Political News

తిరుపతి లోక్ సభ గెలుపు కోసం పక్కా వ్యూహం

తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో గెలవాలని తెలుగుదేశంపార్టీ గట్టి పట్టుదలతో ఉన్నట్లే కనిపిస్తోంది. అభ్యర్ధిగా పనబాక లక్ష్మిని ముందుగానే ప్రకటించేసిన చంద్రబాబునాయుడు తాజాగా మరో 97 మందితో జంబో టీంను కూడా నియమించేశారు. ఈ 97 మంది బృందంలో పార్టీ నేతలే ఉంటారు. మాజీ మంత్రులు, మాజీ ఎంఎల్ఏలు, రాష్ట్ర కమిటి సభ్యులు మొత్తం మీద సీనియర్ నేతలనే చంద్రబాబు ఎంపిక చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎంఎల్సీ బీద రవిచంద్రయాదవ్ తో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తారు.

నిజానికి తిరుపతి లోక్ సభ సీటులో టీడీపీ చాలా బలహీనంగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే 1984లో జరిగిన ఎన్నికల్లో మాత్రమే టీడీపీ గెలిచింది. మళ్ళీ ఇప్పటి వరకు గెలుపన్నదే లేదు. కొన్నిసార్లు పొత్తుల్లో వదిలేసింది. మరికొన్ని సార్లు నేరుగా పోటీ చేసింది. ఎలా చేసినా పార్టీకి గెలుపు మాత్రం ఎండమావి లాగే తయారైంది. ఇక్కడ సమస్యంతా పార్టీలోనే ఉంది. ఎలాగంటే ప్రతి ఎన్నికకు ఓ అభ్యర్ధిని పోటీలోకి దింపటం ద్వారా పార్టీ నాయకత్వం ప్రయోగం చేసింది. ఈ ప్రయోగం దారుణంగా విఫలమైంది.

తిరుపతి సీటు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం అన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది ఎస్సీల్లో గట్టి అభ్యర్ధిని రెడీ చేసుకోవటంలో ఫెయిలైందనే చెప్పాలి. 2009 ఎన్నికల్లో కృష్ణా జిల్లాకు చెందిన వర్ల రామయ్యను పోటీలోకి దింపింది. నిజానికి వర్లకు నియోజకవర్గానికి ఏమీ సంబంధం లేదు. అయినా తిరుపతి పరిధిలో ఎవరు లేనట్లు విజయవాడలో ఉండే వర్లను ఎందుకు పోటీ చేయించాల్సొచ్చిందో చంద్రబాబుకే తెలియాలి. ఇక 2014లో పొత్తులో భాగంగా బీజూపీకి సీటును వదిలేసింది. ఇక 2019 ఎన్నికల్లో పనబాక లక్ష్మిని పోటీ చేయించారు. ఈమె 2.28 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. మళ్ళీ ఇపుడు పనబాకనే రెండోసారి పోటీలోకి దింపారు.

తొందరలో జరగబోయే ఉపఎన్నికలో వైసీపీ అభ్యర్ధి గెలుపు దాదాపు ఖాయమనే చెప్పాలి. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని వైసీపీ వర్గాలు ధీమాగా ఉన్నాయి. సరే గెలుపోటములను పక్కన పెట్టేస్తే ఈ ఉపఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీ చిత్తశుద్దితో ప్రయత్నిస్తున్నట్లే కనిపిస్తోంది. చంద్రబాబులోని మరో ప్రధాన లోపం ఏమిటంటే అభ్యర్ధిని చివరి నిముషం వరకు ప్రకటించరు. ఇక నామినేషన్ కు ఒకటి రెండు రోజులు మాత్రమే గడువుందంటే అప్పుడు అభ్యర్ధిని ప్రకటిస్తారు. దీంతో పోటీ చేయాలని అనుకునే వాళ్ళలో బాగా విసుగొచ్చేస్తుంది.

అయితే తన సహజత్వానికి భిన్నంగా దాదాపు నాలుగైదు నెలల ముందే అభ్యర్ధిని ప్రకటించేశారు చంద్రబాబు. అంటే తెలంగాణాలోని దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికలో బీజేపీ అనుసరించిన ఫార్ములాను చంద్రబాబు కాపీ కొట్టినట్లే ఉంది. సరే విషయం ఏదైనా అభ్యర్ధిని ముందే ప్రకటించటం, గెలుపుకోసం నియోజకవర్గంలో కమిటిలు వేయటం, బాధ్యతలు అప్పగించటం, సీనియర్ నేతలను లోక్ సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్యాంపు వేయించటం లాంటివి మంచి ఫలితాలు ఇస్తాయనే అనుకోవాలి. చూద్దాం అంతిమ ఫలితం ఎలాగుంటుందో.

This post was last modified on November 21, 2020 8:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఒక్క ఎపిసోడుతో హాట్ టాపిక్ అయ్యింది

ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…

8 minutes ago

బిర్యానీ రేంజులో ‘ప్యారడైజ్’ పాట

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…

48 minutes ago

తిరుమల జీవోలపై చంద్రబాబు క్లారిటీ

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…

2 hours ago

శ్రీ విష్ణుకు సన్నాఫ్ సత్యమూర్తి ఇచ్చిన షాక్

చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్‌లో మంచి క్రేజ్‌తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…

3 hours ago

రాజమౌళి, మహేష్ కొట్టుకోవడమేంటయ్యా

దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…

3 hours ago

మున్నా మంచి స్ట్రాటజీ వాడుతున్నాడు

మాములుగా రీ రిలీజులు ఏవి ఆడతాయో ఏవి ఆడవో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖలేజాని…

4 hours ago