Political News

ఫోన్ ట్యాపింగ్ విచారణలో ఏబీఎన్ రాధాకృష్ణ ఎం చెప్పారు?

తెలంగాణలో పెను కలకలమే రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం బయటకు వస్తోంది. ఇలా బయటకు వస్తున్న విషయాలను చూస్తుంటే… సమాజంలోని ఏ ఒక్క వర్గాన్ని కూడా నిందితులు వదలలేదని చెప్పక తప్పదు. తాజాగా శుక్రవారం వెలుగు చూసిన అంశంలో మీడియా సంస్థల అధినేతలను కూడా నిందితులు వదలలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ ప్రముఖ మీడియా సంస్థగా కొనసాగుతున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఫోన్ నూ నిందితులు ట్యాప్ చేశారు. ఈ మేరకు సిట్ నోటీసుల మేరకు రాధాకృష్ణ తన వాంగ్మూలాన్ని ఇచ్చారు.

2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నుంచే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొదలైందని ఇప్పటికే స్పష్టం అయిపోయింది. నాడు అదికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కారు ఆదేశాలతోనే నాటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు ఓ ప్రత్యక బృందాన్ని ఏర్పాటు చేసుకుని తన బాస్ లు ఇచ్చిన ఫోన్ నెంబర్లన్నింటినీ ట్యాప్ చేసి వాటి వివరాలను బాస్ లకే అందించారు. ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్, బీజేపీలకు చెందిన కీలక రాజకీయ వేత్తలతో పాటుగా కొందరు బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నట్లు సమాచారం. ఇక కొందరు పోలీసు అధికారులు, న్యాయమూర్తులు, చివరాఖరుకు మీడియా సంస్థల అదినేతలూ ఉన్నారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే శ్రవణ్ రావు అనే ఓ మీడియా సంస్థ అధినేతను సిట్ ప్రశ్నించింది. అయితే ఈయన ఫోన్ ట్యాపింగ్ నిందితుడు. అయితే ఇప్పుడు ఏబీఎన్ రాధాకృష్ణ మాత్రం బాధితుడిగా సిట్ ముందు తన స్టేట్ మెంట్ ఇచ్చారు. ఎస్ఐబీ వద్ద ఉన్న ఫోన్ నెంబర్ల జాబితాను పరిశీలించగా… రాధాకృష్ణ పేరు కూడా కనిపించడంతో షాక్ తిన్న సిట్ అదికారులు వెంటనే విషయాన్ని రాధాకృష్ణకు తెలియజేశారు. అంతేకాకుండా ఈ వ్యవహారంలో స్టేట్ మెంట్ ఇవ్వాల్సి ఉందని, విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసుల ఆధారంగా శుక్రవారం ఉదయం 11 గంటలకు సిట్ కార్యాలయానికి వచ్చిన రాధాకృష్ణ ఓ గంటపాటు తన స్టేట్ మెంట్ ను ఇచ్చి వెళ్లారు.

Satya

Recent Posts

వాయిస్ మెసేజ్‌తోనూ FIR… భళా బాబు గారు

పోలీసు స్టేష‌న్ల‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవ‌స‌రం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్‌ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…

18 minutes ago

రాజు గారి స్థలంలో వైసీపీ కార్యాలయమా…?

ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…

29 minutes ago

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

2 hours ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

2 hours ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

2 hours ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

3 hours ago