Political News

వైసీపీ వల్ల టీఆర్ఎస్ కు ఎంత లాభం ?

అవును గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికల్లో రాజకీయ సమీకరణలు చిత్ర విచిత్రంగా మారిపోతున్నాయి. మిత్రులెవరో, శతృవులెరో అర్ధం కావటం లేదు. ఇటువంటి పరిస్దితుల్లో అధికార టీఆర్ఎస్ ని ఏపిలో అధికారపార్టీ వైసీపీ ఆదుకునేందుకు సిద్ధమైపోయిందనే ప్రచారం ఒక్కసారిగా ఊపందుకుంది. వైసీపీ ఏ విధంగా టీఆర్ఎస్ ను ఆదుకోగలదు ? అన్న విషయంపైనే అందరిలోను సందేహాలు పెరిగిపోతున్నాయి.

విషయం ఏమిటంటే గెలుస్తుందో లేదో తెలీదు కానీ గ్రేటర్ పీఠాన్ని గెలిచేసేంత హడావుడి చేస్తోంది బీజేపీ. దీనికి మూలం ఏమిటంటే దుబ్బాక ఉపఎన్నికలో గెలవటమే అని అందరికీ తెలుసు. అయితే ఆ గెలుపు ఊపులో ఉన్న రఘునందనరావు ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓ విషయంలో కేసీయార్ ను తీవ్రంగా హెచ్చరించారు. కేసీయార్ ను హెచ్చరిక క్రమంలో ఎంఎల్ఏ ఏమి చేశారంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ను పిక్చర్లోకి తీసుకొచ్చారు.

‘పావురాల గుట్టలో ఒకాయన మాయమైపోయినట్లే నువ్వు కూడా గట్లనే మాయమైపోతావు’ అంటూ చేసిన హెచ్చరికతో వైఎస్సార్ అభిమానులు, వైసీపీ శ్రేణులంతా రెచ్చిపోయారు. ఎంఎల్ఏను తిట్టిన తిట్టు తిట్టకుండా బూతులు తిట్టారు. అలాగే గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టింగులు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయంలో ఎంఎల్ఏ క్షమాపణ చెప్పుకున్నా వైఎస్సార్ అభిమానులు మాత్రం వెనక్కి తగ్గలేదు.

గ్రేటర్ పరిధిలో సీమాంధ్రుల ప్రభావం సుమారు 35 డివిజన్లలో ఉంటుందని ఓ అంచనా. వీళ్ళలో వైఎస్సార్ అభిమానులు, వైసీపీ శ్రేణులు ఎంతమందని లెక్కగట్టడం కష్టమే. హార్డుకోర్ టీడీపీ అభిమానులు, చంద్రబాబునాయుడు సామాజికవర్గం వాళ్ళని తీసేస్తే మిగిలిన వాళ్ళలో ఎంతో కొంత మంది వైఎస్సార్ అభిమానులు, వైసీపీ శ్రేణులున్నారన్నది మొన్నటి ఘటన తర్వాత అందరికీ అర్ధమైంది. రేపటి ఎన్నికల్లో వాళ్ళంతా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని డిసైడ్ అయ్యారు.

మరి బీజేపీకి వ్యతిరేకమంటే టీఆర్ఎస్ కే పడుతుందని చెప్పలేం. ఎందుకంటే తెలంగాణ వరకు రెడ్లు జగన్ పై అభిమానం ఉన్నా… వారు కేసీఆర్ వ్యతిరేక వర్గమే. అయితే, వాట్సప్ మాధ్యమాల్లో పార్టీ టీఆర్ఎస్ కు మద్దతు పలకమని పిలుపునిచ్చినట్లు సామాజిక మాధ్యమాల ద్వారా బయటపడింది. కాబట్టి తెలంగాణ రెడ్లు ఎటేసినా.. సీమాంధ్ర రెడ్లు, జగన్ అభిమానులు టీఆర్ఎస్ వైపే నిలిచే అవకాశం ఉంది. దుబ్బాక ఎంఎల్ఏ నోటి దురుసు వల్ల బీజేపీకి ఎంత నష్టం జరుగుతుందన్నది పోలింగ్ తర్వాత కానీ తెలీదు.

This post was last modified on November 30, 2020 2:07 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

చంద్ర‌బాబుకు ఊపిరి పోసిన అమిత్ షా!

టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు.. బిగ్ బ్రేక్ వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రంలోని పెద్ద‌లు ఎవ‌రూ.. ముఖ్యంగా బీజేపీ అగ్ర‌నాయ‌కులుగా ఉన్న‌వారు…

5 hours ago

ఏపీ డీజీపీ బ‌దిలీ : ఈసీ యాక్ష‌న్‌

ఏపీలో సంచ‌ల‌నం చోటు చేసుకుంది. ఎన్నిక‌ల వేళ అధికార పార్టీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న ఆరోప‌ణల నేప‌థ్యంలో ఇప్ప‌టికే చాలా మంది…

5 hours ago

కుటుంబాల్లో పొలిటిక‌ల్‌ క‌ల్లోలం!

ఏపీలో ఎన్నిక‌ల‌కు మ‌రో వారం రోజులు మాత్ర‌మే గ‌డువు ఉంది. ఈ నెల 13న అంటే వ‌చ్చే సోమ‌వారం.. ఎన్నిక‌ల…

6 hours ago

ఇండియన్-2 ఫిక్స్.. గేమ్‌చేంజర్‌కు భయం లేదు

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగా పవర్ స్టార్ ఆలస్యం చేయకుండా శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ మొదలుపెట్టేశాడని చాలా సంతోషించారు మెగా…

7 hours ago

జ‌గ‌న్ రాముడిని అవ‌మానించాడు.. అమిత్ షా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

కేంద్ర మంత్రి, బీజేపీ అగ్ర‌నేత‌.. అమిత్ షా.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశా రు.…

8 hours ago

పుష్ప గొంతు విప్పాడు

ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. ‘పుష్ప: ది రైజ్’తో…

9 hours ago