Political News

ట్రంప్ దెబ్బ: అమెరికాలో అంబటి రాంబాబు కూతురి ప్రేమ వివాహం

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూతురు శ్రీజ ప్రేమ వివాహం అమెరికాలో జరిగింది. అతికొద్దిమంది సన్నిహితుల మధ్య ఈ వివాహ వేడుక గుడిలో జరిగింది. ఈ సందర్భంగా అంబటి రాంబాబు ఒక వీడియో విడుదల చేశారు. తన కూతురు శ్రీజ అమెరికాలో ఎండోక్రైనాలజీ చదువుతోందని, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ జాస్తి హర్షను ఇష్టపడిందని ఆయన చెప్పారు. వారి ఇష్టానుసారంగా ఈ పెళ్లి జరిపించామని అన్నారు. వాస్తవానికి వారిని ఇండియాకు పిలిపించి ఘనంగా పెళ్లి చేద్దామని అనుకున్నామని, కానీ, ట్రంప్ దెబ్బకు అది కుదరలేదని తెలిపారు.

ఒకసారి ఇండియాకు వస్తే మళ్లీ ట్రంప్ అమెరికాకు రానిస్తారో లేదో తెలియని పరిస్థులున్నాయని అంబటి చమత్కరించారు. వీసా దొరక్క హర్ష తల్లిదండ్రులు ఈ వివాహానికి హాజరు కాలేదని అంబటి ఆవేదన వ్యక్తం చేశారు. మూడు సార్లు వారు వీసాకు అప్లై చేసినా రిజెక్ట్ అయిందని బాధపడ్డారు. వారు లేకుండానే ఈ పెళ్లి జరగడం బాధగా ఉందని, కానీ, కొన్ని సార్లు పరిస్థితులు మన చేతిలో ఉండవని అన్నారు. అయితే, తన కూతురు, అల్లుడు వారికి ఎప్పుడు వీలైతే అప్పుడు ఇండియాకు వస్తారని, అక్కడ గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేసి బంధుమిత్రులందరినీ ఆహ్వానిస్తానని అన్నారు.

ఒకప్పుడు డాక్టర్ చదివిన వారు మరో డాక్టర్ నే పెళ్లి చేసుకునేవారని, కానీ, ఇప్పుడు డాక్టర్, ఇంజనీర్ కాంబినేషన్ ట్రెండ్ అవుతోందని సరదాగా వ్యాఖ్యానించారు. ఇక, అమెరికాలో జరిగిన ఈ వివాహానికి హాజరైన తన మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ అంబటి కృతజ్ఞతలు తెలిపారు.

This post was last modified on October 4, 2025 3:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తరుణ్ క్యాలికులేషన్ ఎక్కడ తప్పుతోంది

పది సంవత్సరాల కెరీర్ లో కేవలం మూడు సినిమాలు తీసిన దర్శకుడు తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులు, ఈ నగరానికి…

1 hour ago

ప్యాన్ ఇండియా ‘డెవిల్’ టాక్ ఏంటి

మనకు డెవిల్ అంటే ఆ మధ్య వచ్చిన కళ్యాణ్ రామ్ సినిమా గుర్తొస్తుంది కానీ ఇటీవలే కన్నడలో విడుదలైన భారీ…

2 hours ago

మెగా ఛాన్స్ వదిలేసిన విశ్వంభర

మన శంకరవరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ ఫలితాన్ని విశ్వంభర క్యాష్ చేసుకునే దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరగకపోవడం అభిమానులను బాధ…

3 hours ago

హార్దిక్ పాండ్య ఏం సాధించాడు?

గత కొన్నేళ్లలో మోస్ట్ అన్ పాపులర్ ఇండియన్ క్రికెటర్ ఎవరు అంటే మరో మాట లేకుండా హార్దిక్ పాండ్య పేరు…

3 hours ago

క‌విత న‌న్ను ప‌దికోట్లు అడిగారు: పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప్ర‌జాశాంతి పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, ప్ర‌ముఖ సువార్తీకుడు కేఏ పాల్‌.. తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ…

4 hours ago

మ‌మ‌త ప‌రిస్థితి.. ఏపీకి పాఠం అవుతుందా?!

త‌మ్ముడు త‌మ్ముడే.. రాజ‌కీయం రాజ‌కీయ‌మే.. బీజేపీ విష‌యంలో ఇది అక్ష‌రాలా నిజం. త‌న‌కు అవ‌కాశం లేనంత సేపూ.. ఆ పార్టీ…

6 hours ago