Political News

టీడీపీ జంపింగ్ ఎమ్మెల్యేల ప‌రిస్థితి ఇలా అయిందేంటి?

ప్ర‌స్తుతం ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. స‌భ్యుల‌కు మాట్లాడే అవ‌కాశం ఇస్తున్నారు. అధికా ర ప‌క్షం గురించి ప‌క్క‌న పెడితే.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ త‌ర‌ఫున ప‌లువురుఎమ్మెల్యేలు స‌భ‌లో చ‌ర్చ‌కు దిగుతున్నారు. స‌రే.. వివాదాలు.. స‌స్పెన్ష‌న్ల విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. ప‌లువురు ఎమ్మెల్యేలు త‌మ స‌మస్య‌ల‌ను స‌భ దృష్టికి తెస్తున్నారు. దీంతో ఒక‌రిద్ద‌రుమంత్రులు ఆయా స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెట్టి.. ప‌రిష్క‌రి స్తామంటూ.. హామీలు ఇస్తున్నారు. అయితే.. ఇదే టీడీపీ త‌ర‌ఫున గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన ఎమ్మెల్యేల్లో న‌లుగురు ప్ర‌త్య‌క్షంగా వైసీపీకి మ‌ద్ద‌తిస్తున్నారు.

చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి, గ‌న్న‌వ‌రం స‌భ్యుడు వ‌ల్ల‌భ‌నేని వంశీ, విశాఖ న‌గ‌ర ఎమ్మెల్యే వాసుప‌ల్లి గ‌ణేష్‌, గుంటూరు ప‌శ్చిమ ఎమ్మెల్యే గిరిధ‌ర్‌ల ప‌రిస్థితి దారుణంగా ఉంద‌ని అంటున్నారు.. వారి అనుచ‌రులు. కొన్నాళ్ల కింద‌ట వీరంతా వైసీపీకి మ‌ద్ద‌తుదారులుగా మారారు. అయితే.. అలాగ‌ని.. టీడీపీ స‌భ్య‌త్వం వ‌దులుకునే ప‌రిస్థితి లేదు. పోనీ.. వైసీపీకి అనుకూలంగా వాయిస్ వినిపిద్దామా. అంటే.. అది కూడా లేదు. నిజానికి స‌భ‌లో స‌మ‌స్య‌లు వినిపించాల్సిన అవ‌స‌రం ఎంతో ఉంది. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో అబివృద్ది విష‌యంపై ప్ర‌జ‌ల త‌ర‌ఫున గ‌ళం వినిపించాల‌ని వీరికి కూడా ఉంది.

కానీ, స‌భ‌లో ఏ పార్టీ స‌భ్యుడిగా మాట్లాడేందుకు మైక్ ఇవ్వ‌మ‌ని స్పీక‌ర్‌కు అభ్య‌ర్థించాలి? టీడీపీ త‌ర‌ఫున గెలుపు గుర్రం ఎక్కారు క‌నుక ఆ పార్టీ త‌ర‌ఫున మైక్ ఇవ్వ‌మ‌ని అడ‌గాలి. కానీ, ఆ పార్టీతో విభేదించి.. వైసీపీకి మ‌ద్ద‌తుగా మారారు క‌నుక‌.. అలా అడ‌గ‌లేరు. పోనీ.. వైసీపీ త‌ర‌ఫున అడుగుతారా? అంటే.. అది సాధ్యంకా దు. దీంతో ఆ న‌లుగురు ప్ర‌జా స‌మ‌స్య‌ల విష‌యంలో మౌనం పాటిస్తున్నారు. వారికి మాట్లాడాల‌నే ఉన్నా.. వేసిన అడుగులు.. పార్టీల జంపింగులు ఇప్పుడు వారికి పెను శాపంగా మారాయి. మ‌రి ఇలా ఎన్నాళ్లు మౌనంగా ఉంటారు? అనేది కీల‌క ప్ర‌శ్న‌.

అంతేకాదు.. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై స్పందించ‌రా? ప్ర‌జ‌ల త‌ర‌ఫున వాయిస్ వినిపించ‌రా? అంటే.. ఏమో అనే స‌మాధాన‌మే వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. ఏదేమైనా.. తాము తీసుకున్న గోతిలో తామే ప‌డ్డారంటారే.. అలా ఉంది.. టీడీపీ జంపింగ్ ఎమ్మెల్యేల ప‌రిస్థితి. ఇలా అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ప్ర‌జ‌లు వీరిని నిల‌దీసే అవ‌కాశం లేక‌పోలేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దేనినైనా భ‌రించొచ్చు.. కానీ, ప్ర‌జాగ్ర‌హం పెల్లుబికితే మాత్రం క‌ష్ట‌మే అంటున్నారు. మ‌రి టీడీపీ జంపింగులు ఎలా ప్రిపేర్ అవుతారో చూడాలి.

This post was last modified on December 3, 2020 10:09 pm

Share

Recent Posts

దేవర కలెక్షన్లపై డిస్ట్రిబ్యూటర్ క్లారిటీ

ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…

3 hours ago

ఏజెంట్‌లో నన్ను చూసి అసహ్యమేసింది – అఖిల్

అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…

5 hours ago

కొత్త విద్యా మంత్రిగా జోషి… ఎవరీయన?

కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…

6 hours ago

విజయ్ బలహీనతే కిరణ్ బలం

బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…

7 hours ago

‘స్పైడర్ మ్యాన్’ రచ్చ చేసేలా ఉన్నాడు

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…

8 hours ago

జగన్ లాజిక్… ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ కి లోకేష్ కు ముడి!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ…

8 hours ago