Political News

పేర్నినానికి పిచ్చి పట్టినట్లుంది: కందుల దుర్గేష్

వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని ఈ మధ్య చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. చీకట్లోనే సైలెంట్ గా పని కానిచ్చేయాలని…రప్పా రప్పా అంటూ పగటి పూట రచ్చ చేయడం కాదని వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా నాని చేసిన కామెంట్లు దుమారం రేపాయి. మంత్రి కందుల దుర్గేష్ ఇసుక వ్యాపారం చేస్తున్నారంటూ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు షాకింగ్ గా మారాయి. ఈ క్రమంలోనే పేర్ని నానికి కందుల దుర్గేష్ కౌంటర్ ఇచ్చారు. తాను ఇసుక వ్యాపారం చేసినట్లు నిరూపించాలని నానికి దుర్గేష్ సవాల్ విసిరారు.

రాజకీయ ఉనికి కోసమే పేర్ని నాని ఇటువంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని దుర్గేష్ విమర్శించారు. పేర్ని నాని రేషన్ బియ్యం కేసులో విచారణ జరుగుతోందని అన్నారు. దొంగతనం చేసి డబ్బులు కడితే దొర అయిపోతారా అని దుర్గేష్ ప్రశ్నించారు. అధికారం పోయిన తర్వాత పేర్ని నాని పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో కూడా కూటమి పార్టీలదే గెలుపని జోస్యం చెప్పారు.

కాగా, చాలాకాలంగా పేర్ని నాని వర్సెస్ కందుల దుర్గేష్ అన్నరీతిలో మాటల యుద్ధం జరుగుతోంది. వైసీపీకి చెందిన వ్యక్తి చనిపోతే కూటమి ప్రభుత్వం పతనం మొదలవుతుందని పేర్ని నాని గతంలో వ్యాఖ్యానించారు. కార్యకర్తల చావు మీద వైసీపీ రాజకీయాలు చేస్తోందని, మనుషులు చనిపోవాలి అన్న రీతిలో మూర్ఘంగా పేర్ని నాని మాట్లాడుతున్నారని కందుల దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా కార్యకర్తలు చనిపోవడం వల్ల రాజకీయ ప్రయోజనాలను ఆశిస్తున్నారా అని నిలదీశారు.

This post was last modified on July 15, 2025 3:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

55 minutes ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

1 hour ago

కొట్లాట కొత్త కాదు రేవంత్ చెబితే రాజీనామా దానం కీలక కామెంట్స్

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేయడం తనకు కొత్త కాదని, ఎన్నికల్లో పోటీ చేయడం…

2 hours ago

హై కోర్టుకు సారీ చెప్పిన హైడ్రా, ఏం జరిగింది?

`సారీ మైలార్డ్‌.. ఇక‌పై అలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌వు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా క‌మిష‌న‌ర్‌, ఐపీఎస్ అధికారి రంగ‌నాథ్…

2 hours ago

లోకేష్ కోసం వెళ్ళని చంద్రబాబు ఏపీ కోసం వచ్చారు

పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…

3 hours ago

అఖండ అనుభవం.. అలెర్ట్ అవ్వాలి

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…

3 hours ago