దుబ్బాక ఉప ఎన్నికల విజయోత్సాహంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ను పక్కకు నెట్టి ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రధాన పోటీదారుగా మారిన ఆ పార్టీ.. మెజారిటీ సీట్లు గెలిచేందుకు సర్వ శక్తులూ ఒడ్డుతోంది. నిన్న కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వచ్చి పార్టీ మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేశారు.
ఇప్పుడు ఓ సంచలన నేతను జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం తురుపు ముక్క లాగా రంగంలోకి దింపుతోంది బీజేపీ. కర్ణాటకలో యూత్ నాయకుడిగా చాలా తక్కువ సమయంలో మంచి పేరు సంపాదించి.. జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారి.. మోడీ దృష్టిలో కూడా పడ్డ తేజస్వి సూర్య జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేయడానికి హైదరాబాద్ విచ్చేశాడు. మూడు పదుల వయసులోనే ఎంపీ అయిన తేజస్వి.. చాలా దూకుడుగా మాట్లాడి ప్రత్యర్థులను ఆత్మరక్షణలోకి నెట్టడంలో దిట్ట.
ఎంపీ అయ్యాక మరింతగా పేరు సంపాదించిన తేజస్వికి హైదరాబాద్లో ఘన స్వాగతం కూడా లభించింది. జాతీయ నాయకుల రేంజిలో ఆయన్ని స్వాగతించింది భాజపా క్యాడర్. ఐతే అతడికి అధికార టీఆర్ఎస్ పార్టీ మద్దతు దారులు మాత్రం వేరే రకమైన స్వాగతం చెబుతున్నారు. సోషల్ మీడియాలో తేజస్వి ఆగమనాన్ని వాళ్లు మరో రకంగా ట్రెండ్ చేస్తున్నారు. అతను హైదరాబాద్కు ఎందుకొస్తున్నాడు, వెనక్కి వెళ్లిపొమ్మంటూ ఒక బూతు మాటను జోడించి హ్యాష్ ట్యాగ్ పెడితే వేలల్లో ట్వీట్లు పడుతున్నాయి.
ఆ హ్యాష్ ట్యాగ్ జాతీయ స్థాయిలో టాప్లో ట్రెండ్ అవుతుండటం విశేషం. తేజస్వి సొంత నియోజకవర్గంలో పేరుకుపోయిన సమస్యల తాలూకు వీడియోలు బయటికి తీసి ముందు నీ నియోజకవర్గాన్ని బాగు చేసి తర్వాత హైదరాబాద్కు రా అంటూ తేజస్వికి కౌంట్లరు వేస్తూ పోస్టులు పెడుతున్నారు.
This post was last modified on November 23, 2020 5:55 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…