Political News

వందేమాత‌రాన్ని కూడా కాంగ్రెస్ అవ‌మానించింది: మోడీ

వందేమాత‌రం గీతాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అవ‌మానించింద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ విమ‌ర్శిం చారు. స్వాతంత్య్ర సంగ్రామంలో వందేమాత‌రం నినాదం కీల‌క భూమిక పోషించింద‌న్నారు. అదేవిధంగా జాతి ఐక్య‌త‌కు, సంఘీభావానికి వందేమాతరం ప్ర‌తీక‌గా నిలిచింద‌ని తెలిపారు. కానీ, కాంగ్రెస్ పార్టీ దీనిని కూడా అవ‌మానించింద‌ని.. వందేమాత‌రంలోని కొన్నిపంక్తుల‌ను తొల‌గించింద‌ని విమ‌ర్శించారు.

దేశ మాజీ ఉప ప్ర‌ధాని, ఐక్య‌తా మూర్తి… స‌ర్దార్ వ‌ల్ల‌భ్ భాయ్ ప‌టేల్ 150వ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని నిర్వ‌హిస్తున్న ఐక్య‌తా దినోత్స‌వాన్ని ప్ర‌తి ఒక్క‌రూ గుర్తుంచుకోవాల‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ తెలిపారు. దేశ ప్ర‌జ‌లంతా ఐక్యంగా ఉండాల‌ని పిలుపునిచ్చారు. గుజ‌రాత్‌లోని ఏక్తాన‌గ‌ర్‌లో ఉన్న స‌ర్దార్ వ‌ల్ల‌భ్‌భాయ్‌ప‌టేల్ విగ్ర‌హం వ‌ద్ద‌ నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన మంత్రి కీల‌కోప‌న్యాసం చేశారు.

భార‌తీయులంద‌రూ ఐక్యంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప్ర‌ధాని ఉద్ఘాటించారు. జ‌మ్ము క‌శ్మీర్ విష‌యంలో ఆర్టిక‌ల్ 370 బంధ‌నాల‌ను తొల‌గించ‌డంతో అక్క‌డి ప్ర‌జ‌లకు స్వేచ్ఛ ల‌భించింద‌ని తెలిపా రు. ఆప‌రేష‌న్ సిందూర్ ద్వారా ఉగ్ర‌వాదుల‌పై జ‌రిపిన పోరును ప్ర‌పంచం మొత్తం చూసింద‌న్నారు. భార‌త దేశ పాట‌వం ఏమిటో పాకిస్థాన్ స‌హా.. ఉగ్ర‌వాదులకు కూడా తెలిసి వ‌చ్చింద‌న్నారు. భార‌త దేశానికి హాని క‌లిగించాల‌ని అనుకునే వారికి ఆప‌రేష‌న్ సిందూర్ సింహ‌స్వ‌ప్న‌మ‌ని ప్ర‌ధాని చెప్పారు.

దేశంలో 2014 త‌ర్వాత అనేక స‌వాళ్ల‌ను ప‌రిష్క‌రించామ‌ని ప్ర‌ధాన మంత్రి తెలిపారు. న‌క్స‌లిజం స‌హా మావోయిస్టుల తీవ్ర‌వాదాన్ని అణిచి వేస్తున్నామ‌ని చెప్పారు. వ‌చ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశం నుంచి న‌క్స‌లిజాన్ని త‌రిమికొట్ట‌డం ఖాయ‌మ‌ని ప్ర‌ధాని ఉద్ఘాటించారు. చొర‌బాటు దారుల వ్య‌వ‌హారం దేశానికి తీవ్ర సమ‌స్య‌గా ప‌రిణ‌మించింద‌ని ప్ర‌ధాని చెప్పారు. చొర‌బాటు దారులు దేశ ఐక్య‌, అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌కు స‌వాలు విసురుతున్నార‌ని తెలిపారు.

కొన్ని ద‌శాబ్దాలుగా విదేశీ చొర‌బాటు దారులు దేశంలోకి ప్ర‌వేశిస్తున్నార‌న్న ప్ర‌ధాని వారు మ‌న పౌరుల వ‌న‌రుల‌ను వినియోగించు కుంటూ.. మ‌న భౌగోళిక స‌మ‌తుల్యాన్ని దెబ్బ‌తీసే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని తెలిపారు. కానీ, గ‌త ప్ర‌భుత్వాలు ఈ విష‌యాన్ని ప‌ట్టించుకోలేద‌న్నారు. జాతీయ భ‌ద్ర‌త విష‌యంలో గ‌త ప్ర‌భుత్వాలు రాజీ ప‌డ్డాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దేశ స‌మ‌గ్ర‌త‌ను ప‌రిర‌క్షించ‌డంలో తొలిసారి ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌న్నారు. మ‌రికొద్ది రోజుల్లోనే వందేమాత‌రం 150వ వ‌సంతోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించుకోనున్నామ‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ తెలిపారు.

This post was last modified on October 31, 2025 12:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

2 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

3 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

5 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

7 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

8 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

8 hours ago