మార్చిలో ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు గట్టి ప్రయత్నమే చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు. కానీ కరోనా అప్పుడు జనాలను భయకంపితుల్ని చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ అభీష్టానికి వ్యతిరేకంగా ఎన్నికలను వాయిదా వేశారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. దీనిపై వైకాపా నాయకులు ఏ స్థాయిలో విరుచుకుపడ్డారో.. తదనంతరం నిమ్మగడ్డకు, ప్రభుత్వానికి ఎలా యుద్ధం నడిచిందో తెలిసిందే.
కాగా ఇప్పుడు స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ సన్నాహాలు చేస్తుంటే.. ప్రభుత్వం అడ్డు పడుతోంది. కానీ ఆయనేమీ తగ్గట్లేదు. వివిధ అంశాల్లో ప్రభుత్వంపై కోర్టులో స్పష్టమైన పైచేయి సాధించిన నిమ్మగడ్డ.. తాజాగా ఏపీలో స్థానిక ఎన్నికలపై కీలక ప్రకటన చేశారు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఆలోచన చేస్తున్నట్లు ఈ ప్రకటనలో వెల్లడించారు.
కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకున్నామని, రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కూడా తగ్గుముఖం పట్టిందని.. రోజుకు నమోదయ్యే కేసుల సంఖ్య 10వేల నుంచి 753కి తగ్గిందని.. ఈ నేపథ్యంలో పార్టీలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు న్యాయపరమైన ఇబ్బందులు లేనందున వాటిని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని రమేష్ కుమార్ పేర్కొన్నారు.
తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో లేదని.. పోలింగ్కు నాలుగు వారాల ముందు కోడ్ అమల్లోకి వస్తుందని.. ఎన్నికల కోసం ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, అధికారులు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఈ ఎన్నికలు.. రాజ్యాంగపరమైన అవసరమే కాకుండా కేంద్ర ఆర్థిక సంఘం నిధులు తీసుకునేందుకూ దోహదపడతాయన్న ఎన్నికల కమిషనర్.. కరోనా పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరోగ్యశాఖతో సంప్రదింపులు జరుపుతున్నామని.. స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తామని రమేష్ కుమార్ స్పష్టం చేశారు.
This post was last modified on November 17, 2020 5:58 pm
టాలీవుడ్ చరిత్రలో ఆల్ టైం క్లాసిక్స్ గా ప్రత్యేకమైన చోటు దక్కించుకునే అల్లూరి సీతారామరాజు ఇవాళ 50 వసంతంలోకి అడుగు…
గౌతమీపుత్ర శాతకర్ణి ద్వారా పీరియాడిక్ సినిమాలను తాను ఎంత బాగా డీల్ చేయగలనో నిరూపించుకున్నాక దర్శకుడు క్రిష్ రూటే మారిపోయింది.…
గత ఏడాది డిసెంబర్ లో రిలీజైన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ ఏ…
కొన్ని ల్యాండ్ మార్క్ సినిమాలకు కాలదోషం ఉండదు. టాలీవుడ్ స్థాయిని ప్రపంచ వీధుల దాకా తీసుకెళ్లి అక్కడ జెండా పాతేలా…
మాటల మాంత్రీకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోడీపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. తమ వ్యం గ్యాస్త్రాలు,…
ఈ ఏడాది ఎండలు జనాలను హడలెత్తిస్తున్నాయి. ఏకంగా 44, 45 డిగ్రీల ఊష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీచేస్తున్నది. ఆంధ్రప్రదేశ్,…