Political News

తిరుపతిలో హీట్ పెంచేసిన చంద్రబాబు

తిరుపతి లోక్ సభ ఎన్నికల్లో ఒక్కసారిగా హీట్ పెరిగిపోయింది. తన సహజ స్వభావానికి విరుద్ధంగా చంద్రబాబునాయుడు తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధిని ప్రకటించేశారు. తిరుపతి లోక్ సభ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే నేతలతో జూమ్ కాన్ఫరెన్సులో మాట్లాడినపుడు పనబాక లక్ష్మీనే అభ్యర్ధిగా ప్రకటించేశారు. చంద్రబాబు చేసిన అభ్యర్ధి ప్రకటనతో టీడీపీ నేతలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అభ్యర్ధిని చంద్రబాబు ప్రకటిస్తారని నేతలెవరు ఊహించలేదు కాబట్టే.

ఎన్నికలు ఎప్పుడు జరిగినా నామినేషన్ల వేయటానికి చివరి రోజు వచ్చేంతవరకు అభ్యర్ధిని ప్రకటించే అలవాటు లేదు చంద్రబాబుకు. అలాంటిది మిగిలిన పార్టీలకన్నా ముందే అభ్యర్ధిని ప్రకటించేయటంతో ఒక్కసారిగా ఎన్నికల వేడి పెరిగిపోయింది. ఇప్పటివరకు తిరుపతిలో బీజేపీ నేతల హడావుడి మాత్రమే జరుగుతోంది. అభ్యర్ధిని ప్రకటించకపోయినా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర ఇన్చార్జి సునీల్ దేవదర్ అండ్ కో మాత్రం రెగ్యులర్ గా తిరుపతిలో పర్యటిస్తు హీట్ పంచేస్తున్నారు. అలాంటిది చంద్రబాబు టీడీపీ అభ్యర్ధిని ప్రకటించేయటంతో ఇటు బీజేపీ అటు టీడీపీ నేతలు ఎన్నికల ప్రచారంలోకి దిగిపోయినట్లయ్యింది.

ఇక మిగిలింది అధికార వైసీపీ మాత్రమే. నిజానికి వైసీపీ అభ్యర్ధి బల్లి దుర్గా ప్రసాదరావు మరణంతోనే ఇప్పుడు ఉపఎన్నికలు అవసరమయ్యాయి. మరి వైసీపీ తరపున బల్లి కుటుంబసభ్యులనే పోటీ చేయిస్తారా ? లేకపోతే బయట నేతలను ఎంపిక చేస్తారా ? అనే విషయం సస్పెన్సుగా మిగిలిపోయింది. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పరిధి విషయంలో జగన్మోహన్ రెడ్డికి పూర్తి సమాచారం ఉండటంతో నేతలు పెద్దగా ప్రయత్నాలు చేసుకోవటం లేదు.

సరే అభ్యర్ధి ఎవరనేది తేలకపోయినా బీజేపీ తరపున ప్రచారం మాత్రం మొదలైపోయింది. బీజేపీనే పోటీ చేస్తుందని ఇప్పటికే వీర్రాజు ప్రకటించేశారు కాబట్టి జనసేన తరపున అభ్యర్ధి ఉండరనే అందరు అనుకుంటున్నారు. మరి బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్ధి ఎవరంటే మాత్రం ఎవరు చెప్పలేకున్నారు. అందుకనే అభ్యర్ధిని విడిచిపెట్టేసి పార్టీ కే ఓట్లేయమని పార్టీ నేతలు తిరుపతిలో ప్రచారం మొదలుపెట్టేశారట. మార్చిలోగా జరిగే ఉపఎన్నికలకు ఇప్పుడే హీట్ పెరిగిపోయింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత ఇంకెంత హీట్ పెరిగిపోతుందో చూద్దాం.

This post was last modified on November 18, 2020 2:36 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

బాలయ్య బ్యాక్ టు డ్యూటీ

ఎన్నికలు అయిపోయాయి. ఫలితాలు ఇంకో పద్దెనిమిది రోజుల్లో రాబోతున్నాయి. ఎవరికి వారు విజయం పట్ల ధీమాగా ఉన్నారు. అధికార పార్టీ,…

10 mins ago

పూజా హెగ్డే కోరుకున్న బ్రేక్ దొరికింది

మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…

2 hours ago

ఆమంచి .. ఎవరి ‘కొంప’ ముంచేనో ?!

ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…

2 hours ago

అమెరికాలో వెంటాడిన మృత్యువు

తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…

3 hours ago

కోర్టు మెట్లెక్కిన జూనియర్  !

ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో  681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…

3 hours ago

ప్రభాస్ ఊరిస్తోంది దేని గురించంటే

ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…

3 hours ago