‘రాజధానిగా అమరావతిని నిర్ణయించే అధికారం అసెంబ్లీకి ఉన్నపుడు ఇదే అసెంబ్లీకి రాజధానిని మార్చే అధికారం ఎందుకుండదు’ ? ఇది తాజాగా హైకోర్టు ధర్మాసనం లాయర్లకు వేసిన సూటి ప్రశ్న. పాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానులు, సీఆర్డీయే చట్టం రద్దు తదితరాలపై జరిగిన విచారణలో పిటీషనర్ల తరపు లాయర్లను ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది. అమరావతిని మార్చే అధికారం ప్రభుత్వానికి లేదని, సీఆర్డీయే చట్టాన్ని రద్దు చేసే అధికారం లేదని, విభజన చట్టంలో మూడు రాజధానులు అని లేదని పిటీషనర్ల తరపు లాయర్లు వాదించారు.
ఈ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకుని రాజధానిని మార్చే అధికారం ప్రభుత్వానికి, అసెంబ్లీకి ఎందుకు లేదని సూటిగా ప్రశ్నించింది. అమరావతిని రాజధాని మార్చింది కూడా ఇదే ప్రభుత్వం, ఇదే అసెంబ్లీ కాదా అని అడిగినపుడు లాయర్లు ఏమీ మాట్లాడలేదు. అమరావతిని రాజధానిగా నిర్ణయించిన ఇదే అసెంబ్లీకి మరో ప్రాంతాన్ని రాజధానిగా మార్చే అధికారం లేదని ఎలా చెబుతారంటూ నిలదీసింది. పైగా అమరావతే రాజధానిగా ఉండాలని చట్టంలో ఎక్కడుందో చూపించాలని ధర్మాసనం అడిగినపుడు లాయర్లు సమాధానం చెప్పలేకపోయారు.
రాజధాని విషయంలో తమ పాత్ర లేదని కేంద్రం ఇప్పటికే అఫిడవిట్ లో స్పష్టం చేసినపుడు రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్రప్రభుత్వానిదే అన్న విషయం స్పష్టమైపోయింది కదా అని వేసిన మరో ప్రశ్నకు కూడా పిటీషనర్ల లాయర్లు సమాధానం చెప్పలేకపోయారు. రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్రప్రభుత్వానికి లేదన్నదే నిజమైతే అమరావతి రాజధానిగా ఎలా నిర్ణయమైందని అడిగిన ప్రశ్నకు కూడా లాయర్లు మౌనమే సమాధానమైంది.
మొత్తానికి రాజధాని నిర్ణయం విషయంలో కేంద్రం దాఖలు చేసిన మూడు అఫిడవిట్ల తర్వాత, పిటీషనర్ల తరపు లాయర్ల వాదనలు విన్న తర్వాత హైకోర్టు ధర్మాసానానికి రాజధాని విషయంలో స్పష్టత వచ్చిందనే అనిపిస్తోంది. మొదటి నుండి కూడా మూడు రాజధానుల నిర్ణయం, రాజధాని మార్పు విషయంలో అంతిమ నిర్ణయం తమదే అని మొదటి నుండి రాష్ట్రప్రభుత్వం వాదిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రప్రభుత్వ వాదనతో విభేదిస్తు అనేక పిటీషన్లు దాఖలయ్యాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఇప్పటికే…
మొన్న విడుదలైన బాలీవుడ్ మూవీ అల్ఫా మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కంటెంట్ బాలేకపోవడం, డిజాస్టర్లు హిందీలో కొత్త…
సంయుక్త మీనన్ ఈ ఏడాది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ…
టాలీవుడ్ నిర్మాతల్లో సూర్యదేవర నాగవంశీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగే వేరు. కొంతమంది అతణ్ని అభిమానిస్తే.. కొంతమంది తనను అదే…
టీడీపీ సీనియర్ నేత, ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు సంబందించి తెలుగు నేల ప్రజళకు ఎలాంటి…
మామూలుగా చూస్తే దినేశ్ కార్తీక్కు మురళీ విజయ్ థ్యాంక్స్ చెబితే.. అందులో వార్తేముంది అనిపించొచ్చు. కానీ వీళ్లిద్దరి మధ్య ఏం…