Political News

ఎమ‌ర్జెన్సీలో అసాధార‌ణ అకృత్యం.. ఎంత ఘోరం అంటే!

ప్ర‌పంచ ప్ర‌జాస్వామ్య దేశాల‌కు త‌ల‌మానికంగా ఉన్న భార‌త్‌లో 1975, జూన్ 25న విధించిన అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి.. ఇప్ప‌టికీ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌జాస్వామ్య వాదులు.. సమాజ ఉద్ధ‌ర‌ణ సంఘాలు కూడా నాడు అనేక హింస‌ల‌కు గుర‌య్యాయి. నాయ‌కుల‌ను జైళ్ల‌లో బందీలు చేశారు. అంతేకాదు.. ముంబై, అహ్మ‌దాబాద్ వంటి న‌గ‌రాల్లో ప్ర‌త్యేకంగా జైళ్ల‌ను నిర్మించి మ‌రీ.. ఖైదీల‌ను అందులో పెట్టారు. ఇప్ప‌టికీ.. ఇవి నాటికి గుర్తుగా ఉన్నాయి.

ఇవి అత్యంత ఇరుకైనా జైళ్లుగా కేంద్రం పేర్కొంది. అంటే.. కేవ‌లం 4 అడుగుల ఎత్తులోనే బ్యార‌క్‌లు ఉంటాయి. అంతేకాదు.. ఒక్క‌రి మాత్ర‌మే అవ‌కాశం ఉండేలా వీటిని గ‌దుగ‌దులుగా నిర్మించారు. క‌నీసం.. మ‌నిషి చేతులు చాపుకునే అవ‌కాశం కూడా ఉండ‌దు. అలాంటి జైళ్ల‌ను నిర్మించి.. వాటిలో రాజ‌కీయ ఖైదీల‌ను పెట్టారు. ఇదిలావుంటే.. అస‌లు ఎమ‌ర్జెన్సీలో అసాధార‌ణ అకృత్యం మ‌రొక‌టి జ‌రిగింది. ఇదే.. దేశంలో ఎమ‌ర్జెన్సీని అంత‌మొందించేందుకు ప్ర‌ధాన కార‌ణం కూడా అయింది.

నాటి ప్ర‌ధాని ఇందిరాగాంధీ ముద్దుల కుమారుడు సంజ‌య్ గాంధీ.. అప్ప‌టిక‌త అసాధార‌ణ నాయ‌కుడిగా రెచ్చిపోయారు. ఆయ‌న‌కు ప్ర‌భుత్వంలో ఎలాంటి భాగ‌స్వామ్యం లేక‌పోయినా.. రాష్ట్రాల‌పై పెత్త‌నం చేశారు. ప్ర‌జ‌ల జీవితాల‌ను ఛిన్నాభిన్నం చేయడంలో కీల‌క పాత్ర పోషించారు. ఈ క్ర‌మంలో ఆయ‌న తీసుకువ‌చ్చిందే.. నిర్బంధం గ‌ర్భ విచ్ఛిత్తి కార్య‌క్ర‌మం. అంటే.. గ‌ర్భిణుల‌కు నిర్బంధంగా అబార్ష‌న్లు చేయించ‌డం. ఇది దేశ‌వ్యాప్తంగా అమ‌లైంది.

ఎవ‌రూ గ‌ర్భం ధరించ‌డానికి వీల్లేద‌ని అన‌ధికారిక ఉత్త‌ర్వులు ఇచ్చారు. దీనిని దేశ‌వ్యాప్తంగా అమ‌లు చేశారు. మ‌రీ ముఖ్యంగా ఆర్ ఎస్ ఎస్ ప్రాబ‌ల్య రాష్ట్రాల్లో దీనిని మ‌రింత ఎక్కువ‌గా అమ‌లు చేశారు. వైద్యుల‌ను ఇంటింటికీ పంపించి.. మ‌హిళ‌ల పొత్తిక‌డుపుల‌ను ప‌రీక్షించారు. ఎవ‌రైనా గ‌ర్భంతో ఉన్నార‌ని తెలిస్తే.. ఆ వెంట‌నే వారిని బ‌ల‌వంతంగా ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించి.. గ‌ర్భ‌విచ్ఛిత్తి చేశారు. ఈ ప‌రిణామం మ‌హిళ‌ల ఆగ్ర‌హానికి దారి తీసింది. ఈ క్ర‌మంలోనే దేశంలో 1975-77 మ‌ధ్య జ‌నాభా రేటు త‌గ్గిపోయింది. అనంత‌ర కాలంలో రాజ‌కీయాల‌కు అతీతంగా.. దేశ‌వ్యాప్తంగా మ‌హిళ‌లు ఇందిర‌మ్మ‌కు ద్వేషించే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇది ఎమ‌ర్జెన్సీని తొల‌గించే వర‌కు దాదాపు ఏడాది పాటు కొన‌సాగింది. వాస్త‌వ ఎమ‌ర్జెన్సీ 21 నెల‌లు సాగింది.

This post was last modified on June 25, 2025 5:46 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అంబటి రాంబాబు కాపు టైగర్ – జగన్

అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్‌లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్‌సీపీ…

38 minutes ago

SRH: కమిన్స్ లేకుంటే కెప్టెన్ ఎవరు మరీ?

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌కు ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ మొదలైంది. ఆరెంజ్ ఆర్మీని గతేడాది ఫైనల్ వరకు తీసుకెళ్లిన ప్యాట్…

1 hour ago

నెల రోజుల గ్యాపులో బాబాయ్ అబ్బాయ్

రెండు పెద్ద సినిమాల విడుదల తేదీ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ముందు నుంచి ప్రచారం జరిగినట్టు పెద్ది వదిలేసుకున్న మార్చి…

3 hours ago

లెజెండ్ పోయాడు… లీడర్ వస్తున్నాడు

నాలుగేళ్ల క్రితం తమిళ హీరోగా మనకూ పరిచయమైన శరవణన్ 'ది లెజెండ్'తో డెబ్యూ చేసి తెరంగేట్రంతోనే ట్రోలింగ్ చవి చూడాల్సి…

3 hours ago

గేమ్ కోసం ఫోన్ ఇవ్వలేదని ముగ్గురు అక్కాచెల్లెళ్ళు…

​ఘజియాబాద్‌లోని భారత్ సిటీ సొసైటీలో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసలైన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులు…

5 hours ago

అల్లరోడి ఆల్కహాల్ అడ్రస్ ఎక్కడ

అల్లరి నరేష్ కొత్త సినిమా ఆల్కహాల్ టీజర్ వచ్చి అయిదు నెలలు దాటేసింది. దాంట్లో ప్రకటించిన విడుదల తేదీ జనవరి…

6 hours ago