Political News

షాకింగ్‌: ఢిల్లీ ముఖ్య‌మంత్రిపై దాడి?

దేశ రాజ‌ధాని ప్రాంతం ఢిల్లీలో షాకింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఢిల్లీ మ‌హిళా ముఖ్య‌మంత్రి రేఖా గుప్తాపై ఓ వ్య‌క్తి ముఖ్య‌మంత్రి నివాసంలోనే ఆమెపై అత్యంత స‌మీపం నుంచి దాడి చేశాడు. దీంతో ఒక్క‌సారిగా ఢిల్లీలో అల‌జ‌డి రేగింది. ఈ ఘ‌ట‌న‌తో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన సీఎం రేఖా గుప్తా.. ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ ఘ‌ట‌న‌ను తాను ఊహించ‌లేద‌న్నారు. సుదీర్ఘ‌కాలంగా తాను రాజ‌కీయాల్లో ఉన్నాన‌ని.. వ్య‌క్తిగ‌త దాడ‌ల‌కు వ్య‌తిరేక‌మ‌నిపేర్కొన్నారు. అయితే.. ఈ ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే పోలీసులు ముఖ్య‌మంత్రి నివాసం వ‌ద్ద భారీ సంఖ్య‌లో మోహ‌రించారు. ప‌రిస‌ర ప్రాంతాల‌ను త‌మ అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడి అరెస్టు..

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా.. ‘ప్ర‌జ‌ల‌తో సీఎం’ పేరుతో రోజు ఉద‌యం 8 గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు త‌న నివాసంలోనే ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవుతున్నారు. వారి నుంచి నేరుగా ఫిర్యాదులు తీసుకుంటున్నారు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆమె ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీ మేర‌కు ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు. అర‌వింద్ కేజ్రీవాల్ సీఎంగా ఉన్న‌ప్పుడు ప్ర‌జ‌ల‌కు దూరంగా ఉన్నార‌న్న పేరు వ‌చ్చింది. సామాన్యుడి పార్టీ అంటూ.. ఆప్ పెట్టినా.. ఆయ‌న పెద్ద‌ల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉన్నార‌ని బీజేపీ నేత‌లు ఎన్నిక‌ల స‌మ‌యంలో విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఈ క్ర‌మంలోనే రేఖా గుప్తా.. బీజేపీ అధికారంలోకి వ‌స్తే.. ప్ర‌జ‌ల‌కు చేరువ‌గా ఉండే ముఖ్య‌మంత్రిని చూస్తారని చెప్పుకొచ్చారు. అలానే.. తాను సీఎం అయిన త‌దుప‌రి నెల‌లోనే ప్ర‌జ‌ల‌తో ముఖ్య‌మంత్రి పేరుతో కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. ఈ క్ర‌మంలో బుధ‌వారం ఆమె ప్ర‌జ‌ల నుంచి ఫిర్యాదులు తీసుకునే స‌మ‌యంలో ఓ వ్య‌క్తి ఫిర్యాదు ఇచ్చే నెపంతో ముఖ్య‌మంత్రికి అతి స‌మీపం నుంచి దాడి చేశారు. దీని నుంచి ఆమె తృటిలో త‌ప్పించుకున్న‌ప్ప‌టికీ.. ఘ‌ట‌న మాత్రం దిగ్భ్రాంతికి గురి చేసింది. కాగా.. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అయితే.. అత‌ను దాడికి ఎందుకు ప్ర‌యత్నించార‌న్న కార‌ణాలు తెలియాల్సి ఉంది.

ఈ ఘ‌ట‌న‌ను ఢిల్లీ బీజేపీ అధ్య‌క్షుడు తీవ్రంగా ఖండించారు. ముఖ్య‌మంత్రిపై దాడిని తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్న‌ట్టు తెలిపారు. ముఖ్య‌మంత్రికి మ‌రింత భ‌ద్ర‌త పెంచేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరారు. కేంద్ర బ‌ల‌గాల‌తో రేఖా గుప్తాకు భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని కోరారు. మ‌రోవైపు ఈ ఘ‌ట‌న‌తో దేశ‌వ్యాప్తంగా ముఖ్య‌మంత్రుల భ‌ద్ర‌త విష‌యం చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఏపీ, తెలంగాణ‌ల ముఖ్య‌మంత్రులు త‌ర‌చుగా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్తున్న నేప‌థ్యంలో ఇక్క‌డ కూడా ముఖ్య‌మంత్రుల‌కు త‌గిన భ‌ద్ర‌త‌ను మ‌రింత పెంచాల్సి ఉంది.

This post was last modified on August 20, 2025 10:17 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కొరటాల మాస్… బాలయ్య కార్పెంటర్

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కలయికలో తెరకెక్కబోతున్న సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. విశ్వసనీయ సమాచారం మేరకు…

1 hour ago

సువేందు అధికారి ఆనే నేను..

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరింది. ఉదయం 11 గంటలకు బ్రిగేడ్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో బెంగాల్‌ సీఎంగా సువేందు…

1 hour ago

వీరభద్రుడికి ముందు నుయ్యి వెనుక గొయ్యి

ఇప్పటికే పలు వాయిదాల్లో నలిగిపోయిన సూర్య వీరభద్రుడు మే 14 విడుదల కానుంది. మొన్నటిదాకా వాయిదా పడుతుందనే ప్రచారం చెన్నై…

1 hour ago

పవన్ అభిమానులు… కొత్త ట్రాప్ లో పడొద్దు…

జనసేనాని పవన్ కళ్యాణ్ మీద గత రెండు మూడు రోజులుగా వైసీపీ మద్దతుదారులు. అనుకూల మీడియా పెడుతున్న సోషల్ మీడియా…

2 hours ago

సుమంత్ పేరు వెనుక‌ ప్ర‌భాస్ ఎందుకు?

మేం ఫేమ‌స్ చిత్రంతో టాలీవుడ్లోకి దూసుకొచ్చాడు యువ న‌టుడు సుమంత్ ప్ర‌భాస్. షార్ట్ ఫిలిమ్స్ నేప‌థ్యం నుంచి వ‌చ్చిన ఈ…

3 hours ago

దిల్ రాజుకు దెబ్బ మీద దెబ్బ‌

ఇప్పుడు టాలీవుడ్లో ఏ నిర్మాత‌, డిస్ట్రిబ్యూట‌ర్ ప‌రిస్థితీ అంత బాగా లేదు. స‌క్సెస్ రేట్ అంత‌కంత‌కూ ప‌డిపోతోంది. జ‌నాలు థియేట‌ర్ల‌కు…

4 hours ago