Political News

ఎమ‌ర్జెన్సీలో అసాధార‌ణ అకృత్యం.. ఎంత ఘోరం అంటే!

ప్ర‌పంచ ప్ర‌జాస్వామ్య దేశాల‌కు త‌ల‌మానికంగా ఉన్న భార‌త్‌లో 1975, జూన్ 25న విధించిన అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి.. ఇప్ప‌టికీ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌జాస్వామ్య వాదులు.. సమాజ ఉద్ధ‌ర‌ణ సంఘాలు కూడా నాడు అనేక హింస‌ల‌కు గుర‌య్యాయి. నాయ‌కుల‌ను జైళ్ల‌లో బందీలు చేశారు. అంతేకాదు.. ముంబై, అహ్మ‌దాబాద్ వంటి న‌గ‌రాల్లో ప్ర‌త్యేకంగా జైళ్ల‌ను నిర్మించి మ‌రీ.. ఖైదీల‌ను అందులో పెట్టారు. ఇప్ప‌టికీ.. ఇవి నాటికి గుర్తుగా ఉన్నాయి.

ఇవి అత్యంత ఇరుకైనా జైళ్లుగా కేంద్రం పేర్కొంది. అంటే.. కేవ‌లం 4 అడుగుల ఎత్తులోనే బ్యార‌క్‌లు ఉంటాయి. అంతేకాదు.. ఒక్క‌రి మాత్ర‌మే అవ‌కాశం ఉండేలా వీటిని గ‌దుగ‌దులుగా నిర్మించారు. క‌నీసం.. మ‌నిషి చేతులు చాపుకునే అవ‌కాశం కూడా ఉండ‌దు. అలాంటి జైళ్ల‌ను నిర్మించి.. వాటిలో రాజ‌కీయ ఖైదీల‌ను పెట్టారు. ఇదిలావుంటే.. అస‌లు ఎమ‌ర్జెన్సీలో అసాధార‌ణ అకృత్యం మ‌రొక‌టి జ‌రిగింది. ఇదే.. దేశంలో ఎమ‌ర్జెన్సీని అంత‌మొందించేందుకు ప్ర‌ధాన కార‌ణం కూడా అయింది.

నాటి ప్ర‌ధాని ఇందిరాగాంధీ ముద్దుల కుమారుడు సంజ‌య్ గాంధీ.. అప్ప‌టిక‌త అసాధార‌ణ నాయ‌కుడిగా రెచ్చిపోయారు. ఆయ‌న‌కు ప్ర‌భుత్వంలో ఎలాంటి భాగ‌స్వామ్యం లేక‌పోయినా.. రాష్ట్రాల‌పై పెత్త‌నం చేశారు. ప్ర‌జ‌ల జీవితాల‌ను ఛిన్నాభిన్నం చేయడంలో కీల‌క పాత్ర పోషించారు. ఈ క్ర‌మంలో ఆయ‌న తీసుకువ‌చ్చిందే.. నిర్బంధం గ‌ర్భ విచ్ఛిత్తి కార్య‌క్ర‌మం. అంటే.. గ‌ర్భిణుల‌కు నిర్బంధంగా అబార్ష‌న్లు చేయించ‌డం. ఇది దేశ‌వ్యాప్తంగా అమ‌లైంది.

ఎవ‌రూ గ‌ర్భం ధరించ‌డానికి వీల్లేద‌ని అన‌ధికారిక ఉత్త‌ర్వులు ఇచ్చారు. దీనిని దేశ‌వ్యాప్తంగా అమ‌లు చేశారు. మ‌రీ ముఖ్యంగా ఆర్ ఎస్ ఎస్ ప్రాబ‌ల్య రాష్ట్రాల్లో దీనిని మ‌రింత ఎక్కువ‌గా అమ‌లు చేశారు. వైద్యుల‌ను ఇంటింటికీ పంపించి.. మ‌హిళ‌ల పొత్తిక‌డుపుల‌ను ప‌రీక్షించారు. ఎవ‌రైనా గ‌ర్భంతో ఉన్నార‌ని తెలిస్తే.. ఆ వెంట‌నే వారిని బ‌ల‌వంతంగా ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించి.. గ‌ర్భ‌విచ్ఛిత్తి చేశారు. ఈ ప‌రిణామం మ‌హిళ‌ల ఆగ్ర‌హానికి దారి తీసింది. ఈ క్ర‌మంలోనే దేశంలో 1975-77 మ‌ధ్య జ‌నాభా రేటు త‌గ్గిపోయింది. అనంత‌ర కాలంలో రాజ‌కీయాల‌కు అతీతంగా.. దేశ‌వ్యాప్తంగా మ‌హిళ‌లు ఇందిర‌మ్మ‌కు ద్వేషించే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇది ఎమ‌ర్జెన్సీని తొల‌గించే వర‌కు దాదాపు ఏడాది పాటు కొన‌సాగింది. వాస్త‌వ ఎమ‌ర్జెన్సీ 21 నెల‌లు సాగింది.

This post was last modified on June 25, 2025 5:46 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వార్ ఎఫెక్ట్: ఇక హైదరాబాద్ వంతు!

అక్కడెక్కడో ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికాలు యుద్దం చేసుకుంటే.. వారికి వేలాది కిలోమీటర్ల ఇవతల ఉన్న బెంగళూరులోని టిఫిన్ సెంటర్లు..…

17 minutes ago

బ్యాండ్ మ్రోగిస్తున్న మేళం సరిపోవడం లేదా

నిర్మాత కోన వెంకట్ బ్యాండ్ మేళంని చాలా సీరియస్ గా తీసుకున్న వైనం ప్రమోషన్లలో కనిపిస్తోంది. కోర్ట్ జంట హర్ష్…

21 minutes ago

రవితేజను అవమానించిన నిర్మాత ఎవరు?

సినీ రంగంలో ఎప్పుడు ఎవరి రాత మారుతుందో తెలియదు. నటులుగా చిన్న చిన్న పాత్రలు చేసిన వాళ్లు.. రైటర్లుగా, అసిస్టెంట్…

2 hours ago

ఆమిర్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

పదేళ్ల ముందు ‘దంగల్’ మూవీతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు బాలీవుడ్ సూపర్ స్టార్. ఇప్పటికీ ఇండియాస్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ…

5 hours ago

వృషకర్మ… జాక్ పాట్ కొట్టిందమ్మా

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా పెద్ద సినిమాకు ముందస్తు బిజినెస్ జరగడం చాలా కష్టమైపోయింది. ముఖ్యంగా ఒక్క టీజర్ తోనే మొత్తం…

6 hours ago

అంతు చిక్కని ప్రభాస్ ఆలోచనలు

టాలీవుడ్ టాప్ హీరోల్లో అత్యధిక డిమాండ్ ఉన్నది ఎవరికయ్యా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. తెలుగులోనే కాదు హిందీలోనూ…

8 hours ago