Political News

‘అత‌ని క‌ణ‌తకు తుపాకీ పెట్టి.. జ‌గ‌న్ బెదిరించారు’

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి వ‌ర్సెస్‌.. ప్ర‌తిప‌క్ష వైసీపీకి మ‌ధ్య వివాదం తార‌స్థాయికి చేరింది. వైసీపీ నేత‌లు చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు పాల‌క‌మండ‌లి బోర్డు, కార్య‌నిర్వ‌హ‌ణాధికారి స‌హా.. ఇత‌ర అధికారులు దీటుగా స్పందిస్తున్నారు. ఇటీవ‌ల కాలంలో తిరుమ‌ల భ్ర‌ష్టు ప‌ట్టింద‌ని, ప‌విత్ర‌త ప్ర‌శ్నార్థ‌కంగా మారింద‌ని వైసీపీ నాయ‌కులు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా గోశాల‌లో గోవుల మృతి, తిరుప‌తిలో వైకుంఠ ద‌ర్శ‌న టోకెన్ల విష‌యంలో చోటు చేసుకున్న తొక్కిస‌లాట వంటివి బోర్డుకు ఇబ్బందిగా కూడా మారాయి. దీంతో ఇరు ప‌క్షాల మ‌ధ్య వివాదాలు తార‌స్థాయిలో సాగుతున్నాయి.

ఇక‌, ఇప్పుడు తిరుమ‌ల ప‌రిధిలో ప్రైవేటు హోట‌ల్ సంస్థ ముంతాజ్‌కు స్థలం కేటాయింపు వ్య‌వ‌హారం టీటీడీకి, వైసీపీకి మ‌ధ్య మ‌రిన్ని మంట‌లు రాజేసింది. ఏడు కొండ‌ల‌ను ఆనుకుని ఉన్న ప్రాంతంలో ముంతాజ్ హోట‌ల్‌కు స్థ‌లం కేటాయించార‌ని పేర్కొంటూ.. వైసీపీ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించింది. తిరుప‌తి మాజీ ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి గ‌త రెండురోజులుగా ఈ విష‌యంపై నిప్పులు చెరుగుతున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా టీటీడీ బోర్డు చైర్మ‌న్ బీఆర్ నాయుడు తీవ్రంగా స్పందించారు. అస‌లు తాము కాద‌ని.. వైసీపీ హ‌యాంలోనే ఏడుకొండ‌ల‌ను ఆనుకుని ఉన్న భూముల‌ను ముంతాజ్ హోట‌ల్‌కు కేటాయించార‌ని చెప్పారు.

అంతేకాదు.. ఈ విష‌యంలో స్థ‌లం తాలూకు య‌జ‌మాని, ముంతాజ్ హోట‌ల్‌కు భూమినికేటాయించ‌డాన్ని వ్య‌తిరేకించిన‌ అజ‌య్ అనే వ్య‌క్తిని అప్ప‌టి సీఎం జ‌గ‌న్ బెదిరించార‌ని బీఆర్ నాయుడు తెలిపారు. “అజ‌య్‌కు పాయింట్ బ్లాంక్‌(క‌ణ‌తి) రేంజ్‌లో తుపాకీని గురి పెట్టిన జ‌గ‌న్‌.. తీవ్రంగా బెదిరించారు. కాల్చేస్తాన‌ని హెచ్చ‌రించాడు“ అని నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్యాలు చేశారు. దీంతో స‌ద‌రు వ్య‌క్తి భూములు ఇచ్చేందుకు బ‌ల‌వంతంగా ఒప్పుకొన్నాడ‌ని వ్యాఖ్యానించారు. ఈ విష‌యాన్ని చంద్ర‌బాబుకు చెప్పి, ముంతాజ్‌కు కేటాయించిన భూముల‌ను ర‌ద్దు చేయించామ‌న్నారు.

అనంత‌రం .. సీఎం చంద్ర‌బాబు స్వ‌యంగా ముంతాజ్‌హోట‌ల్ యాజ‌మాన్యంతో చ‌ర్చించి.. వేరే చోట 25 ఎక‌రాల‌ను ఇచ్చేందుకు ఒప్పించార‌ని నాయుడు చెప్పారు. వైసీపీ హ‌యాంలో ప్ర‌తిదానినీ డ‌బ్బుతోనే కొలిచార‌ని నాయుడు అన్నారు. టీటీడీ భూములను ప్రైవేటు సంస్థలకు ఇస్తున్నారని వైసీపీ చేస్తున్న ప్ర‌చారంలో వాస్త‌వం లేద‌న్నారు. అవ‌స‌ర‌మైతే.. ఈ వ్య‌వ‌హారంలో సీబీఐ విచారణ కోరుతూ వైసీపీ నాయ‌కులు కేంద్రానికి లేఖ రాయాల‌ని స‌వాల్‌రువ్వారు. డబ్బు వెదజల్లి అందరినీ కొనాల‌నే ప్ర‌య‌త్నంలో వైసీపీ నాయ‌కులు ఉన్నార‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. నాయుడు వ్యాఖ్య‌ల‌పై జ‌గ‌న్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

This post was last modified on August 27, 2025 8:22 am

Share
Show comments
Published by
Kumar
Tags: BR Naidu

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

57 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

1 hour ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

6 hours ago