హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ సంఘాల నాయకులు, బీజేపీ నేతల మధ్య వాగ్వాదంతో మొదలైన వివాదం చేయి చేయి కలిసే వరకు వెళ్లింది. ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. తోసుకున్నారు. నెట్టుకున్నారు. దీంతో తీవ్రస్థాయిలో రచ్చ చోటు చేసుకుంది. అయితే.. ఈ ఘర్షణ చోటు చేసుకున్నప్పుడు.. బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు ఆర్. కృష్ణయ్య, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు కూడా అక్కడే ఉన్నారు. అయినప్పటికీ ఇరు పక్షాల నాయకులు ఆగకపోగా.. మరింత రెచ్చిపోయి దూషణలకు దిగారు. తోసుకున్నారు.
ఏం జరిగింది?
ఈ నెల 18న బీసీ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త నిరసనలకు, బంద్కు పిలుపునిచ్చారు. దీనికి బీసీ జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య నేతృత్వం వహిస్తున్నారు. స్థానిక సంస్ఘల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్నది ప్రధాన డిమాండ్. ఇప్పటికే పలు సంఘాలతో కలిసి ఈ విషయంపై చర్చించిన ఆర్. కృష్ణయ్య.. పలు సంఘాలను కలుపుకొని బీసీ జేఏసీగా ఏర్పడ్డారు. ఈ క్రమంలో ఇతర పార్టీలను కూడా కలుపుకొని ముందుకు సాగాలని నిర్ణయించారు. దీనిలో భాగంగానే బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు రామచందర్రావుతో చర్చించేందుకు బుధవారం సాయంత్రం ఆయన కార్యాలయానికి వచ్చారు.
బీసీలకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో పలు అంశాలపై ఆర్ . కృష్ణయ్య.. బీజేపీ చీఫ్కు వివరించారు. ఆయన కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. తాము కూడా బీసీలకు మద్దతు ఇస్తామని, మా ప్రధాని బీసీనేనని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో చర్చల అనంతరం.. ఇరువురు మీడియా ముందుకు వచ్చి మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు.. అటు బీజేపీ, ఇటుబీసీ సంఘాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున బీజేపీ కార్యాలయానికి వచ్చారు. రామచందర్రావు, కృష్ణయ్యలు మీడియా ముందుకు వస్తున్న సమయంలో రామచందర్రావును ‘జూనియర్’ అంటూ ఓ బీసీ నాయకుడు వ్యాఖ్యానించారు.
ఈ వ్యవహారం ముదిరి.. మాటల తూటాలు పేలాయి. ఎవరు జూనియర్ అంటూ.. బీజేపీ నాయకులు నిలదీశారు. అలాంటప్పుడు తమ ఆఫీసుకు ఎందుకు వచ్చారని నిలదీశారు. ఇలా.. ఇరు పక్షాలు మాటల దాడి చేసుకుంటున్న సమయంలోనే ఒకరు చేయి రువ్వారు. ఇది తీవ్ర గలాటాకు.. తోపులాటలకు.. కుర్చీలు విసురుకునే దాకా సాగింది. ఈ క్రమంలో జోక్యం చేసుకున్న కృష్ణయ్య.. ఇరు పక్షాలను సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. కానీ, ఎక్కడా ఎవరూ తగ్గకపోవడంతో మీడియా మీటింగును రద్దు చేసి.. కార్యాలయం నుంచి కార్యకర్తలను బయటకు పంపించారు.
This post was last modified on October 16, 2025 6:28 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…