పార్టీలు వేరైనా.. చంద్రబాబుకు అభిమానులు చాలా మంది ఉన్నారు. ఒక్క కమ్మ సామాజిక వర్గమనే కా కుండా.. బాబు విజన్ నచ్చిన వాళ్లు.. ఆయన దూరదృష్టి.. సంయమనం, ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో.. తెలిసిన విధానం.. ఆచితూచి వేసే అడుగులు వంటివి రాజకీయంగా చంద్రబాబును హైలెట్ చేస్తాయి. అప్పటికి .. ఇప్పటికి.. బాబు విజన్ను కొట్టిన వారు లేరు. ఈ క్రమంలోనే పార్టీలకు అతీతంగా కూడా బాబు ను అభిమానించేవారు రాష్ట్రం నుంచి కేంద్రం వరకు ఉన్నారు. వీరిలో నిన్న మొన్నటి వరకు బీజేపీలోనే ఎక్కువగా ఉండేవారు.
కంభంపాటి హరిబాబు, కన్నా లక్ష్మీనారాయణ, కామినేని శ్రీనివాసరావు, లంకా దినకర్, విష్ణుకుమార్ రాజు.. ఇలా చాలా మంది ఉన్నారు. చంద్రబాబు గెలవాలని వీరంతా గత ఎన్నికల్లో కోరుకున్నారు. అయితే.. రాజకీయంగా .. పొత్తులు కుదరలేదు. అయినప్పటికీ.. బాబు గెలుపునే వీరంతా ఆకాంక్షించారు. ఇక, చంద్రబాబు ఓటమి తర్వాత.. వీరంతా.. ప్రభుత్వాన్ని భారీగా టార్గెట్ చేశారు. తమ దైన శైలిలో జగన్ సర్కారును ఇరుకున పెట్టారు. పైకి.. చంద్రబాబుతో వైరం ఉన్నట్టుగా వ్యవహరించినా.. లోపాయికారీగా మాత్రం పొత్తులు నడిపారు.
అయితే.. ఇప్పుడు సోము వీర్రాజు పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఈ వాతావరణం ఒక్కసారిగా మారిపో యింది. చంద్రబాబుపై మాటల దాడులు పెరుగుతున్నాయి. చిన్న చితకా నాయకులు కూడా బాబుపై విమర్శలు చేస్తున్నారు. అంతెందుకు .. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.. విష్ణువర్ధన్ రెడ్డికి చంద్రబాబు రాజకీయ అనుభవం అంత కూడా వయసులేదు. అయినా కూడా ఆయన బాబుపై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇక, బాబును పరోక్షంగా వెనుకేసుకు వచ్చినవారు.. మాత్రం మౌనం వహించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏం చేయాలి?
ఈ విషయంపైనే చంద్రబాబు అంతర్మథనం చెందుతున్నారు. తాజాగా.. పార్టీ నేతలకు ఆయన నుంచి ఆదేశం అందిందని అంటున్నారు.. దీనిని బట్టి.. బీజేపీలో తనను, పార్టీ ని విమర్శిస్తున్నవారిని అంతే దీటుగా తిప్పికొట్టాలని, విమర్శించాలని ఆయన ఆదేశించినట్టు తెలుస్తోంది. మొత్తానికి బాబు వర్గం తెరమరుగు కావడం.. విమర్శించేవారు పెరగడంతో ఇరు పార్టీల మధ్య రాజకీయవ్యూహాలు సైతం పెరుగుతున్నాయి.
This post was last modified on November 24, 2020 6:02 pm
ఈ మధ్య సినిమాల్లో ఏదైనా దాచిపెట్టి సినిమాల్లో సడన్ సర్ప్రైజ్ ఇద్దామంటే అది లీక్ కాకుండా కాపాడుకోవడంలో దర్శక నిర్మాతలు…
దేశంలో వంట గ్యాస్ కు కొరత ఏర్పడితే పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయం ఇప్పటికే అర్థమైపోయిందనే చెప్పాలి. అమెరికా, ఇరాన్…
ప్రస్తుతం దేశంలోనే అత్యుత్తమ నటీమణుల్లో సాయిపల్లవి ఒకరు. తొలి చిత్రం ‘ప్రేమం’తో మొదలుపెడితే ప్రతి సినిమాతోనూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది…
ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో అత్యధిక అంచనాలున్న సినిమా.. డ్రాగన్. కేజీఎఫ్, కేజీఎఫ్ 2, సలార్ చిత్రాలతో దేశవ్యాప్తంగా…
కాసేపు పెద్ది ముచ్చట పక్కన పెడదాం. రామ్ చరణ్ తర్వాత చేయబోయే సినిమా దర్శకుడు సుకుమార్ తో అన్న సంగతి…
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం కారణంగా.. ప్రపంచ దేశాలు ఇప్పటికే చమురు, గ్యాస్ సమస్యలతో ఇరకాటంలో పడ్డాయి. అనేక దేశాల్లో మారకం…