Political News

బీజేపీ ఆఫీసులో డిష్యుం-డిష్యుం?

హైద‌రాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాల‌యంలో బీసీ సంఘాల నాయ‌కులు, బీజేపీ నేత‌ల మ‌ధ్య వాగ్వాదంతో మొద‌లైన వివాదం చేయి చేయి క‌లిసే వ‌ర‌కు వెళ్లింది. ఒక‌రిపై ఒక‌రు చేయి చేసుకున్నారు. తోసుకున్నారు. నెట్టుకున్నారు. దీంతో తీవ్ర‌స్థాయిలో ర‌చ్చ చోటు చేసుకుంది. అయితే.. ఈ ఘ‌ర్ష‌ణ చోటు చేసుకున్న‌ప్పుడు.. బీసీ సంఘాల జాతీయ అధ్య‌క్షుడు, పార్ల‌మెంటు స‌భ్యుడు ఆర్‌. కృష్ణ‌య్య‌, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్‌రావు కూడా అక్క‌డే ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ ఇరు ప‌క్షాల నాయ‌కులు ఆగ‌క‌పోగా.. మ‌రింత రెచ్చిపోయి దూష‌ణ‌ల‌కు దిగారు. తోసుకున్నారు.

ఏం జ‌రిగింది?

ఈ నెల 18న బీసీ సంఘాల ఆధ్వ‌ర్యంలో రాష్ట్ర వ్యాప్త నిర‌స‌న‌ల‌కు, బంద్‌కు పిలుపునిచ్చారు. దీనికి బీసీ జాతీయ అధ్య‌క్షుడు ఆర్. కృష్ణ‌య్య నేతృత్వం వ‌హిస్తున్నారు. స్థానిక సంస్ఘ‌ల ఎన్నిక‌ల్లో బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌న్న‌ది ప్ర‌ధాన డిమాండ్‌. ఇప్ప‌టికే ప‌లు సంఘాల‌తో క‌లిసి ఈ విష‌యంపై చ‌ర్చించిన ఆర్‌. కృష్ణ‌య్య‌.. ప‌లు సంఘాల‌ను క‌లుపుకొని బీసీ జేఏసీగా ఏర్ప‌డ్డారు. ఈ క్ర‌మంలో ఇత‌ర పార్టీల‌ను కూడా క‌లుపుకొని ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించారు. దీనిలో భాగంగానే బీజేపీ రాష్ట్ర అద్య‌క్షుడు రామ‌చంద‌ర్‌రావుతో చ‌ర్చించేందుకు బుధ‌వారం సాయంత్రం ఆయ‌న కార్యాల‌యానికి వ‌చ్చారు.

బీసీల‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరారు. ఈ క్ర‌మంలో ప‌లు అంశాల‌పై ఆర్ . కృష్ణ‌య్య.. బీజేపీ చీఫ్‌కు వివ‌రించారు. ఆయ‌న కూడా సంతృప్తి వ్య‌క్తం చేశారు. తాము కూడా బీసీల‌కు మ‌ద్ద‌తు ఇస్తామ‌ని, మా ప్ర‌ధాని బీసీనేన‌ని వ్యాఖ్యానించారు. ఈ క్ర‌మంలో చ‌ర్చ‌ల అనంత‌రం.. ఇరువురు మీడియా ముందుకు వ‌చ్చి మాట్లాడేందుకు సిద్ధ‌మ‌య్యారు. మ‌రోవైపు.. అటు బీజేపీ, ఇటుబీసీ సంఘాల‌కు చెందిన కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు పెద్ద ఎత్తున బీజేపీ కార్యాల‌యానికి వ‌చ్చారు. రామ‌చంద‌ర్‌రావు, కృష్ణ‌య్య‌లు మీడియా ముందుకు వ‌స్తున్న స‌మ‌యంలో రామ‌చంద‌ర్‌రావును ‘జూనియ‌ర్‌’ అంటూ ఓ బీసీ నాయ‌కుడు వ్యాఖ్యానించారు.

ఈ వ్య‌వ‌హారం ముదిరి.. మాట‌ల తూటాలు పేలాయి. ఎవ‌రు జూనియ‌ర్ అంటూ.. బీజేపీ నాయ‌కులు నిల‌దీశారు. అలాంట‌ప్పుడు త‌మ ఆఫీసుకు ఎందుకు వ‌చ్చార‌ని నిల‌దీశారు. ఇలా.. ఇరు ప‌క్షాలు మాట‌ల దాడి చేసుకుంటున్న స‌మ‌యంలోనే ఒక‌రు చేయి రువ్వారు. ఇది తీవ్ర గ‌లాటాకు.. తోపులాట‌ల‌కు.. కుర్చీలు విసురుకునే దాకా సాగింది. ఈ క్ర‌మంలో జోక్యం చేసుకున్న కృష్ణ‌య్య‌.. ఇరు ప‌క్షాల‌ను స‌ర్దిచెప్పేందుకు ప్ర‌య‌త్నించారు. కానీ, ఎక్క‌డా ఎవ‌రూ త‌గ్గ‌క‌పోవ‌డంతో మీడియా మీటింగును ర‌ద్దు చేసి.. కార్యాల‌యం నుంచి కార్యక‌ర్త‌ల‌ను బ‌య‌ట‌కు పంపించారు.

This post was last modified on October 16, 2025 6:28 am

Share

Recent Posts

జ‌న‌సేన ఎమ్మెల్యే రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తారా ..?

తిరుప‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించిన జ‌న‌సేన నాయ‌కుడు, సీనియ‌ర్ నేత ఆర‌ణి శ్రీనివాసులు రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై ఆస‌క్తిక‌ర…

33 minutes ago

రకుల్ సినిమాల్లోకి వచ్చింది కారు కోసమే

కొందరు నటనలోకి రావాలని ముందే ఒక లక్ష్యం పెట్టుకుని పని చేస్తారు. కొందరు అనుకోకుండా ఈ రంగంలోకి అడుగు పెడతారు.…

50 minutes ago

హెచ్చరికలతో సరిపెడితే ఎలా బాబు గారు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు వైఖ‌రి.. పార్టీ నాయ‌కులకు బాగా క‌లిసి వ‌స్తోంద‌న్న‌వాద‌న వినిపిస్తోంది. ఇప్ప‌టికి రెండు సంవ‌త్స‌రాలుగా చంద్ర‌బాబు.. త‌మ్ముళ్ల‌కు…

2 hours ago

పార్టీ సమస్యలు పట్టించుకోండి సీఎం సార్

తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఎప్పటికప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. గ్రాండ్ ఓల్డ్ పార్టీలో ఈ తరహా పరిస్థితులు కొత్తేమీ…

3 hours ago

ఏజెంట్‌లో నన్ను చూసి అసహ్యమేసింది – అఖిల్

అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…

5 hours ago

దేవర కలెక్షన్లపై డిస్ట్రిబ్యూటర్ క్లారిటీ

ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…

9 hours ago