ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని వివాదాల్లో తలదూర్చిందో తెలిసిందే. తరచుగా ఏదో ఒక వివాదాస్పద నిర్ణయంతో వార్తల్లో నిలవడం లేదా తమ పార్టీ నేతల చర్యలతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారడం వైకాపాకు అలవాటైపోయింది.
పార్టీ నేతలు అత్యుత్సాహంతోనో, ప్రచార యావతోనో చేస్తున్న కొన్ని పనులు వైకాపాను ఇరుకున పెడుతున్న మాట వాస్తవం. ముఖ్యంగా చిన్నా చితకా పనులకు ప్రారంభోత్సవాలు చేసి నవ్వుల పాలవడం వైకాపా నాయకులకు అలవాటుగా మారిపోయింది. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు ప్రహరీ గోడల ప్రారంభోత్సవాల్లో పాల్గొనడం ఇప్పటికే చూశాం. ఉండవల్లి శ్రీదేవి సహా కొందరు నేతలు ఇలాంటి చిన్న కార్యక్రమాలకు చేసిన హడావుడి సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఒక గేదెకు ప్రారంభోత్సవం చేయడానికి ఎమ్మెల్యే హాజరు కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ ఈ పని చేశారు. ఈ గేదె వ్యవహారమేంటి.. దానికి ప్రారంభోత్సవం ఏంటి అన్న వివరాలు వెల్లడి కాలేదు కానీ.. గేదె చుట్టూ కట్టెలతో బారికేడ్ల మాదిరి కట్టి.. వైకాపా జెండాలోని నీలి రంగుతో ఉన్న రిబ్బన్ కట్టి దాన్ని ఎమ్మెల్యే కట్ చేసి ప్రారంభోత్సవం జరిపారు.
గేదె తలకు వైకాపా జెండాలోనే ఉండే పచ్చ రంగుతో ఉన్న రిబ్బన్ చుట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి. దీనిపై ట్రోలింగ్ ఏ రేంజిలో నడుస్తుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మళ్లీ మళ్లీ కామెడీ అవుతున్నప్పటికీ వైకాపా నేతలు ఇలాంటి పనులెందుకు మానుకోవట్లేదో?
దర్శకుడు సురేందర్ రెడ్డి పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. కారణం పవన్ కళ్యాణ్ అంగీకారం వస్తే సినిమా మొదలుపెట్టాలి. ఈ…
ఏపీలో ప్రతిపక్ష పార్టీ(ప్రధాన కాదు)గా ఉన్న వైసీపీ రెండేళ్ల కాలంలో ఏం చేసింది? ఏం సాధించింది? అనేది ఆసక్తికరం. శుక్రవారం(జూన్…
దర్శకులందు అనిల్ రావిపూడి వేరయాని ఊరికే అనలేదు. షూటింగ్ మొదలుపెట్టడానికి ముందే తనదైన ప్రమోషన్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్…
దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…
రెడ్ బుక్ మూసేయలేదని.. అది ఇంకా తెరిచే ఉందని మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్లో…
ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…