Political News

జ‌న‌సేన వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ‌.. కాపు ఓట్ల‌పైనే గురి ..!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి కీలకమైన జనసేన పార్టీ వచ్చే ఎన్నికల నాటికి సంబంధించి రాజకీయ ఎత్తుగడలను ప్రారంభించిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలోని కాపు సామాజిక వర్గాన్ని ఏకం చేయడంతో పాటు ఆ ఓటు బ్యాంకును వైసీపీ వైపు మళ్లకుండా చూసుకునే దిశగా పార్టీ అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పటికే సొంత ఇంటిని నిర్మించుకున్నారు.

తరచుగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. పిఠాపురంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు రహదారుల నిర్మాణం వేగవంతంగా జరుగుతోంది అయితే ఇది ఒక్కటే కాకుండా కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న అన్ని నియోజకవర్గాల పైన దృష్టి పెట్టాలని జనసేన భావిస్తోందిజ‌ దీనిలో భాగంగా పార్టీలకు అతీతంగా అన్ని నియోజకవర్గాల్లోనూ కాపు సామాజిక వర్గం ప్రభలంగా ఉన్న మండలాలు గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన. విద్యాసంస్థల ఏర్పాటుతో పాటు ఇతర అవసరాలను తీర్చే దిశగా నిర్ణయాలు తీసుకుంటోంది.

దీంతో కాపు సామాజిక వర్గం ఓట్లు వైసీపీకి పడకుండా చూడాల‌న్న‌దే కీల‌క నిర్ణ‌యం. గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు బ్యాంకు చీల‌కుండా చూసిన‌ట్టుగా.. వ‌చ్చే ఎన్నికల్లో కాపు ఓటు బ్యాంకు ఆపార్టీకి ద‌క్కకుండా చూడాల‌ని నిర్ణ‌యించింది. అయితే టిడిపి, లేకపోతే జనసేనకు పడేలాగా వ్యవహరిస్తున్నారు, రాజకీయాల్లో ఇటువంటి వ్యూహాలు సర్వసాధారణం, ఏ పార్టీ అయినా పైకి ఏం చెప్పినా సామాజిక వర్గాల పరంగా ఎన్నికల సమయానికి అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది, కాబట్టి ఈ దశలో కీలకమైన ఓటు బ్యాంకుగా ఉన్న కాపులను తమ వైపు తిప్పుకునేందుకు జనసేన ప్రయత్నించటం విశేషం.

ఇప్పటికే మెజారిటీ ఓటు బ్యాంకు జనసేనకు లభించింది. ఇది మరింతగా పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే ఇతర సామాజిక వర్గాల కంటే కూడా కాపులు జనసేన వైపు మళ్లేందుకు మెజారిటీ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తొలుత ఈ దిశగా అడుగులు వేయాలని పార్టీ నిర్ణయించింది. దీనిలో భాగంగానే కాపు సామాజిక వర్గం ప్రభలంగా ఉన్న అన్ని నియోజకవర్గాల పైన దృష్టి పెట్టి కాపాడుకునే దిశగా అడుగులు వేస్తూ ఉండడం గమనార్హం.

This post was last modified on November 21, 2025 12:31 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

3 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

5 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

6 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

8 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

10 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

11 hours ago