Political News

ఏపీలో ఎన్నికలపై తేల్చేసిన నిమ్మగడ్డ

మార్చిలో ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు గట్టి ప్రయత్నమే చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు. కానీ కరోనా అప్పుడు జనాలను భయకంపితుల్ని చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ అభీష్టానికి వ్యతిరేకంగా ఎన్నికలను వాయిదా వేశారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. దీనిపై వైకాపా నాయకులు ఏ స్థాయిలో విరుచుకుపడ్డారో.. తదనంతరం నిమ్మగడ్డకు, ప్రభుత్వానికి ఎలా యుద్ధం నడిచిందో తెలిసిందే.

కాగా ఇప్పుడు స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ సన్నాహాలు చేస్తుంటే.. ప్రభుత్వం అడ్డు పడుతోంది. కానీ ఆయనేమీ తగ్గట్లేదు. వివిధ అంశాల్లో ప్రభుత్వంపై కోర్టులో స్పష్టమైన పైచేయి సాధించిన నిమ్మగడ్డ.. తాజాగా ఏపీలో స్థానిక ఎన్నికలపై కీలక ప్రకటన చేశారు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఆలోచన చేస్తున్నట్లు ఈ ప్రకటనలో వెల్లడించారు.

కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకున్నామని, రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కూడా తగ్గుముఖం పట్టిందని.. రోజుకు నమోదయ్యే కేసుల సంఖ్య 10వేల నుంచి 753కి తగ్గిందని.. ఈ నేపథ్యంలో పార్టీలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు న్యాయపరమైన ఇబ్బందులు లేనందున వాటిని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని రమేష్ కుమార్ పేర్కొన్నారు.

తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌ కూడా విడుదలైన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లో లేదని.. పోలింగ్‌కు నాలుగు వారాల ముందు కోడ్‌ అమల్లోకి వస్తుందని.. ఎన్నికల కోసం ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, అధికారులు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఈ ఎన్నికలు.. రాజ్యాంగపరమైన అవసరమే కాకుండా కేంద్ర ఆర్థిక సంఘం నిధులు తీసుకునేందుకూ దోహదపడతాయన్న ఎన్నికల కమిషనర్.. కరోనా పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరోగ్యశాఖతో సంప్రదింపులు జరుపుతున్నామని.. స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తామని రమేష్ కుమార్ స్పష్టం చేశారు.

This post was last modified on November 17, 2020 5:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

5 minutes ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

43 minutes ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

1 hour ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

2 hours ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

3 hours ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

5 hours ago