Political News

‘జ‌గ‌న్‌ను విచారిస్తే.. అన్నీ బ‌య‌ట‌కు వ‌స్తాయి’

జ్యోతుల నెహ్రూ. ఒక‌ప్పుడు వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడు. ఆ పార్టీలో గ‌త ఐదేళ్లు కూడా ఉన్నారు. అయితే, 2024 ఎన్నిక‌ల‌కు ముందు పార్టీ మారి టీడీపీ గూటికి చేరుకున్నారు. ఈక్ర‌మంలోనే జ‌గ్గంపేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. కొన్నాళ్లుగా మౌనంగా ఉన్న జ్యోతుల‌.. తాజాగా మిథున్ రెడ్డి అరెస్టు, జైలు నేప‌థ్యంలో స్పందించారు. జ‌గ‌న్ కూడా జైలుకు వెళ్ల‌క త‌ప్ప‌ద‌న్నారు. అస‌లు ఈ కేసులో జ‌గనే సూత్ర‌ధారి అని పేర్కొన్నారు. ముందు జ‌గ‌న్‌ను విచారిస్తే.. అన్నీ బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని చెప్పారు.

“ఈ విచార‌ణ అంతా ఒక‌ర‌కంగా.. సుదీర్ఘంగా సాగుతోంది. ఇంత సాగ‌దీత ఎందుకో నాకు అర్ధం కావ‌డం లేదు. జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తే.. మ‌ద్యం ముడుపులు, అక్ర‌మాలు తేల్చేయొచ్చు. 3500 కోట్ల వ్య‌వ‌హారంపై ఎందుకు ఇంత‌గా సాగ‌దీస్తున్నారు. ముందు జ‌గ‌న్‌ను అరెస్టు చేయాలి.” అని జ్యోతుల వ్యాఖ్యానించారు. అయితే.. చ‌ట్టం త‌న ప‌నితాను చేసుకుని పోతుంద‌న్నారు. ముఖ్యంగా ఇప్పుడు కాక‌పోతే.. రేప‌యినా.. నిజాలు వెలుగు చూస్తాయ‌ని జ్యోతుల తెలిపారు. జ‌గ‌న్ ఎవ‌రెవ‌రిని మోసం చేశారో.. ఎన్ని వేల కోట్లు రాబ‌ట్టారో వెలుగు చూడాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. జ‌గ‌న్ మోసాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించేందుకు తాము రెడీగా ఉన్నామ‌ని చెప్పారు.

వైసీపీ నుంచి విజ‌య‌సాయిరెడ్డి చాలా వ్యూహాత్మ‌కంగా బ‌య‌ట‌కు వ‌చ్చార‌ని జ్యోతుల చెప్పారు. ఆయ‌న‌కు అన్నీ తెలుసున‌ని.. కానీ, త‌న వాటా త‌న‌కు ద‌క్క‌లేద‌న్న క‌సితోనే.. బ‌య‌ట‌కు వ‌చ్చార‌ని ఆరోపించారు. త్వ‌ర‌లోనే సాయిరెడ్డి అప్రూవ‌ర్‌గా మారే అవ‌కాశం ఉంద‌ని త‌న‌కు స‌మాచారం ఉంద‌న్నారు. అయితే.. ఎవ‌రు ఏంచేసినా.. ప్ర‌జ‌ల ముందు దోషులుగా నిల‌బెట్టేందుకు కూట‌మి ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌న్నారు. తాజాగా ఆదివారం ఆయ‌న పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా వైసీపీ అధినేత తీరును తాను చాలా స‌మీపం నుంచి గ‌మ‌నించాన‌ని చెప్ప‌కొచ్చారు. ఆయ‌న మాన‌సిక స్థితి స‌రిగా లేద‌ని వ్యాఖ్యానించారు.

This post was last modified on July 21, 2025 6:34 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

దురంధ‌ర్ ఇప్పుడు… పవన్ ఎప్పుడో!

దురంధ‌ర్‌.. చాలా ఏళ్ల త‌ర్వాత భార‌తీయ సినిమాలో బాలీవుడ్ త‌లెత్తుకునేలా చేసిన సినిమా. గ‌త ఏడాది ఛావా, సైయారా సినిమాలు…

2 hours ago

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

12 hours ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

12 hours ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

13 hours ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

14 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

15 hours ago