ఒకరేమో యావత్తు ప్రపంచానికి కింగ్ ఫిషర్ బీర్లను పంపిణీ చేస్తున్న యునైటెడ్ బ్రూవరీస్ యజమాని విజయ్ మాల్యా. మరొకరేమో క్రికెట్ ను ఎలా వ్యాపార వస్తువుగా మార్చాలో చూపించి… అదే సమయంలో దేశంలో అందిన కాడికి దోచి విదేశాలకు పారిపోయిన ఐపీఎల్ వ్యవస్థాపక చైర్మన్ లలిత్ మోదీ. లలిత్ మోదీ మాదిరే మాల్యా కూడా భారత దేశ బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయలను ఎగ్గొట్టి దేశం వదిలి పారిపోయిన వ్యక్తే. వీరిద్దరూ కలిసి ఇప్పుడు లండన్ లో జరిగిన ఓ పార్టీలో ఓ రేంజిలో ఎంజాయ్ చేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఈ వైరల్ వీడియోను వేరే ఎవరో పోస్ట్ చేయలేదు. మాల్యాతో కలిసి ఎంజాయ్ చేసిన లలిత్ మోదీనే ఈ వీడియోను స్వయంగా తన చేజేతులారా.. తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేయడం గమనార్హం.ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ పార్టీ లండన్ లోని లలిత్ ఇంటిలోనే జరిగిందట. అప్పుల్లో కూరుకుపోయో, లేదంటే… అనుకున్నంత మేర డబ్బును పోగేసుకున్నాడో తెలియదు గానీ… లలిత్ మోదీ ఓ శుభ సందర్బాన్ని చూసుకుని ఎస్కేప్ అయ్యారు. ఆ తర్వాత పలు దేశాలు తిరిగిన ఆయన చివరకు లండన్ చేరినట్టు సమాచారం.
ఈ వీడియోలో లలిత్ మోదీ ఓ మైకు చేతబట్టుకుని పెద్ద స్వరంతో పాటలు పాడుతూ సాగారు. మోదీని చూడగానే… ఆయన వద్దకు పరుగులు పెట్టుకుంటూ వచ్చిన మాల్యాను ఆప్యాయంగా పలకరించిన మోదీ… మాల్యా భుజంపై చేసి మరింత ఎంజాయ్ మెంట్ లోకి వెళ్లిపోయారు. ఇక మాల్యా అయితే ఓ చేతిలో మద్యం గ్లాసు, మరో చేతిలో మైకు పట్టుకుని కనిపించారు. ఈ వీడియోను చూసిన భారతీయులంతా మాల్యా, మోదీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on July 4, 2025 6:30 pm
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…
మాములుగా రీ రిలీజులు ఏవి ఆడతాయో ఏవి ఆడవో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖలేజాని…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై…
మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…