‘రాజధానిగా అమరావతిని నిర్ణయించే అధికారం అసెంబ్లీకి ఉన్నపుడు ఇదే అసెంబ్లీకి రాజధానిని మార్చే అధికారం ఎందుకుండదు’ ? ఇది తాజాగా హైకోర్టు ధర్మాసనం లాయర్లకు వేసిన సూటి ప్రశ్న. పాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానులు, సీఆర్డీయే చట్టం రద్దు తదితరాలపై జరిగిన విచారణలో పిటీషనర్ల తరపు లాయర్లను ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది. అమరావతిని మార్చే అధికారం ప్రభుత్వానికి లేదని, సీఆర్డీయే చట్టాన్ని రద్దు చేసే అధికారం లేదని, విభజన చట్టంలో మూడు రాజధానులు అని లేదని పిటీషనర్ల తరపు లాయర్లు వాదించారు.
ఈ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకుని రాజధానిని మార్చే అధికారం ప్రభుత్వానికి, అసెంబ్లీకి ఎందుకు లేదని సూటిగా ప్రశ్నించింది. అమరావతిని రాజధాని మార్చింది కూడా ఇదే ప్రభుత్వం, ఇదే అసెంబ్లీ కాదా అని అడిగినపుడు లాయర్లు ఏమీ మాట్లాడలేదు. అమరావతిని రాజధానిగా నిర్ణయించిన ఇదే అసెంబ్లీకి మరో ప్రాంతాన్ని రాజధానిగా మార్చే అధికారం లేదని ఎలా చెబుతారంటూ నిలదీసింది. పైగా అమరావతే రాజధానిగా ఉండాలని చట్టంలో ఎక్కడుందో చూపించాలని ధర్మాసనం అడిగినపుడు లాయర్లు సమాధానం చెప్పలేకపోయారు.
రాజధాని విషయంలో తమ పాత్ర లేదని కేంద్రం ఇప్పటికే అఫిడవిట్ లో స్పష్టం చేసినపుడు రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్రప్రభుత్వానిదే అన్న విషయం స్పష్టమైపోయింది కదా అని వేసిన మరో ప్రశ్నకు కూడా పిటీషనర్ల లాయర్లు సమాధానం చెప్పలేకపోయారు. రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్రప్రభుత్వానికి లేదన్నదే నిజమైతే అమరావతి రాజధానిగా ఎలా నిర్ణయమైందని అడిగిన ప్రశ్నకు కూడా లాయర్లు మౌనమే సమాధానమైంది.
మొత్తానికి రాజధాని నిర్ణయం విషయంలో కేంద్రం దాఖలు చేసిన మూడు అఫిడవిట్ల తర్వాత, పిటీషనర్ల తరపు లాయర్ల వాదనలు విన్న తర్వాత హైకోర్టు ధర్మాసానానికి రాజధాని విషయంలో స్పష్టత వచ్చిందనే అనిపిస్తోంది. మొదటి నుండి కూడా మూడు రాజధానుల నిర్ణయం, రాజధాని మార్పు విషయంలో అంతిమ నిర్ణయం తమదే అని మొదటి నుండి రాష్ట్రప్రభుత్వం వాదిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రప్రభుత్వ వాదనతో విభేదిస్తు అనేక పిటీషన్లు దాఖలయ్యాయి.
This post was last modified on November 28, 2020 10:15 am
రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…
పేర్ని నాని. వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి. గత ఎన్నికల్లో ఆయన పోటీ నుంచి తప్పుకొని వారసుడు కిట్టుకు…
అనిల్ రావిపూడి సినిమాలో ఛాన్స్ అంటే తెలుగులో అంతకుమించిన బంపరాఫర్ లేదన్నట్లే. హిట్ మెషీన్గా పేరు తెచ్చుకున్న అనిల్.. ఇప్పటిదాకా…
ఏఐని వాడుకుని ఇప్పుడు హీరోయిన్ల మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలతో సోషల్ మీడియా జనాలు ఎలా రెచ్చిపోతున్నారో.. ఇంటర్నెట్ ఎంత విశృంఖలంగా తయారైందో చూస్తూనే…
ఏపీకి సంబంధించి అందరూ ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటి భోగాపురం ఎయిర్ పోర్టు. భారీగా చేపట్టిన ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే..…
ఎంత గ్యాప్ వచ్చినా పర్లేదు క్వాలిటీనే ముఖ్యమనే హీరో అడివి శేష్ కొత్త సినిమా డెకాయిట్ ఈ శుక్రవారం ఏప్రిల్…