Political News

తేజస్వి సూర్య ఈ రోజు హైదరాబాద్ లో ట్రెండింగ్

దుబ్బాక ఉప ఎన్నికల విజయోత్సాహంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్‌ను పక్కకు నెట్టి ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ప్రధాన పోటీదారుగా మారిన ఆ పార్టీ.. మెజారిటీ సీట్లు గెలిచేందుకు సర్వ శక్తులూ ఒడ్డుతోంది. నిన్న కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వచ్చి పార్టీ మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేశారు.

ఇప్పుడు ఓ సంచలన నేతను జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం తురుపు ముక్క లాగా రంగంలోకి దింపుతోంది బీజేపీ. కర్ణాటకలో యూత్ నాయకుడిగా చాలా తక్కువ సమయంలో మంచి పేరు సంపాదించి.. జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారి.. మోడీ దృష్టిలో కూడా పడ్డ తేజస్వి సూర్య జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేయడానికి హైదరాబాద్ విచ్చేశాడు. మూడు పదుల వయసులోనే ఎంపీ అయిన తేజస్వి.. చాలా దూకుడుగా మాట్లాడి ప్రత్యర్థులను ఆత్మరక్షణలోకి నెట్టడంలో దిట్ట.

ఎంపీ అయ్యాక మరింతగా పేరు సంపాదించిన తేజస్వికి హైదరాబాద్‌లో ఘన స్వాగతం కూడా లభించింది. జాతీయ నాయకుల రేంజిలో ఆయన్ని స్వాగతించింది భాజపా క్యాడర్. ఐతే అతడికి అధికార టీఆర్ఎస్ పార్టీ మద్దతు దారులు మాత్రం వేరే రకమైన స్వాగతం చెబుతున్నారు. సోషల్ మీడియాలో తేజస్వి ఆగమనాన్ని వాళ్లు మరో రకంగా ట్రెండ్ చేస్తున్నారు. అతను హైదరాబాద్‌కు ఎందుకొస్తున్నాడు, వెనక్కి వెళ్లిపొమ్మంటూ ఒక బూతు మాటను జోడించి హ్యాష్ ట్యాగ్ పెడితే వేలల్లో ట్వీట్లు పడుతున్నాయి.

ఆ హ్యాష్ ట్యాగ్ జాతీయ స్థాయిలో టాప్‌లో ట్రెండ్ అవుతుండటం విశేషం. తేజస్వి సొంత నియోజకవర్గంలో పేరుకుపోయిన సమస్యల తాలూకు వీడియోలు బయటికి తీసి ముందు నీ నియోజకవర్గాన్ని బాగు చేసి తర్వాత హైదరాబాద్‌కు రా అంటూ తేజస్వికి కౌంట్లరు వేస్తూ పోస్టులు పెడుతున్నారు.

This post was last modified on November 23, 2020 5:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

54 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

1 hour ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

6 hours ago