Political News

చంద్రబాబుకు జగన్ భయపడ్డాడా?

గత ఏడాది ఎన్నికల్లో ఏకంగా 151 సీట్లు సాధించింది వైఎస్సార్ కాంగ్రెస్. తెలుగుదేశం 23 స్థానాలకు పరిమితమైంది. ఇక అప్పట్నుంచి ప్రతిపక్షాన్ని అధికార పక్షం ఎలా ఆడుకుంటూ ఉందో చూస్తూనే ఉన్నాం. ఎప్పుడూ అధికార పార్టీ.. తెలుగుదేశంను ఇబ్బంది పెట్టడం, భయపెట్టడమే చూస్తున్నాం. ప్రతిపక్షం లేవనెత్తే ఏ అంశాన్నీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. పంతానికి అయినా వాళ్ల డిమాండ్లను విస్మరిస్తూ వస్తోంది.

ఇక అసెంబ్లీలో అయితే అధికార పార్టీ ఎంత దూకుడుగా వ్యవహరిస్తోందో.. ప్రతిపక్షాన్ని ఎలా బెంబేలెత్తిస్తోందో తెలిసిందే. తాజాగా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా.. అధికార పార్టీ అదే దూకుడును ప్రదర్శించింది. చంద్రబాబును జగన్ సహా అందరూ టార్గెట్ చేశారు. ఆయన ఆవేశపడుతుంటే వాళ్లు కామెడీగా తీసుకున్నారు. ఐతే అసెంబ్లీలో గాంభీర్యం ప్రదర్శించనప్పటికీ.. కొన్ని గంటలు గడిచేసరికి ప్రభుత్వం భయపడిందని స్పష్టమవుతోంది.

2019 సంవత్సరానికి సంబంధించి పంటల బీమా విషయంలో ప్రభుత్వం రైతులను మోసం చేసిందని చంద్రబాబు ఆరోపించారు. అసలు రైతుల కోసం ప్రభుత్వం బీమానే చెల్లించలేదని, సమాచార హక్కు చట్టం ద్వారా తీసిన సమాచారంతో సభలో ఆధారాలు చూపించింది టీడీపీ. ఈ విషయమై మాట మార్చి డిసెంబరు 15న కడతామని మాట మార్చింది ప్రభుత్వం. సకాలంలో బీమా చెల్లించకపోవడం వల్ల రైతులకు 2 వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు కూడా టీడీపీ వాదించింది. ఐతే ఈ విషయం జనాల్లోకి వెళ్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ప్రభుత్వం అర్థం చేసుకున్నట్లుంది. ఈ విషయమై యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. నిన్న అసెంబ్లీ సమావేశాల్లో పంట బీమాపై చర్చ జరిగిన కొన్ని గంటలకే.. రాత్రి 9 గంటలకు రైతుల షేర్ కింద 590 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లించేందుకు జీవోను విడుదల చేసింది ప్రభుత్వం. దీన్ని బట్టి చంద్రబాబుకు జగన్ భయపడ్డాడనడంలో సందేహం ఏముంది?

This post was last modified on December 1, 2020 3:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అన్నగారు వచ్చేలా లేరు

నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి…

49 seconds ago

‘హైదరాబాద్ హౌస్’లో పుతిన్ బస.. ఈ ప్యాలెస్ ఎవరిదో తెలుసా?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…

5 hours ago

బోకేలు, శాలువాలు లేవు… పవన్ రియాక్షన్ ఏంటి?

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…

8 hours ago

నెగిటివిటీ వలయంలో దురంధర్ విలవిలా

బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…

8 hours ago

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

10 hours ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

11 hours ago