ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. సభ్యులకు మాట్లాడే అవకాశం ఇస్తున్నారు. అధికా ర పక్షం గురించి పక్కన పెడితే.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తరఫున పలువురుఎమ్మెల్యేలు సభలో చర్చకు దిగుతున్నారు. సరే.. వివాదాలు.. సస్పెన్షన్ల విషయాన్ని పక్కన పెడితే.. పలువురు ఎమ్మెల్యేలు తమ సమస్యలను సభ దృష్టికి తెస్తున్నారు. దీంతో ఒకరిద్దరుమంత్రులు ఆయా సమస్యలపై దృష్టి పెట్టి.. పరిష్కరి స్తామంటూ.. హామీలు ఇస్తున్నారు. అయితే.. ఇదే టీడీపీ తరఫున గత ఏడాది ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేల్లో నలుగురు ప్రత్యక్షంగా వైసీపీకి మద్దతిస్తున్నారు.
చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, గన్నవరం సభ్యుడు వల్లభనేని వంశీ, విశాఖ నగర ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గిరిధర్ల పరిస్థితి దారుణంగా ఉందని అంటున్నారు.. వారి అనుచరులు. కొన్నాళ్ల కిందట వీరంతా వైసీపీకి మద్దతుదారులుగా మారారు. అయితే.. అలాగని.. టీడీపీ సభ్యత్వం వదులుకునే పరిస్థితి లేదు. పోనీ.. వైసీపీకి అనుకూలంగా వాయిస్ వినిపిద్దామా. అంటే.. అది కూడా లేదు. నిజానికి సభలో సమస్యలు వినిపించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆయా నియోజకవర్గాల్లో అబివృద్ది విషయంపై ప్రజల తరఫున గళం వినిపించాలని వీరికి కూడా ఉంది.
కానీ, సభలో ఏ పార్టీ సభ్యుడిగా మాట్లాడేందుకు మైక్ ఇవ్వమని స్పీకర్కు అభ్యర్థించాలి? టీడీపీ తరఫున గెలుపు గుర్రం ఎక్కారు కనుక ఆ పార్టీ తరఫున మైక్ ఇవ్వమని అడగాలి. కానీ, ఆ పార్టీతో విభేదించి.. వైసీపీకి మద్దతుగా మారారు కనుక.. అలా అడగలేరు. పోనీ.. వైసీపీ తరఫున అడుగుతారా? అంటే.. అది సాధ్యంకా దు. దీంతో ఆ నలుగురు ప్రజా సమస్యల విషయంలో మౌనం పాటిస్తున్నారు. వారికి మాట్లాడాలనే ఉన్నా.. వేసిన అడుగులు.. పార్టీల జంపింగులు ఇప్పుడు వారికి పెను శాపంగా మారాయి. మరి ఇలా ఎన్నాళ్లు మౌనంగా ఉంటారు? అనేది కీలక ప్రశ్న.
అంతేకాదు.. ప్రజా సమస్యలపై స్పందించరా? ప్రజల తరఫున వాయిస్ వినిపించరా? అంటే.. ఏమో
అనే సమాధానమే వస్తుండడం గమనార్హం. ఏదేమైనా.. తాము తీసుకున్న గోతిలో తామే పడ్డారంటారే.. అలా ఉంది.. టీడీపీ జంపింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి. ఇలా అయితే.. వచ్చే ఎన్నికల నాటికి ప్రజలు వీరిని నిలదీసే అవకాశం లేకపోలేదని అంటున్నారు పరిశీలకులు. దేనినైనా భరించొచ్చు.. కానీ, ప్రజాగ్రహం పెల్లుబికితే మాత్రం కష్టమే అంటున్నారు. మరి టీడీపీ జంపింగులు ఎలా ప్రిపేర్ అవుతారో చూడాలి.
This post was last modified on December 3, 2020 10:09 pm
రాజమౌళితో సినిమా చేయడం ఏ నటుడికైనా ఒక వరమే. రెండు దశాబ్దాలకు పైగా కెరీర్లో ఇప్పటిదాకా ఆయన అపజయమే ఎరుగలేదు.…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ కోసం.. బీజేపీ నేతలు ఎదురు చూస్తున్నారు. అయితే.. ఇదేదో పార్టీలకు సంబంధించిన…
తెలుగు రాష్ట్రాల్లోనే ఐకానిక్ థియేటర్ గా పేరున్న సుదర్శన్ 35 ఎంఎంలో దేవర కటవుట్ హఠాత్తుగా మంటల్లో కాలిపోవడం అభిమానులను…
టాలీవుడ్ అతిలోకసుందరిగా పేరు గాంచిన స్వర్గీయ శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ మీద మన ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన అభిమానం ఉంది.…
ఈ రోజు విడుదలైన దేవర పార్ట్ 1లో దావూది పాటని ఫైనల్ ఎడిటింగ్ లో తీసేసిన విషయాన్ని మా సైట్…
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనకు వెళ్తున్నారు. రేపు(శనివారం) ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. ఇదంతా తిరుమల శ్రీవారి…