Political News

షాకింగ్‌: రాష్ట్ర మంత్రుల ఫోన్లు హ్యాకింగ్‌?

తెలంగాణ‌లోని ప‌లువురు మంత్రుల ఫోన్లు హ్యాక‌య్యాయి. ముఖ్యంగా యాక్టివ్‌గా ఉండే నాయ‌కుల ఫోన్ల‌ను హ్యాక‌ర్లు టార్గెట్ చేశారు. వీరి ఫోన్ల‌లోని వాట్సాప్ గ్రూపుల‌ను హ్యాక్ చేసిన‌ట్టు పోలీసులు గుర్తించారు. అదేవిధంగా కొంద‌రు జాతీయ మీడియా జ‌ర్నిలిస్టుల ఫోన్ల‌ను కూడా హ్యాక‌ర్లు టార్గెట్ చేసుకున్నారు. అయితే.. హ్యాక‌ర్ల ఉద్దేశం ఏంట‌నేది తెలియాల్సి ఉంది. వీరి ఫోన్ల‌కు `ఎస్‌బీఐ` పేరుతో ఏపీకే ఫైళ్ల‌ను పంపించారు. ఈ విష‌యాన్ని గుర్తించిన సైబ‌ర్ పోలీసులు మంత్రులు, జ‌ర్నలిస్టుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు.

ఏం జ‌రిగింది?

ఆదివారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల త‌ర్వాత‌.. కొంద‌రు మంత్రుల వాట్సాప్ గ్రూపుల‌కు ఎస్‌బీఐ పేరుతో సందేశాలు పంపారు. వ‌రుస‌గా వ‌చ్చిన ఈ సందేశాల‌తో ఒక‌రిద్ద‌రు మంత్రుల‌కు సందేహం వ‌చ్చింది. దీంతో వారు తమ పీఏల ద్వారా .. విష‌యం తెలుసుకున్నారు. కొంద‌రు హ్యాక‌ర్లు.. ఈ ప‌నిచేశార‌ని గుర్తించారు. ఫోన్ల‌ను హ్యాక్ చేసే క్ర‌మంలో కీల‌క స‌మాచారాన్ని రాబ‌ట్టేందుకు ముందుగా వాట్సాప్ గ్రూపుల‌ను టార్గెట్ చేసుకుంటున్నార‌ని.. పోలీసులు తెలిపారు. ఏపీకే ఫైళ్ల‌ను అస్స‌లు క్లిక్ చేయొద్ద‌ని.. ఇది చేస్తే మొత్తంగా ఫోన్ హ్యాక‌ర్ల చేతిలోకి వెళ్లిపోతుంద‌ని చెప్పారు.

మెసేజ్‌లో ఏముంది?

సైబ‌ర్ నేర‌గాళ్లు పంపించిన ఎస్ బీఐ మెసేజ్‌లో “ మీ ఆధార్ అప్ డేట్ చేసుకోవాలి. మీ పాన్ కార్డు అప్ డేట్ చేసుకోండి.“ అని పేర్కొన్నారు. వాస్త‌వానికి ఇలాంటి ఫైల్స్ వ‌స్తే.. సంబంధిత సంస్థ‌పై అనుమానం వ‌స్తుంది. కానీ, ఇక్క‌డే హ్యాక‌ర్లు తెలివి ప్ర‌ద‌ర్శించారు. ప్ర‌తిష్ఠాత్మ‌క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)లోగోను వినియోగించుకుని ఫోన్ల‌ను హ్యాక్ చేయాల‌ని భావించారు. ఇదే ప‌నిని జ‌ర్న‌లిస్టుల విష‌యంలోనూ చేశారు. ఈ కేవైసీ పేరుతో చేసిన ఈ వ్య‌వ‌హారంపై త‌క్ష‌ణ‌మే స్పందించిన సైబ‌ర్ పోలీసులు.. మంత్రులు, జ‌ర్న‌లిస్టుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు.

అయితే.. అప్ప‌టికే ప‌లువురు ఎస్ బీఐ మెసేజ్‌లోపై క్లిక్ చేయ‌డంతో పలు మీడియా గ్రూపులు, సీఎంవో గ్రూపులు, డిప్యూటీ సీఎంవో గ్రూపులు, మంత్రుల అధికారిక గ్రూపులను హ్యాకర్ల తమ నియంత్రణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మంత్రుల పీఆర్వోల ఫోన్లు, జర్నలిస్టుల ఫోన్లూ హ్యాక్ అయ్యాయని సందేశాలు వచ్చాయి. రంగంలోకి దిగిన సైబ‌ర్ పోలీసులు ఏం జ‌రిగింద‌న్న విష‌యంపై ఆరా తీస్తున్నారు. హ్యాక‌ర్ల‌ను గుర్తించే ప‌నిలోనూ ప‌డ్డారు.

This post was last modified on November 23, 2025 9:51 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

దురంధర్ 2 నిడివి గురించి టెన్షన్ టెన్షన్

ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో దురంధర్ 2 నిడివి గురించి తెగ చర్చ జరుగుతోంది. ఏకంగా 3 గంటల 55 నిమిషాల…

16 minutes ago

ఖ‌మేనీని ఎందుకు చంపేశారు?.. ప్ర‌పంచం శోధించిన ప్ర‌శ్న‌!

ఇరాన్ సుప్రీం లీడ‌ర్‌(ఒక‌ర‌కంగా ప్ర‌ధాన‌మంత్రి) అయ‌తొల్లా అలీ ఖ‌మేనీని అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా జ‌రిపిన దాడుల్లో హ‌తం చేశాయి. అయితే.. అస‌లు…

2 hours ago

బామ్మ భుజాల మీద సినిమాను నడిపించారు

తెలుగులో అయినా ఒకటి రెండు హిట్లు పడుతున్నాయి కానీ తమిళ బాక్సాఫీస్ మరీ అన్యాయంగా సరైన సినిమాలు లేక అలో…

3 hours ago

స్పిరిట్ అభిమానుల కొత్త డిమాండ్

ప్రభాస్ అభిమానులు స్పిరిట్ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో చెప్పనక్కర్లేదు. దీనికన్నా ముందు ఫౌజీ వస్తుందని తెలిసినా కూడా సందీప్…

4 hours ago

నిన్న ఏపీ… నేడు నాగ్‌పూర్

వరుస పేలుళ్లు వణుకు పుట్టిస్తున్నాయి. శనివారం ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదం మరువక ముందే, ఆదివారం ఉదయం…

8 hours ago

వరల్డ్ కప్ పై వార్ ఎఫెక్ట్… ఐసీసీ ప్లాన్ B

భారత్, శ్రీలంక వేదికలుగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌పై ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం పడుతోంది. అమెరికా, ఇజ్రాయెల్…

9 hours ago