అప్పు తీర్చలేదన్న కారణంతో ఓ మహిళను చెట్టుకు కట్టేసి చిత్రహింసలకు గురి చేసిన ఘటన ఏపీలో కలకలమే రేపింది. సాక్షాత్తు సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం పరిధిలో ఈ ఘటన జరగడంతో దీనికి మరింత ప్రాధాన్యం లభించింది. ఈ వీడియోలు వైరల్ కాగా… సీఎం చంద్రబాబు సీరియస్ గా స్పందించారు. తాజాగా మంగళవారం సాయంత్రం బాధిత మహిళ శిరీషతో ఆయన ఫోన్ లో పమార్శించారు. అంతేకాకుండా రూ.5 లక్షల పరిహారం ప్రకటించిన బాబు.. ఆమె పిల్లల చదువులకు కూడా హామీ ఇచ్చారు. దీంతో బాధిత మహిళకు పూర్తిగా సాంత్వన లభించినట్టైంది.
కుప్పం మండలం నారాయణాపురం గ్రామానికి చెందిన తిమ్మరాయప్ప, శిరీష దంపతులు అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద కొంతకాలం క్రితం రూ.80 వేలు అప్పు తీసుకున్నారు. ఆ తర్వాత అప్పు తీర్చడం సాధ్యం కాక తిమ్మరాయప్ప తన కుటుంబాన్ని వదిలి పారిపోయాడు. ఆ తర్వాత శిరీష తన కుమారుడితో కలిసి బెంగళూరు వెళ్లి తన తల్లిదండ్రుల వద్ద ఉంటూ దినసరి కూలీగా జీవనం సాగిస్తోంది. అయితే కుమారుడి స్టడీ సర్టిఫికెట్ అవసరమై ఆమె కుమారుడితో కలిసి గ్రామానికి రాగా… మునికన్నప్ప, ఆయన కుటుంబ సభ్యులు ఆమెను చెట్టుకు కట్టేసి హింసించారు. ఈ విషయం వైరల్ కాగా.. జిల్లా ఎస్పీకి ఫోన్ చేసిన బాబు… నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
స్వయంగా సీఎం ఆదేశాలు జారీ చేయడంతో శిరీషను ఆసుపత్రిలో చేర్చిన పోలీసులు నిందితుడు మునికన్నప్ప కుటుంబంపై హత్యాయత్నం కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇక రోజువారీ బిజీ షెడ్యూల్ నుంచి కాస్తంత బయటపడ్డ బాబు… మంగళవారం సాయంత్రం శిరీషకు నేరుగా ఫోన్ చేశారు. ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని, భరపడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ఉండాలని ఆమెకు సూచించారు. గతంలో నిందితుల నుంచి ఎప్పుడైనా ఇలాంటి వేధింపులు ఎదురయ్యాయా? అని బాబు ప్రశ్నించగా.. చాలా సందర్భాల్లో వారు తనను ఇబ్బంది పెట్టారని ఆమె సమాధానం ఇచ్చారు. ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదన్న బాబు…నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఆమెకు హామీ ఇచ్చారు.
This post was last modified on June 17, 2025 9:08 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…