హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ సంఘాల నాయకులు, బీజేపీ నేతల మధ్య వాగ్వాదంతో మొదలైన వివాదం చేయి చేయి కలిసే వరకు వెళ్లింది. ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. తోసుకున్నారు. నెట్టుకున్నారు. దీంతో తీవ్రస్థాయిలో రచ్చ చోటు చేసుకుంది. అయితే.. ఈ ఘర్షణ చోటు చేసుకున్నప్పుడు.. బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు ఆర్. కృష్ణయ్య, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు కూడా అక్కడే ఉన్నారు. అయినప్పటికీ ఇరు పక్షాల నాయకులు ఆగకపోగా.. మరింత రెచ్చిపోయి దూషణలకు దిగారు. తోసుకున్నారు.
ఏం జరిగింది?
ఈ నెల 18న బీసీ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త నిరసనలకు, బంద్కు పిలుపునిచ్చారు. దీనికి బీసీ జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య నేతృత్వం వహిస్తున్నారు. స్థానిక సంస్ఘల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్నది ప్రధాన డిమాండ్. ఇప్పటికే పలు సంఘాలతో కలిసి ఈ విషయంపై చర్చించిన ఆర్. కృష్ణయ్య.. పలు సంఘాలను కలుపుకొని బీసీ జేఏసీగా ఏర్పడ్డారు. ఈ క్రమంలో ఇతర పార్టీలను కూడా కలుపుకొని ముందుకు సాగాలని నిర్ణయించారు. దీనిలో భాగంగానే బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు రామచందర్రావుతో చర్చించేందుకు బుధవారం సాయంత్రం ఆయన కార్యాలయానికి వచ్చారు.
బీసీలకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో పలు అంశాలపై ఆర్ . కృష్ణయ్య.. బీజేపీ చీఫ్కు వివరించారు. ఆయన కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. తాము కూడా బీసీలకు మద్దతు ఇస్తామని, మా ప్రధాని బీసీనేనని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో చర్చల అనంతరం.. ఇరువురు మీడియా ముందుకు వచ్చి మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు.. అటు బీజేపీ, ఇటుబీసీ సంఘాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున బీజేపీ కార్యాలయానికి వచ్చారు. రామచందర్రావు, కృష్ణయ్యలు మీడియా ముందుకు వస్తున్న సమయంలో రామచందర్రావును ‘జూనియర్’ అంటూ ఓ బీసీ నాయకుడు వ్యాఖ్యానించారు.
ఈ వ్యవహారం ముదిరి.. మాటల తూటాలు పేలాయి. ఎవరు జూనియర్ అంటూ.. బీజేపీ నాయకులు నిలదీశారు. అలాంటప్పుడు తమ ఆఫీసుకు ఎందుకు వచ్చారని నిలదీశారు. ఇలా.. ఇరు పక్షాలు మాటల దాడి చేసుకుంటున్న సమయంలోనే ఒకరు చేయి రువ్వారు. ఇది తీవ్ర గలాటాకు.. తోపులాటలకు.. కుర్చీలు విసురుకునే దాకా సాగింది. ఈ క్రమంలో జోక్యం చేసుకున్న కృష్ణయ్య.. ఇరు పక్షాలను సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. కానీ, ఎక్కడా ఎవరూ తగ్గకపోవడంతో మీడియా మీటింగును రద్దు చేసి.. కార్యాలయం నుంచి కార్యకర్తలను బయటకు పంపించారు.
This post was last modified on October 16, 2025 6:28 am
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…