Political News

భారత్ బంద్ కు పెరుగుతున్న మద్దతు

కేంద్రప్రభుత్వం ఆమోదించిన నూతన వ్యవసాయ సంస్కరణల చట్టానికి వ్యతిరేకంగా రైతులు ఇచ్చిన భారత్ బంద్ పిలుపుకు అనూహ్యంగా మద్దతు పెరుగుతోంది. దాదాపు నెలరోజులకు పైగా పంజాబ్, హర్యానాల్లో రైతులు కొత్త చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కేంద్రంపై ఒత్తిడి పెంచటంలో భాగంగా పై రాష్ట్రాల్లోని రైతు సంఘాలు ఛలో డిల్లీ కార్యక్రమంలో ఉన్నాయి. దాదాపు 10 రోజులుగా ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లో వంటా వార్పు లాంటి కార్యక్రమాలతో వేలాదిమంది రైతులు ఢిల్లీని ముట్టడించారు.

రైతుల ఆందోళనను గమనించిన కేంద్రం ఇప్పటికి మూడుసార్లు చర్చలు జరిపినా ఉపయోగం కనబడలేదు. కొత్త చట్టాన్ని ఉపసంహరించేది లేదన్న నిర్ణయం తీసుకుని రైతు సంఘాలతో సమావేశం అవుతున్న కారణంతోనే చర్చలు ఫెయిలవుతున్నాయి. చర్చలు ఎప్పుడైతే విఫలమయ్యాయో రైతులకు దేశవ్యప్తంగా మద్దతు పెరిగిపోతోంది. ఇందులో భాంగంగానే రైతు సంఘాలు ఇచ్చిన మంగళవారం భారత్ బంద్ కు దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా మద్దతు పెరుగుతోంది. ఎన్డీయేతర పార్టీలు కూడా తాజాగా రంగంలోకి దిగాయి. కాంగ్రెస్, శివసేన, టీఆర్ఎస్, ఆర్జేడీ లాంటి పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి.

రాజకీయ పార్టీలతో పాటు కార్మిక సంఘాలు, వామపక్షాలతో పాటు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘాలు కూడా రైతులకు మద్దతు ప్రకటించాయి. ఎన్డీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో భారత్ బంద్ కు తాము స్వచ్చంధంగా సహకరిస్తామంటూ ప్రభుత్వాలే ప్రకటించాయి. మెల్లిగా పంజాబులో మొదలైన రైతుల ఆందోళన చూస్తుండగానే డిల్లీదాకా పాకింది. రైతులతో మాత్రమే మొదలైన ఈ ఉద్యమం ఇపుడు ఎన్డీయేతర పార్టీలు, కార్మిక సంఘాలు, బ్యాంకు ఉద్యోగుల సంఘాలతో పాటు నాన్ ఎన్డీయే ప్రభుత్వాల మద్దతు కూడగట్టేదాకా చేరుకుంది.

రైతులు డిమాండ్ చేస్తున్నట్లుగా నూతన వ్యవసాయ చట్టాన్ని ఉపసంహరించటాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రిస్టేజ్ గా తీసుకున్నట్లు కనబడుతోంది. ఒకవైపు రైతులకు మేలు జరుగుతుందని చెబుతున్న కేంద్రం మరి అదే రైతులు చట్టాన్ని ఉపసంహరించమని అడుగుతుంటే ఎందుకు వెనకాడుతోంది. వాళ్ళడిగినట్లుగా రద్దు విషయాన్ని ఎందుకు ఆలోచించటం లేదు. అంటే నూతన వ్యవసాయ చట్టంలో అంబాని, అదానీ లాంటి కార్పొరేట్లకు మాత్రమే మేలు చేస్తుందనే రైతు సంఘాల ఆరోపణలు నిజమే అనే అనుమానాలు పెరుగుతున్నాయి. మరి కేంద్రం గనుక ఇలాగే మొండిపట్టుదలతో ఉంటే భవిష్యత్తులో తీరని నష్టం జరగటం ఖాయమనేమో.

This post was last modified on December 7, 2020 10:32 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

విచార‌ణ మ‌ధ్య‌లో `సెక్స్` వీడియోలు.. హైకోర్టు జ‌డ్జికి షాక్‌!

అది ఢిల్లీ హైకోర్టు. ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఓ కేసు విచార‌ణను ఆన్‌లైన్‌లో ప్రారంభించారు. కొన్ని నిమిషాలు జ‌రిగాయి. వ‌ర్చువ‌ల్ విచార‌ణ‌లో…

2 hours ago

ప‌సుపు జెండా పౌరుషం ఎప్పుడూ త‌గ్గ‌లేదు

టీడీపీ నూత‌న కార్య‌వ‌ర్గ ప్ర‌మాణ స్వీకారం ఘ‌నంగా జ‌రిగింది. ఇటీవ‌ల పార్టీలో జాతీయ‌, రాష్ట్ర స్థాయి కార్య‌వ‌ర్గాల‌తోపాటు.. పొలిట్ బ్యూరోను…

5 hours ago

పెద్ద ట్విస్టు… పెద్ది విడుదల తేదీ ఇదా

మెగా ఫ్యాన్స్ కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న శుభ వార్త పెద్ది విడుదల తేది. ఏప్రిల్ 30 నుంచి…

6 hours ago

కేర‌ళం నాడి: విజ‌య‌న్‌.. ప‌రాజ‌య‌న్‌.. కాంగ్రెస్‌కే మొగ్గు!

కేర‌ళంలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సుదీర్ఘ విరామం త‌ర్వాత‌.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తోందా? అంటే.. ఔన‌నే అంటు న్నాయి……

7 hours ago

అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్‌… స‌ర్వేల‌న్నీ.. క‌మ‌లం వైపే!

ఈశాన్య రాష్ట్రం అస్సాంలో బీజేపీ త‌న ప‌ట్టును వ‌రుసగా మూడో సారి కూడా నిలబెట్టుకుంటోంద‌ని స‌ర్వే సంస్థ‌లు తేల్చి చెప్పాయి.…

7 hours ago

మోదీ vs దీదీ – బెంగాల్ పీఠం ఎవరిది? ఎగ్సిట్ పోల్స్ వచ్చేశాయి…

దీదీనా-మోదీనా నినాదంతో జ‌రిగిన ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోటీలో మోదీదే పైచేయి అని బీజేపీనే విజ‌యం ద‌క్కించు కుంటుంద‌ని…

7 hours ago