ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని వివాదాల్లో తలదూర్చిందో తెలిసిందే. తరచుగా ఏదో ఒక వివాదాస్పద నిర్ణయంతో వార్తల్లో నిలవడం లేదా తమ పార్టీ నేతల చర్యలతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారడం వైకాపాకు అలవాటైపోయింది.
పార్టీ నేతలు అత్యుత్సాహంతోనో, ప్రచార యావతోనో చేస్తున్న కొన్ని పనులు వైకాపాను ఇరుకున పెడుతున్న మాట వాస్తవం. ముఖ్యంగా చిన్నా చితకా పనులకు ప్రారంభోత్సవాలు చేసి నవ్వుల పాలవడం వైకాపా నాయకులకు అలవాటుగా మారిపోయింది. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు ప్రహరీ గోడల ప్రారంభోత్సవాల్లో పాల్గొనడం ఇప్పటికే చూశాం. ఉండవల్లి శ్రీదేవి సహా కొందరు నేతలు ఇలాంటి చిన్న కార్యక్రమాలకు చేసిన హడావుడి సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఒక గేదెకు ప్రారంభోత్సవం చేయడానికి ఎమ్మెల్యే హాజరు కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ ఈ పని చేశారు. ఈ గేదె వ్యవహారమేంటి.. దానికి ప్రారంభోత్సవం ఏంటి అన్న వివరాలు వెల్లడి కాలేదు కానీ.. గేదె చుట్టూ కట్టెలతో బారికేడ్ల మాదిరి కట్టి.. వైకాపా జెండాలోని నీలి రంగుతో ఉన్న రిబ్బన్ కట్టి దాన్ని ఎమ్మెల్యే కట్ చేసి ప్రారంభోత్సవం జరిపారు.
గేదె తలకు వైకాపా జెండాలోనే ఉండే పచ్చ రంగుతో ఉన్న రిబ్బన్ చుట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి. దీనిపై ట్రోలింగ్ ఏ రేంజిలో నడుస్తుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మళ్లీ మళ్లీ కామెడీ అవుతున్నప్పటికీ వైకాపా నేతలు ఇలాంటి పనులెందుకు మానుకోవట్లేదో?
This post was last modified on November 27, 2020 11:19 am
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేసిన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ పాటలు…
రేపు సాయంత్రం విడుదల కాబోతున్న దురంధర్ ది రివెంజ్ ని చివరి నిమిషం ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతున్నాయని బాలీవుడ్ టాక్.…
ప్యాన్ ఇండియా సినిమాలు ఎంత బడ్జెట్ తో తీశామనేది ఎంత ముఖ్యమో వాటిని ఎంత బాగా ప్రమోట్ చేసుకుంటారనేది అంతకన్నా…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన వేళ తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆరఎస్ పార్టీ ఇరుకున పడిన విషయం తెలిసిందే. డ్రగ్స్…
పశ్చిమ బెంగాల్లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. గత మూడు సార్లుగా ఇక్కడ అధికారంలో ఉన్న దీదీ..…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కేవలం ఎనిమిది నెలల్లో మూడో సినిమా రాబోతోంది. గత ఏడాది రెండు నెలల…