Political News

లోకేశ్ దర్బార్..అర కిలోమీటరు క్యూ!

ప్రజా ప్రతినిధి…అంటే ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రజలు ఎన్నుకున్న నేత. తమ నియోజకవర్గం నుంచి గెలిపించి శాసన సభకు పంపితే ప్రజా సమస్యలు పరిష్కరిస్తారని ప్రజలు నమ్మి ఆ నేతకు ఓటేస్తారు. అసెంబ్లీలో కావచ్చు…బయట కావచ్చు…తమ ప్రాంత సమస్యలు తీరుస్తారని ప్రజలు నమ్మి వారిని గెలిపిస్తుంటారు. కానీ, చాలామంది ఎమ్మెల్యేలు గెలవగానే ప్రజల సమస్యలు పట్టించుకోవడం మానేస్తారు. ఇక, ఆ ఎమ్మెల్యే మంత్రి కూడా అయితే చాలా బిజీ అయిపోయి..ప్రజలతో చాలా గ్యాప్ వస్తుంది. ఇక, క్షణం తీరిక లేకుండా బిజీగా ఉంటే ఏపీ ఐటీ, విద్యా శాఖా మంత్రి నారా లోకేశ్ వంటి నేతలకైతే ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునేంత తీరిక, ఓపిక ఉండే ఛాన్సే లేదు.

ఇలా అనుకునే వారంతా పప్పులో..తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఏపీలో పెట్టుబడుల వేటలో, వరుస విదేశీ పర్యటనలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో మాత్రం లోకేశ్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. క్షణం తీరిక లేని బిజీ షెడ్యూల్ లో ఉన్నప్పటికీ ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు రూపొందించిన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని మాత్రం లోకేశ్ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు మంగళగిరిలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి జనం తండోపతండాలుగా తరలివచ్చారు. లోకేశ్ ను కలిసేందుకు వచ్చిన జనంతో అక్కడ అర కిలోమీటర్ క్యూ లైన్ ఏర్పడింది.

లోకేశ్ దర్బార్ కు వచ్చిన ప్రజల నుంచి అర్జీలు, వినతి పత్రాలు స్వీకరించిన లోకేశ్…వాటిని చెత్తబుట్టలో పడేయకుండా సత్వర పరిష్కారానికి కృషి చేస్తున్నారు. సంబంధిత అధికారులను ఆయా సమస్యలు పరిష్కరించాలని ఆదేశిస్తుంటారు. అందుకే, లోకేశ్ దర్బార్ కు హాజరయ్యేందుకు మంగళగిరి పరిసర ప్రాంతాల ప్రజలతోపాటు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చారు. తండ్రికి తగ్గ తనయుడిగా లోకేశ్ తమ సమస్యలు నేరుగా విని పరిష్కరించడంపై దర్బార్ కు వచ్చిన ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పదవి ఉంటే ఈ స్థాయిలో ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్న లోకేశ్..భవిష్యతులో తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని, అప్పుడు మరింతమంది సమస్యలు పరిష్కరిస్తారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

This post was last modified on November 4, 2025 5:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

15 minutes ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

3 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

6 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

6 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

9 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

11 hours ago