Political News

23 ముహూర్తం.. అస‌లు విష‌యాలు తేలేది అప్పుడే!

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఓ కీల‌క కార్య‌క్ర‌మానికి ఈ నెల 23ను ముహూర్తంగా నిర్ణ‌యించారు. రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఏడాది పూర్త‌యిన నేప‌థ్యంలో ఈ ఏడాది కాలంలో చేప‌ట్టిన కార్య‌క్ర‌మాలు, చేసిన సంక్షేమం వంటి కీల‌క అంశాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని నిర్ణ‌యించారు.ఈ నేప‌థ్యంలోనే ఈ నెల 23 నుంచి ‘ఇంటింటికీ సుప‌రిపాల‌న‌’ పేరుతో ప్ర‌చారం చేయాల‌ని ఇప్ప‌టికే కార్య‌క‌ర్త‌లు, ఎమ్మెల్యేలు, ఎంపీల‌కు చంద్ర‌బాబు దిశానిర్దేశం చేశారు.

ఇది మంచి నిర్ణ‌య‌మే. ప్ర‌భుత్వం చేస్తున్న కార్య‌క్ర‌మాల‌కు.. ప్ర‌చారం చేసుకోవ‌డం అనేది త‌ప్పుప‌ట్టాల్సి న అవ‌స‌రం లేదు. పైగా దేశ‌వ్యాప్తంగా కూడా.. ప్ర‌భుత్వాలు ఇప్పుడు ఏటికేడు ప్ర‌జాద‌ర‌ణ‌పై జాగ‌రూక‌త‌తో నే ఉంటున్నాయి. ప్ర‌జ‌ల నాడి తెలుసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. గ‌తంలో వైసీపీ కూడా.. ఇలానే ‘గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు’పేరుతో ఎమ్మెల్యేలు మంత్రుల‌ను పంపించి.. ప్ర‌భుత్వ తీరును తెలుసుకుంది. ఇప్పుడు చంద్ర‌బాబు కూడా అదే బాట ప‌ట్టారు.

అయితే.. అస‌లు విష‌యాలు అనేవి ఇప్పుడు తెలుస్తాయి. ఈ కార్య‌క్ర‌మం పైకి చెప్పుకొన్నంత ఈజీ అయి తే కాదు.. సంతృప్తి-అసంతృప్తుల బేరీజులో.. అత్యంత కీల‌క‌మైన కార్య‌క్ర‌మం. దీంతో ప్ర‌జ‌లు ఏమ‌నుకుం టున్నారు..? ఎలా స్పందిస్తున్నారు? అనేది ఇప్పుడు స్ప‌ష్టంగా తెలుస్తుంది. ఎవ‌రినీ ఎవ‌రూ మోసం చేసేందుకు అవ‌కాశం లేని విధంగా ప్ర‌జ‌ల స్పంద‌న తెలుసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. ఇసుక మ‌ద్యం వ్య‌వ‌హారాల‌పై ప్ర‌జ‌లు నిప్పులు చెరుగుతున్నారు. దీనిని ఎంత దాస్తే.. అంత చేటే.

ఈ విష‌యాల‌తోపాటు.. సంక్షేమం ఎంత మందికి అందుతోందో కూడా ఇప్పుడు తెలిసిపోతుంది. ఎమ్మెల్యే ల ప‌నితీరుకు ప్ర‌జ‌లే అద్దం ప‌డ‌తారు. అయితే..ఇవ‌న్నీ తెలియ‌డం గొప్ప విష‌యం కాదు.. తెలిసిన త‌ర్వాత‌.. లోపాలు స‌రిదిద్దుకోవ‌డ‌మే అస‌లు కీల‌కం. గ‌తంలో వైసీపీ ప్ర‌భుత్వానికి కూడా లోపాలు తెలిసి వ‌చ్చాయి. కానీ, మార్పుల దిశ‌గా అడుగులు వేయ‌ని ఫలితంగా.. ఆ పార్టీ పుట్టి మునిగింది. ఇప్పుడు చంద్ర‌బాబు కూడా.. అలానే చేస్తారా? లేక‌, మార్పుల దిశగా అడుగులు వేస్తారా? అన్న‌ది ఈ కార్య‌క్ర‌మం తేల్చేయ‌నుంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Satya

Recent Posts

కొత్త ‘పెద్ది’ త్వరగా వచ్చేయాలి

అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…

1 hour ago

AA23 విలన్ పైనే అందరి కన్ను!

అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…

1 hour ago

రూ.25 లక్షల పరిహారం… ఓ శాశ్వత ఉద్యోగం

విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…

3 hours ago

మీనాక్షి కోసం డీకే క్యాంపు

గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు ఎప్పుడు కష్టం వచ్చినా… ఆదుకునేందుకు కర్ణాకట కొత్త సీఎం డీకే శివకుమార్ సదా…

3 hours ago

కోలీవుడ్ స్టార్ టాలీవుడ్ డైరెక్టర్… ఆ ప్రాజెక్టు మధ్యలో ఆగిపోయిందా?

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. కోలీవుడ్ కు…

4 hours ago

స్టీల్ ప్లాంట్ బాధితుల పరామర్శలో ఎందుకీ రచ్చ?

విశాఖ స్టీల్ ప్లాంట్ లో సోమవారం భారీ ప్రమాదం సంభవించింది. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు.…

5 hours ago