Political News

దేశాన్ని దోచిన బడా బాబుల జల్సాలు చూశారా?

ఒకరేమో యావత్తు ప్రపంచానికి కింగ్ ఫిషర్ బీర్లను పంపిణీ చేస్తున్న యునైటెడ్ బ్రూవరీస్ యజమాని విజయ్ మాల్యా. మరొకరేమో క్రికెట్ ను ఎలా వ్యాపార వస్తువుగా మార్చాలో చూపించి… అదే సమయంలో దేశంలో అందిన కాడికి దోచి విదేశాలకు పారిపోయిన ఐపీఎల్ వ్యవస్థాపక చైర్మన్ లలిత్ మోదీ. లలిత్ మోదీ మాదిరే మాల్యా కూడా భారత దేశ బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయలను ఎగ్గొట్టి దేశం వదిలి పారిపోయిన వ్యక్తే. వీరిద్దరూ కలిసి ఇప్పుడు లండన్ లో జరిగిన ఓ పార్టీలో ఓ రేంజిలో ఎంజాయ్ చేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఈ వైరల్ వీడియోను వేరే ఎవరో పోస్ట్ చేయలేదు. మాల్యాతో కలిసి ఎంజాయ్ చేసిన లలిత్ మోదీనే ఈ వీడియోను స్వయంగా తన చేజేతులారా.. తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేయడం గమనార్హం.ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ పార్టీ లండన్ లోని లలిత్ ఇంటిలోనే జరిగిందట. అప్పుల్లో కూరుకుపోయో, లేదంటే… అనుకున్నంత మేర డబ్బును పోగేసుకున్నాడో తెలియదు గానీ… లలిత్ మోదీ ఓ శుభ సందర్బాన్ని చూసుకుని ఎస్కేప్ అయ్యారు. ఆ తర్వాత పలు దేశాలు తిరిగిన ఆయన చివరకు లండన్ చేరినట్టు సమాచారం.

ఈ వీడియోలో లలిత్ మోదీ ఓ మైకు చేతబట్టుకుని పెద్ద స్వరంతో పాటలు పాడుతూ సాగారు. మోదీని చూడగానే… ఆయన వద్దకు పరుగులు పెట్టుకుంటూ వచ్చిన మాల్యాను ఆప్యాయంగా పలకరించిన మోదీ… మాల్యా భుజంపై చేసి మరింత ఎంజాయ్ మెంట్ లోకి వెళ్లిపోయారు. ఇక మాల్యా అయితే ఓ చేతిలో మద్యం గ్లాసు, మరో చేతిలో మైకు పట్టుకుని కనిపించారు. ఈ వీడియోను చూసిన భారతీయులంతా మాల్యా, మోదీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

This post was last modified on July 4, 2025 6:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago