వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం తాడేపల్లిలోని తన పార్టీ కేంద్ర కార్యాలయంలో సుదీర్ఘంగా మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎప్పటిలానే కూటమి పాలన కంటే తన పాలనే మెరుగ్గా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. మొత్తానికే మొత్తం అన్నీ పాత విషయాలే మాట్లాడిన జగన్… చివరలో మాత్రం కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాటి రెంటపాళ్ల పర్యటనలో వైసీపీ కార్యకర్త ఒకరు రెచ్చగొట్టే ఓ ప్లకార్డును పట్టుకున్న విషయాన్ని ప్రస్తావించిన మీడియా… దానిపై పోలీసులు ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు. దీనిపై మీ స్పందన ఏమిటని ప్రశ్నించింది.
మీడియా ప్రశ్నలకు ఒకింత సహనంతోనే సమాధానాలు ఇచ్చిన జగన్… సదరు ప్లకార్డులో ఏముందని ప్రశ్నించారు. ‘గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలలు నరికినట్టు రప్పా రప్పా నరుకుతా’ అంటూ ఆ ప్లకార్డుపై ఉందని మీడియా ప్రతినిధి చెప్పగానే… ఇదేదో సినిమా డైలాగ్ మాదిరిగా ఉందే అంటూ జగన్ అన్నారు. ఆ సినిమా ఏది అంటూ ప్రశ్నించిన ఆయన పుష్ప 2 సినిమా అనే ఆన్సర్ రాగానే.. అంటే సినిమా డైలాగులు వాడితే కూడా కేసులు పెడతారా? అంటూ జగన్ వ్యంగ్యాస్త్రాలు సందించారు. ఈ సందర్భంగానే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ అన్నట్లుగా తన చేతులతో ‘గడ్డం ఇట్టన్నా తప్పే, గడ్డం అట్టన్నా తప్పేనా?’ అంటూ జగన్ తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు.
అయినా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అంటూ జగన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ తర్వాత సదరు ప్లకార్డు పట్టిన కార్యకర్త టీడీపీకి చెందిన వారని, ఆయనకు ఏకంగా టీడీపీ సభ్యత్వం కూడా ఉందని ఓ మీడియా ప్రతినిధి ఏకంగా ఫొటోనే జగన్ కు చూపించారు. అయితే ఇదంతా చంద్రబాబే చేయించారా? అంటూ ఆయన హాస్యమాడారు. ఇక ఆ టీడీపీ కార్యకర్త నిరసనలోనూ న్యాయముందిలే అంటూ చెప్పిన జగన్.. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో ఆ కార్యకర్త టీడీపీని వీడి వైసీపీలో చేరి ఉంటాడులే అంటూ ముక్తాయింపునిచ్చారు.
This post was last modified on June 19, 2025 2:40 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…