Political News

జూబ్లీహిల్స్… ఆ పార్టీ వైపే ఎగ్జిట్ పోల్స్ మొగ్గు!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణతో పాటు ఏపీలోనూ తీవ్ర స్థాయిలో రాజకీయ ఉత్కంఠ రేపిన సంగతి తెలిసిందే. ఈ ఒక్క స్థానంలో గెలుపు కోసం అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ అస్త్రశస్త్రాలు ప్రయోగించాయి. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల మధ్య అయితే ఓ రేంజ్ లో మాటల యుద్ధం జరిగింది. ఈ క్రమంలోనే ఈ రోజు సాయంత్రం పోలింగ్ ముగిసింది. దీంతో, గెలుపెవరిది అని ప్రాథమిక అంచనా వేసే ఎగ్జిట్ పోల్స్ అంచనాలవైపు అందరి దృష్టి మళ్లింది.

ఈ క్రమంలోనే మెజారిటీ సర్వేలు కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేస్తున్నాయి. కాంగ్రెస్ కు 46 శాతం, బీఆర్ఎస్ కు 43 శాతం, బీజేపీకి 6 శాతం ఓట్లు వస్తాయని చాణక్య స్ట్రాటజీస్ అంచనా వేసింది. కాంగ్రెస్ పార్టీ 48.3శాతం, బీఆర్ఎస్ 43.18శాతం, బీజేపీ 5.84 శాతం ఓట్లు సాధిస్తాయని హెచ్ఎంఆర్ సర్వే భావిస్తోంది. కాంగ్రెస్ 48.2శాతం, బీఆర్ఎస్ 42.1 శాతం, బీజేపీ 7.6 శాతం, ఇతరులు 2.1శాతం ఓట్లు దక్కించునే చాన్స్ ఉందని స్మార్ట్ పోల్ సర్వే అభిప్రాయపడింది.

ఇక, ఆత్మ‌సాక్షి సర్వే అంచ‌నా ప్ర‌కారం కాంగ్రెస్‌కు 46.5 శాతం, బీఆర్ఎస్‌ కు 44.5 శాతం, బీజేపీకి 6.5 శాతం ఓట్లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం కాంగ్రెస్ 48 శాతం, బీఆర్ఎస్ 41 శాతం, బీజేపీ 6 శాతం ఓట్లు దక్కించుకునే చాన్స్ ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయో లేదో తేలాలంటే ఈ నెల 14 వరకు వేచి చూడక తప్పదు. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని వీ6 ఛానెల్ తన సర్వేలో వెల్లడించింది. ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుస్తారని కేకే సర్వే అంచనా వేసింది.

This post was last modified on November 11, 2025 8:16 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

‘జగన్ కు అధికారంలో రెడ్లు.. లేనపుడు కాపులు కావాలి’

జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబును ముద్రగడ పద్మనాభం పరామర్శించడం, జనసేన పార్టీలో ఉన్నా ఆయన కుమార్తె ఈ…

4 minutes ago

పరీక్షలో కథ రాసిన హీరో.. కట్ చేస్తే..!

డైరెక్టర్ కమ్ హీరోగా సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తూ యూత్ ఫుల్ హీరోగా సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు ప్రదీప్ రంగనాథ్.…

10 minutes ago

ఆ మహిళ తో వీడియోలు వ్యక్తిగత విషయమంటోన్న MLA

తనపై ఓ మహిళ చేసిన లైంగిక ఆరోపణలపై జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తొలిసారి మీడియా ముందు స్పందించారు. అది…

15 minutes ago

ఆరెంజ్ ఎన్నిసార్లు చూస్తారయ్యా

కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన సినిమాగా ఆరెంజ్ మీద ఓ…

2 hours ago

పలాస దర్శకుడికి విషమ పరీక్ష

ఏడేళ్ల క్రితం వచ్చిన పలాసతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కరుణ కుమార్. తక్కువ ఖర్చులో స్టార్ క్యాస్టింగ్ లేకుండా…

4 hours ago

నిజాం గడ్డపై ‘కింగ్’ కన్ను

అక్కినేని నాగార్జున హీరోనే కాదు.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఐతే ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో ఆయన అన్నపూర్ణ సంస్థలో…

6 hours ago