ఏపీ సీఎం చంద్రబాబు ఓ కీలక కార్యక్రమానికి ఈ నెల 23ను ముహూర్తంగా నిర్ణయించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఈ ఏడాది కాలంలో చేపట్టిన కార్యక్రమాలు, చేసిన సంక్షేమం వంటి కీలక అంశాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించారు.ఈ నేపథ్యంలోనే ఈ నెల 23 నుంచి ‘ఇంటింటికీ సుపరిపాలన’ పేరుతో ప్రచారం చేయాలని ఇప్పటికే కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
ఇది మంచి నిర్ణయమే. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు.. ప్రచారం చేసుకోవడం అనేది తప్పుపట్టాల్సి న అవసరం లేదు. పైగా దేశవ్యాప్తంగా కూడా.. ప్రభుత్వాలు ఇప్పుడు ఏటికేడు ప్రజాదరణపై జాగరూకతతో నే ఉంటున్నాయి. ప్రజల నాడి తెలుసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. గతంలో వైసీపీ కూడా.. ఇలానే ‘గడపగడపకు’పేరుతో ఎమ్మెల్యేలు మంత్రులను పంపించి.. ప్రభుత్వ తీరును తెలుసుకుంది. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే బాట పట్టారు.
అయితే.. అసలు విషయాలు అనేవి ఇప్పుడు తెలుస్తాయి. ఈ కార్యక్రమం పైకి చెప్పుకొన్నంత ఈజీ అయి తే కాదు.. సంతృప్తి-అసంతృప్తుల బేరీజులో.. అత్యంత కీలకమైన కార్యక్రమం. దీంతో ప్రజలు ఏమనుకుం టున్నారు..? ఎలా స్పందిస్తున్నారు? అనేది ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. ఎవరినీ ఎవరూ మోసం చేసేందుకు అవకాశం లేని విధంగా ప్రజల స్పందన తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇసుక మద్యం వ్యవహారాలపై ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు. దీనిని ఎంత దాస్తే.. అంత చేటే.
ఈ విషయాలతోపాటు.. సంక్షేమం ఎంత మందికి అందుతోందో కూడా ఇప్పుడు తెలిసిపోతుంది. ఎమ్మెల్యే ల పనితీరుకు ప్రజలే అద్దం పడతారు. అయితే..ఇవన్నీ తెలియడం గొప్ప విషయం కాదు.. తెలిసిన తర్వాత.. లోపాలు సరిదిద్దుకోవడమే అసలు కీలకం. గతంలో వైసీపీ ప్రభుత్వానికి కూడా లోపాలు తెలిసి వచ్చాయి. కానీ, మార్పుల దిశగా అడుగులు వేయని ఫలితంగా.. ఆ పార్టీ పుట్టి మునిగింది. ఇప్పుడు చంద్రబాబు కూడా.. అలానే చేస్తారా? లేక, మార్పుల దిశగా అడుగులు వేస్తారా? అన్నది ఈ కార్యక్రమం తేల్చేయనుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on June 15, 2025 3:55 pm
ప్రపంచంలోనే అతి పెద్ద సినిమా మార్కెట్ ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. ఐతే భారీ చిత్రాల వీక్షణలో అద్భుతమైన అనుభూతిని…
బుల్లితెర నటుడు ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ తన ప్రతి ప్రెస్ మీట్ లో ఏదో ఒక వైరల్ కంటెంట్ ఇవ్వడం…
జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబును ముద్రగడ పద్మనాభం పరామర్శించడం, జనసేన పార్టీలో ఉన్నా ఆయన కుమార్తె ఈ…
డైరెక్టర్ కమ్ హీరోగా సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తూ యూత్ ఫుల్ హీరోగా సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు ప్రదీప్ రంగనాథ్.…
తనపై ఓ మహిళ చేసిన లైంగిక ఆరోపణలపై జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తొలిసారి మీడియా ముందు స్పందించారు. అది…
కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన సినిమాగా ఆరెంజ్ మీద ఓ…