 ఇవ్వలేదని విమర్శించారు.
This post was last modified on December 4, 2025 1:25 pm
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేసిన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ పాటలు…
రేపు సాయంత్రం విడుదల కాబోతున్న దురంధర్ ది రివెంజ్ ని చివరి నిమిషం ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతున్నాయని బాలీవుడ్ టాక్.…
ప్యాన్ ఇండియా సినిమాలు ఎంత బడ్జెట్ తో తీశామనేది ఎంత ముఖ్యమో వాటిని ఎంత బాగా ప్రమోట్ చేసుకుంటారనేది అంతకన్నా…
పశ్చిమ బెంగాల్లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. గత మూడు సార్లుగా ఇక్కడ అధికారంలో ఉన్న దీదీ..…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కేవలం ఎనిమిది నెలల్లో మూడో సినిమా రాబోతోంది. గత ఏడాది రెండు నెలల…
కాదేది బూతుకు అనర్హం అన్నారో సినీ కవి. కొందరు దీన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే కన్నడ ప్యాన్…