అప్పు తీర్చలేదన్న కారణంతో ఓ మహిళను చెట్టుకు కట్టేసి చిత్రహింసలకు గురి చేసిన ఘటన ఏపీలో కలకలమే రేపింది. సాక్షాత్తు సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం పరిధిలో ఈ ఘటన జరగడంతో దీనికి మరింత ప్రాధాన్యం లభించింది. ఈ వీడియోలు వైరల్ కాగా… సీఎం చంద్రబాబు సీరియస్ గా స్పందించారు. తాజాగా మంగళవారం సాయంత్రం బాధిత మహిళ శిరీషతో ఆయన ఫోన్ లో పమార్శించారు. అంతేకాకుండా రూ.5 లక్షల పరిహారం ప్రకటించిన బాబు.. ఆమె పిల్లల చదువులకు కూడా హామీ ఇచ్చారు. దీంతో బాధిత మహిళకు పూర్తిగా సాంత్వన లభించినట్టైంది.
కుప్పం మండలం నారాయణాపురం గ్రామానికి చెందిన తిమ్మరాయప్ప, శిరీష దంపతులు అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద కొంతకాలం క్రితం రూ.80 వేలు అప్పు తీసుకున్నారు. ఆ తర్వాత అప్పు తీర్చడం సాధ్యం కాక తిమ్మరాయప్ప తన కుటుంబాన్ని వదిలి పారిపోయాడు. ఆ తర్వాత శిరీష తన కుమారుడితో కలిసి బెంగళూరు వెళ్లి తన తల్లిదండ్రుల వద్ద ఉంటూ దినసరి కూలీగా జీవనం సాగిస్తోంది. అయితే కుమారుడి స్టడీ సర్టిఫికెట్ అవసరమై ఆమె కుమారుడితో కలిసి గ్రామానికి రాగా… మునికన్నప్ప, ఆయన కుటుంబ సభ్యులు ఆమెను చెట్టుకు కట్టేసి హింసించారు. ఈ విషయం వైరల్ కాగా.. జిల్లా ఎస్పీకి ఫోన్ చేసిన బాబు… నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
స్వయంగా సీఎం ఆదేశాలు జారీ చేయడంతో శిరీషను ఆసుపత్రిలో చేర్చిన పోలీసులు నిందితుడు మునికన్నప్ప కుటుంబంపై హత్యాయత్నం కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇక రోజువారీ బిజీ షెడ్యూల్ నుంచి కాస్తంత బయటపడ్డ బాబు… మంగళవారం సాయంత్రం శిరీషకు నేరుగా ఫోన్ చేశారు. ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని, భరపడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ఉండాలని ఆమెకు సూచించారు. గతంలో నిందితుల నుంచి ఎప్పుడైనా ఇలాంటి వేధింపులు ఎదురయ్యాయా? అని బాబు ప్రశ్నించగా.. చాలా సందర్భాల్లో వారు తనను ఇబ్బంది పెట్టారని ఆమె సమాధానం ఇచ్చారు. ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదన్న బాబు…నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఆమెకు హామీ ఇచ్చారు.
This post was last modified on June 17, 2025 9:08 pm
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…