Political News

ఫోన్ ట్యాపింగ్ విచారణలో ఏబీఎన్ రాధాకృష్ణ ఎం చెప్పారు?

తెలంగాణలో పెను కలకలమే రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం బయటకు వస్తోంది. ఇలా బయటకు వస్తున్న విషయాలను చూస్తుంటే… సమాజంలోని ఏ ఒక్క వర్గాన్ని కూడా నిందితులు వదలలేదని చెప్పక తప్పదు. తాజాగా శుక్రవారం వెలుగు చూసిన అంశంలో మీడియా సంస్థల అధినేతలను కూడా నిందితులు వదలలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ ప్రముఖ మీడియా సంస్థగా కొనసాగుతున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఫోన్ నూ నిందితులు ట్యాప్ చేశారు. ఈ మేరకు సిట్ నోటీసుల మేరకు రాధాకృష్ణ తన వాంగ్మూలాన్ని ఇచ్చారు.

2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నుంచే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొదలైందని ఇప్పటికే స్పష్టం అయిపోయింది. నాడు అదికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కారు ఆదేశాలతోనే నాటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు ఓ ప్రత్యక బృందాన్ని ఏర్పాటు చేసుకుని తన బాస్ లు ఇచ్చిన ఫోన్ నెంబర్లన్నింటినీ ట్యాప్ చేసి వాటి వివరాలను బాస్ లకే అందించారు. ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్, బీజేపీలకు చెందిన కీలక రాజకీయ వేత్తలతో పాటుగా కొందరు బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నట్లు సమాచారం. ఇక కొందరు పోలీసు అధికారులు, న్యాయమూర్తులు, చివరాఖరుకు మీడియా సంస్థల అదినేతలూ ఉన్నారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే శ్రవణ్ రావు అనే ఓ మీడియా సంస్థ అధినేతను సిట్ ప్రశ్నించింది. అయితే ఈయన ఫోన్ ట్యాపింగ్ నిందితుడు. అయితే ఇప్పుడు ఏబీఎన్ రాధాకృష్ణ మాత్రం బాధితుడిగా సిట్ ముందు తన స్టేట్ మెంట్ ఇచ్చారు. ఎస్ఐబీ వద్ద ఉన్న ఫోన్ నెంబర్ల జాబితాను పరిశీలించగా… రాధాకృష్ణ పేరు కూడా కనిపించడంతో షాక్ తిన్న సిట్ అదికారులు వెంటనే విషయాన్ని రాధాకృష్ణకు తెలియజేశారు. అంతేకాకుండా ఈ వ్యవహారంలో స్టేట్ మెంట్ ఇవ్వాల్సి ఉందని, విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసుల ఆధారంగా శుక్రవారం ఉదయం 11 గంటలకు సిట్ కార్యాలయానికి వచ్చిన రాధాకృష్ణ ఓ గంటపాటు తన స్టేట్ మెంట్ ను ఇచ్చి వెళ్లారు.

This post was last modified on June 27, 2025 3:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

క‌విత పాద‌యాత్ర ఏమైంది?

బీఆర్ ఎస్ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత‌గా పార్టీ పెట్టుకున్న క‌ల్వకుంట్ల క‌విత‌.. పాద‌యాత్ర చేస్తాన‌ని కొన్నాళ్ల కింద‌ట…

8 minutes ago

చంద్ర‌బాబు `ఈవీ` మంత్రం..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు స‌మ‌స్య‌ల‌ను త‌న‌దైన శైలిలో అర్థం చేసుకోవ‌డంతోపాటు.. వాటికి ప‌రిష్కారాల‌ను కూడా త‌న‌దైన శైలిలోనే చూపిస్తారు. ప్ర‌స్తుతం…

2 hours ago

టాక్సిక్ నిర్మాతకు ‘డెవిల్’ షాక్ కొట్టింది

కెవిఎన్ ప్రొడక్షన్స్ అంటే నిన్న ఏడాది దాకా పెద్దగా పరిచయం లేదు కానీ గత ఆరు నెలల్లో ఒక్కసారిగా ఈ…

3 hours ago

నాయకుల ఇబ్బందిని పవన్ లైట్ తీసుకున్నారా?

ఏపీలో కూట‌మి పార్టీ ప్ర‌భుత్వం బ‌లంగా ఉంది. వ‌చ్చే 15 ఏళ్ల‌పాటు ప్ర‌భుత్వాన్ని కొన‌సాగిస్తామ‌ని కూడా చెబుతోంది. ఉన్న‌త‌స్థాయిలో సీఎం,…

8 hours ago

జాన్వీ కొంచెం మిస్ ఫైర్ అయ్యిందా

పెద్ది ట్రైలర్ లో జాన్వీ కపూర్ ని కేవలం గ్లామర్ షోకే పరిమితం చేయడం ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రతి…

8 hours ago

ఆర్ఆర్ఆర్ హీరోలు… కాకతాళీయ పోలికలు

టాలీవుడ్ మల్టీస్టారర్స్ లో కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టిన హీరోలుగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎప్పటికీ స్పెషల్…

11 hours ago