అప్పు తీర్చలేదన్న కారణంతో ఓ మహిళను చెట్టుకు కట్టేసి చిత్రహింసలకు గురి చేసిన ఘటన ఏపీలో కలకలమే రేపింది. సాక్షాత్తు సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం పరిధిలో ఈ ఘటన జరగడంతో దీనికి మరింత ప్రాధాన్యం లభించింది. ఈ వీడియోలు వైరల్ కాగా… సీఎం చంద్రబాబు సీరియస్ గా స్పందించారు. తాజాగా మంగళవారం సాయంత్రం బాధిత మహిళ శిరీషతో ఆయన ఫోన్ లో పమార్శించారు. అంతేకాకుండా రూ.5 లక్షల పరిహారం ప్రకటించిన బాబు.. ఆమె పిల్లల చదువులకు కూడా హామీ ఇచ్చారు. దీంతో బాధిత మహిళకు పూర్తిగా సాంత్వన లభించినట్టైంది.
కుప్పం మండలం నారాయణాపురం గ్రామానికి చెందిన తిమ్మరాయప్ప, శిరీష దంపతులు అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద కొంతకాలం క్రితం రూ.80 వేలు అప్పు తీసుకున్నారు. ఆ తర్వాత అప్పు తీర్చడం సాధ్యం కాక తిమ్మరాయప్ప తన కుటుంబాన్ని వదిలి పారిపోయాడు. ఆ తర్వాత శిరీష తన కుమారుడితో కలిసి బెంగళూరు వెళ్లి తన తల్లిదండ్రుల వద్ద ఉంటూ దినసరి కూలీగా జీవనం సాగిస్తోంది. అయితే కుమారుడి స్టడీ సర్టిఫికెట్ అవసరమై ఆమె కుమారుడితో కలిసి గ్రామానికి రాగా… మునికన్నప్ప, ఆయన కుటుంబ సభ్యులు ఆమెను చెట్టుకు కట్టేసి హింసించారు. ఈ విషయం వైరల్ కాగా.. జిల్లా ఎస్పీకి ఫోన్ చేసిన బాబు… నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
స్వయంగా సీఎం ఆదేశాలు జారీ చేయడంతో శిరీషను ఆసుపత్రిలో చేర్చిన పోలీసులు నిందితుడు మునికన్నప్ప కుటుంబంపై హత్యాయత్నం కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇక రోజువారీ బిజీ షెడ్యూల్ నుంచి కాస్తంత బయటపడ్డ బాబు… మంగళవారం సాయంత్రం శిరీషకు నేరుగా ఫోన్ చేశారు. ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని, భరపడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ఉండాలని ఆమెకు సూచించారు. గతంలో నిందితుల నుంచి ఎప్పుడైనా ఇలాంటి వేధింపులు ఎదురయ్యాయా? అని బాబు ప్రశ్నించగా.. చాలా సందర్భాల్లో వారు తనను ఇబ్బంది పెట్టారని ఆమె సమాధానం ఇచ్చారు. ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదన్న బాబు…నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఆమెకు హామీ ఇచ్చారు.
This post was last modified on June 17, 2025 9:08 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…