కేంద్రప్రభుత్వం ఆమోదించిన నూతన వ్యవసాయ సంస్కరణల చట్టానికి వ్యతిరేకంగా రైతులు ఇచ్చిన భారత్ బంద్ పిలుపుకు అనూహ్యంగా మద్దతు పెరుగుతోంది. దాదాపు నెలరోజులకు పైగా పంజాబ్, హర్యానాల్లో రైతులు కొత్త చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కేంద్రంపై ఒత్తిడి పెంచటంలో భాగంగా పై రాష్ట్రాల్లోని రైతు సంఘాలు ఛలో డిల్లీ కార్యక్రమంలో ఉన్నాయి. దాదాపు 10 రోజులుగా ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లో వంటా వార్పు లాంటి కార్యక్రమాలతో వేలాదిమంది రైతులు ఢిల్లీని ముట్టడించారు.
రైతుల ఆందోళనను గమనించిన కేంద్రం ఇప్పటికి మూడుసార్లు చర్చలు జరిపినా ఉపయోగం కనబడలేదు. కొత్త చట్టాన్ని ఉపసంహరించేది లేదన్న నిర్ణయం తీసుకుని రైతు సంఘాలతో సమావేశం అవుతున్న కారణంతోనే చర్చలు ఫెయిలవుతున్నాయి. చర్చలు ఎప్పుడైతే విఫలమయ్యాయో రైతులకు దేశవ్యప్తంగా మద్దతు పెరిగిపోతోంది. ఇందులో భాంగంగానే రైతు సంఘాలు ఇచ్చిన మంగళవారం భారత్ బంద్ కు దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా మద్దతు పెరుగుతోంది. ఎన్డీయేతర పార్టీలు కూడా తాజాగా రంగంలోకి దిగాయి. కాంగ్రెస్, శివసేన, టీఆర్ఎస్, ఆర్జేడీ లాంటి పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి.
రాజకీయ పార్టీలతో పాటు కార్మిక సంఘాలు, వామపక్షాలతో పాటు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘాలు కూడా రైతులకు మద్దతు ప్రకటించాయి. ఎన్డీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో భారత్ బంద్ కు తాము స్వచ్చంధంగా సహకరిస్తామంటూ ప్రభుత్వాలే ప్రకటించాయి. మెల్లిగా పంజాబులో మొదలైన రైతుల ఆందోళన చూస్తుండగానే డిల్లీదాకా పాకింది. రైతులతో మాత్రమే మొదలైన ఈ ఉద్యమం ఇపుడు ఎన్డీయేతర పార్టీలు, కార్మిక సంఘాలు, బ్యాంకు ఉద్యోగుల సంఘాలతో పాటు నాన్ ఎన్డీయే ప్రభుత్వాల మద్దతు కూడగట్టేదాకా చేరుకుంది.
రైతులు డిమాండ్ చేస్తున్నట్లుగా నూతన వ్యవసాయ చట్టాన్ని ఉపసంహరించటాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రిస్టేజ్ గా తీసుకున్నట్లు కనబడుతోంది. ఒకవైపు రైతులకు మేలు జరుగుతుందని చెబుతున్న కేంద్రం మరి అదే రైతులు చట్టాన్ని ఉపసంహరించమని అడుగుతుంటే ఎందుకు వెనకాడుతోంది. వాళ్ళడిగినట్లుగా రద్దు విషయాన్ని ఎందుకు ఆలోచించటం లేదు. అంటే నూతన వ్యవసాయ చట్టంలో అంబాని, అదానీ లాంటి కార్పొరేట్లకు మాత్రమే మేలు చేస్తుందనే రైతు సంఘాల ఆరోపణలు నిజమే అనే అనుమానాలు పెరుగుతున్నాయి. మరి కేంద్రం గనుక ఇలాగే మొండిపట్టుదలతో ఉంటే భవిష్యత్తులో తీరని నష్టం జరగటం ఖాయమనేమో.
This post was last modified on December 7, 2020 10:32 am
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…