Political News

‘అత‌ని క‌ణ‌తకు తుపాకీ పెట్టి.. జ‌గ‌న్ బెదిరించారు’

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి వ‌ర్సెస్‌.. ప్ర‌తిప‌క్ష వైసీపీకి మ‌ధ్య వివాదం తార‌స్థాయికి చేరింది. వైసీపీ నేత‌లు చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు పాల‌క‌మండ‌లి బోర్డు, కార్య‌నిర్వ‌హ‌ణాధికారి స‌హా.. ఇత‌ర అధికారులు దీటుగా స్పందిస్తున్నారు. ఇటీవ‌ల కాలంలో తిరుమ‌ల భ్ర‌ష్టు ప‌ట్టింద‌ని, ప‌విత్ర‌త ప్ర‌శ్నార్థ‌కంగా మారింద‌ని వైసీపీ నాయ‌కులు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా గోశాల‌లో గోవుల మృతి, తిరుప‌తిలో వైకుంఠ ద‌ర్శ‌న టోకెన్ల విష‌యంలో చోటు చేసుకున్న తొక్కిస‌లాట వంటివి బోర్డుకు ఇబ్బందిగా కూడా మారాయి. దీంతో ఇరు ప‌క్షాల మ‌ధ్య వివాదాలు తార‌స్థాయిలో సాగుతున్నాయి.

ఇక‌, ఇప్పుడు తిరుమ‌ల ప‌రిధిలో ప్రైవేటు హోట‌ల్ సంస్థ ముంతాజ్‌కు స్థలం కేటాయింపు వ్య‌వ‌హారం టీటీడీకి, వైసీపీకి మ‌ధ్య మ‌రిన్ని మంట‌లు రాజేసింది. ఏడు కొండ‌ల‌ను ఆనుకుని ఉన్న ప్రాంతంలో ముంతాజ్ హోట‌ల్‌కు స్థ‌లం కేటాయించార‌ని పేర్కొంటూ.. వైసీపీ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించింది. తిరుప‌తి మాజీ ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి గ‌త రెండురోజులుగా ఈ విష‌యంపై నిప్పులు చెరుగుతున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా టీటీడీ బోర్డు చైర్మ‌న్ బీఆర్ నాయుడు తీవ్రంగా స్పందించారు. అస‌లు తాము కాద‌ని.. వైసీపీ హ‌యాంలోనే ఏడుకొండ‌ల‌ను ఆనుకుని ఉన్న భూముల‌ను ముంతాజ్ హోట‌ల్‌కు కేటాయించార‌ని చెప్పారు.

అంతేకాదు.. ఈ విష‌యంలో స్థ‌లం తాలూకు య‌జ‌మాని, ముంతాజ్ హోట‌ల్‌కు భూమినికేటాయించ‌డాన్ని వ్య‌తిరేకించిన‌ అజ‌య్ అనే వ్య‌క్తిని అప్ప‌టి సీఎం జ‌గ‌న్ బెదిరించార‌ని బీఆర్ నాయుడు తెలిపారు. “అజ‌య్‌కు పాయింట్ బ్లాంక్‌(క‌ణ‌తి) రేంజ్‌లో తుపాకీని గురి పెట్టిన జ‌గ‌న్‌.. తీవ్రంగా బెదిరించారు. కాల్చేస్తాన‌ని హెచ్చ‌రించాడు“ అని నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్యాలు చేశారు. దీంతో స‌ద‌రు వ్య‌క్తి భూములు ఇచ్చేందుకు బ‌ల‌వంతంగా ఒప్పుకొన్నాడ‌ని వ్యాఖ్యానించారు. ఈ విష‌యాన్ని చంద్ర‌బాబుకు చెప్పి, ముంతాజ్‌కు కేటాయించిన భూముల‌ను ర‌ద్దు చేయించామ‌న్నారు.

అనంత‌రం .. సీఎం చంద్ర‌బాబు స్వ‌యంగా ముంతాజ్‌హోట‌ల్ యాజ‌మాన్యంతో చ‌ర్చించి.. వేరే చోట 25 ఎక‌రాల‌ను ఇచ్చేందుకు ఒప్పించార‌ని నాయుడు చెప్పారు. వైసీపీ హ‌యాంలో ప్ర‌తిదానినీ డ‌బ్బుతోనే కొలిచార‌ని నాయుడు అన్నారు. టీటీడీ భూములను ప్రైవేటు సంస్థలకు ఇస్తున్నారని వైసీపీ చేస్తున్న ప్ర‌చారంలో వాస్త‌వం లేద‌న్నారు. అవ‌స‌ర‌మైతే.. ఈ వ్య‌వ‌హారంలో సీబీఐ విచారణ కోరుతూ వైసీపీ నాయ‌కులు కేంద్రానికి లేఖ రాయాల‌ని స‌వాల్‌రువ్వారు. డబ్బు వెదజల్లి అందరినీ కొనాల‌నే ప్ర‌య‌త్నంలో వైసీపీ నాయ‌కులు ఉన్నార‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. నాయుడు వ్యాఖ్య‌ల‌పై జ‌గ‌న్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

This post was last modified on August 27, 2025 8:22 am

Share
Show comments
Published by
Kumar
Tags: BR Naidu

Recent Posts

మనసు మారిందా వీరభద్రుడా

బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ల తర్వాత సూర్య సినిమాలు వరసగా రాబోతున్నాయి. వాటిలో మొదటిది వీరభద్రుడు. తమిళంలో కరుప్పుగా రూపొందిన…

48 minutes ago

తప్పు చేస్తే చంద్రబాబుకి ఎవరైనా ఒకటే

సొంత పార్టీ నాయ‌కుడు త‌ప్పు చేస్తే ఒక‌విధంగా.. ప్ర‌త్య‌ర్థి పార్టీ నేత‌లు త‌ప్పులు చేస్తే మ‌రో విధంగా మారి పోయిన…

1 hour ago

సింహాన్ని దాచకుండా మంచి పని చేశారు

మే 1 విడుదల కాబోతున్న గాయపడ్డ సింహం మీద టీమ్ కన్నా ఎక్కువగా బయ్యర్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే…

3 hours ago

చరణ్ యష్ అనుకుంటే సత్యదేవ్ వస్తున్నాడు

వెనకటికి పాత కథ ఒకటుంది. ఒక రొట్టె కోసం రెండు పిల్లులు పోట్లాడుకుంటే తీర్పు చెప్పడానికి వచ్చిన కోతి దాన్ని…

4 hours ago

సాయిపల్లవికి ‘ఒక రోజు’ షాక్ ఇస్తుందా

చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసే సాయిపల్లవి కాంబోల కన్నా ఎక్కువగా కంటెంట్ కి ప్రాధాన్యం ఇవ్వడం అందరికీ తెలిసిన…

6 hours ago

టీడీపీ మహిళా ఎమ్మెల్యే పీఏగా ట్రాన్స్ జెండర్..

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీసుకున్న వినూత్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. బీకాం చదువుకున్న ఓ…

7 hours ago