మంత్రిగా బాద్యతలు తీసుకున్న గంటల్లోనే నితీష్ కుమార్ మంత్రివర్గ సహచరుడు మేవాలాల్ చౌదరి రాజీనామా చేశారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ మంత్రివర్గంలో జేడీయు ఎంఎల్ఏ, విద్యాశాఖ మేవాలాల్ చౌదరి కూడా ఒకరు. ఈయన గురువారం బాధ్యతలు తీసుకున్న కొద్ది గంటల్లోనే తన పదవికి రాజీనామా చేయటం సంచలనంగా మారింది. మంత్రిగా బాధ్యతలు ఎందుకు తీసుకున్నారు ? తీసుకున్న గంటల వ్యవధిలోనే ఎందుకు రాజీనామా చేశారు అన్నది ఆసక్తిగా మారింది.
ఇంతకీ విషయం ఏమంటే మేవాలాల్ పై 2017లో క్రిమినల్ కేసు నమోదైంది. భాగల్ పూర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గా ఉన్న కాలంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలు జరిగాయి. అయితే నియామకాల తర్వాత మేవాలాల్ భారీ ఎత్తున అవినీతికి, అవకతవకలకు పాల్పడ్డారంటు ఆరోపణలు వచ్చాయి. ఆరోపణల కారణంగా జేడీయూ నుండి నితీష్ అప్పట్లో మేవాలాల్ ను సస్పెండ్ కూడా చేశారు.
ఇదే సమయంలో అప్పటి గవర్నర్ రామ్ నాధ్ కోవిండ్ ఈయనపై వచ్చిన ఆరోపణలపై విచారణకు ఆదేశించారు. ఉన్నతాధికారుల విచారణలో మేవాలాల్ అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు రుజువైంది. మేవాలాల్ అవినీతికి, అక్రమాలకు ఎన్ని ఆధారాలున్నా ఆయనపై ఇప్పటి వరకు ఛార్జిషీటు నమోదుకాలేదు. ఇదే విషయమై అప్పట్లోనే మేవాలాల్ మాట్లాడుతూ తనపై కేసు నమోదైనందుకు తానేమీ సిగ్గు పడటం లేదని వ్యాఖ్యానించటం సంచలనమైంది. ఎందుకంటే తనతో పాటు చాలా మంది ఎంఎల్ఏలపైన అనేక కేసులున్నాయి కాబట్టి తానేమీ సిగ్గుపడటం లేదని చెప్పటం గమనార్హం.
సరే ఈ కేసు ఇలాగుంటే 2019లో తనింట్లోనే తన భార్య అనుమాస్పదంగా మరణించారు. కాలిన గాయాలతో ఆయన భార్య మరణించటంతో మేవాలాల్ పై మరో కేసు నమోదైంది. ఆమె అనుమానాస్పద మరణంలో మేవాలాల్ హస్తం ఉందంటు అప్పటి నుండి ఆర్జేడీ ఆరోపణలు గుప్పిస్తునే ఉంది. ఇవన్నీ గమనించిన తర్వాత అర్ధమవుతున్నదేమంటే మేవాలాల్ ను తాజాగా విద్యాశాఖ మంత్రిగా తీసుకునేటప్పటికే ఆయనపైన కేసులున్నాయని. అయినా దేన్నీ పట్టించుకోకుండా నితీష్ మాత్రం చక్కగా ఆయన్ను మంత్రిగా తీసేసుకున్నారు. అంతా బాగానే ఉంది కానీ మరి మంత్రిగా బాద్యతలు తీసుకున్న గంటల వ్యవధిలోనే మేవాలాల్ ఎందుకు రాజీనామా చేశారో ఎవరికీ అర్ధం కావటం లేదు.
ఏపీలో ప్రతిపక్ష పార్టీ(ప్రధాన కాదు)గా ఉన్న వైసీపీ రెండేళ్ల కాలంలో ఏం చేసింది? ఏం సాధించింది? అనేది ఆసక్తికరం. శుక్రవారం(జూన్…
దర్శకులందు అనిల్ రావిపూడి వేరయాని ఊరికే అనలేదు. షూటింగ్ మొదలుపెట్టడానికి ముందే తనదైన ప్రమోషన్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్…
దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…
రెడ్ బుక్ మూసేయలేదని.. అది ఇంకా తెరిచే ఉందని మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్లో…
ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…
తమరిది అన్నదమ్ముల అనుబంధం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ పలుమార్లు వ్యాఖ్యానించారు.…