అప్పు తీర్చలేదన్న కారణంతో ఓ మహిళను చెట్టుకు కట్టేసి చిత్రహింసలకు గురి చేసిన ఘటన ఏపీలో కలకలమే రేపింది. సాక్షాత్తు సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం పరిధిలో ఈ ఘటన జరగడంతో దీనికి మరింత ప్రాధాన్యం లభించింది. ఈ వీడియోలు వైరల్ కాగా… సీఎం చంద్రబాబు సీరియస్ గా స్పందించారు. తాజాగా మంగళవారం సాయంత్రం బాధిత మహిళ శిరీషతో ఆయన ఫోన్ లో పమార్శించారు. అంతేకాకుండా రూ.5 లక్షల పరిహారం ప్రకటించిన బాబు.. ఆమె పిల్లల చదువులకు కూడా హామీ ఇచ్చారు. దీంతో బాధిత మహిళకు పూర్తిగా సాంత్వన లభించినట్టైంది.
కుప్పం మండలం నారాయణాపురం గ్రామానికి చెందిన తిమ్మరాయప్ప, శిరీష దంపతులు అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద కొంతకాలం క్రితం రూ.80 వేలు అప్పు తీసుకున్నారు. ఆ తర్వాత అప్పు తీర్చడం సాధ్యం కాక తిమ్మరాయప్ప తన కుటుంబాన్ని వదిలి పారిపోయాడు. ఆ తర్వాత శిరీష తన కుమారుడితో కలిసి బెంగళూరు వెళ్లి తన తల్లిదండ్రుల వద్ద ఉంటూ దినసరి కూలీగా జీవనం సాగిస్తోంది. అయితే కుమారుడి స్టడీ సర్టిఫికెట్ అవసరమై ఆమె కుమారుడితో కలిసి గ్రామానికి రాగా… మునికన్నప్ప, ఆయన కుటుంబ సభ్యులు ఆమెను చెట్టుకు కట్టేసి హింసించారు. ఈ విషయం వైరల్ కాగా.. జిల్లా ఎస్పీకి ఫోన్ చేసిన బాబు… నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
స్వయంగా సీఎం ఆదేశాలు జారీ చేయడంతో శిరీషను ఆసుపత్రిలో చేర్చిన పోలీసులు నిందితుడు మునికన్నప్ప కుటుంబంపై హత్యాయత్నం కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇక రోజువారీ బిజీ షెడ్యూల్ నుంచి కాస్తంత బయటపడ్డ బాబు… మంగళవారం సాయంత్రం శిరీషకు నేరుగా ఫోన్ చేశారు. ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని, భరపడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ఉండాలని ఆమెకు సూచించారు. గతంలో నిందితుల నుంచి ఎప్పుడైనా ఇలాంటి వేధింపులు ఎదురయ్యాయా? అని బాబు ప్రశ్నించగా.. చాలా సందర్భాల్లో వారు తనను ఇబ్బంది పెట్టారని ఆమె సమాధానం ఇచ్చారు. ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదన్న బాబు…నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఆమెకు హామీ ఇచ్చారు.
This post was last modified on June 17, 2025 9:08 pm
దేశంలో ఎక్కడికి వెళ్లినా వారి మాతృభాష మీద అమితమైన ప్రేమ చూపిస్తారు. ఆ భాష నేర్చుకోవడానికి, అందులో నైపుణ్యం చేయడానికి…
దేశంలో అత్యంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి రాజకీయాల వరకు ఎంతో గొప్ప పాత్ర…
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి అసలేం బాగోలేదు. హౌస్ ఫుల్ బోర్డులకు బూజు పడుతోంది. టికెట్లన్నీ అమ్ముడుపోయాయని గర్వంగా చెప్పుకునే…
https://youtu.be/COhEUjI-GEk?si=vlcLiVU0tytCMihG ఎంఆర్పీ సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రముఖ నిర్మాత సాహు గారపాటి చేతుల మీదుగా…
జూన్ నెలకు వాయిదా వేసుకున్న పెద్ది చివరి ఘట్టంకు వచ్చేసింది. ఐటెం సాంగ్ తీస్తే గుమ్మడికాయ కొట్టొచ్చు. దర్శకుడు బుచ్చిబాబు…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు(90) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో సతమతం అవుతున్న నాదెండ్ల…