సీఎం చంద్రబాబు మార్కు పాలన ఇక నుంచి ప్రారంభం అవుతుందా? ఇప్పటి వరకు ఎలా ఉన్నా.. ఇక నుంచి ఆయనలో 1995ల నాటి ముఖ్యమంత్రి చూడడం ఖాయమా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది ప్రభుత్వ వర్గాల నుంచి!. సీఎం చంద్రబాబు స్వయంగా చెప్పినట్టు.. ఆయన ఇక నుంచి 1995ల నాటి ముఖ్యమంత్రిగా మారనున్నారు. దీంతో పాలన పరుగులు పెట్టడమే కాకుండా.. అధికారులను.. ఉద్యోగులను కూడా కాలంతో పాటు పరుగులు పెట్టించనున్నారు.
1995లలో సీఎంగా చంద్రబాబు.. పరుగులు పెట్టారు. “నేను నిద్ర పోను-మిమ్మల్ని నిద్ర పోనివ్వను” అంటూ.. ఆయన ఉద్యోగులను, ప్రభుత్వ శాఖలను కూడా అనుక్షణం అప్రమత్తంగా ఉంచారు. హైదరాబాద్ను రీబిల్డ్ చేశారు. డ్రాక్వా సంఘాల వ్యవస్థను ఏర్పాటు చేశారు. బీసీలకు అవకాశం కల్పించారు. రాష్ట్రానికి ఆదాయం పెంచేలా వ్యవహరించారు. అంతర్జాతీయ స్థాయి నాయకులను కూడా హైదరాబాద్ కు తీసుకువచ్చారు. రికార్డులు సాధించారు. ఇలా.. ఆయన పాలన అప్పట్లో పరుగులు పెట్టింది.
ఇప్పుడు కూడా గత ఏడాది కాలంలో దాదాపు ఇదే తరహా పాలన సాగింది. అయితే.. ఎక్కడో ఒకింత అసంతృప్తి అయితే కనిపిస్తోంది. అధికారులు మాట వినడం లేదని.. పనులు చేయడం లేదని.. ఏకంగా మంత్రుల నుంచే ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకున్న చంద్రబాబు మరోసారి 1995ల నాటి సీఎంగా మారేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిని ఈ ఏడాది ముహూర్తం పెట్టుకున్నారు. దీనికి కూడా కారణం ఉంది. ఇప్పట్లో ఎన్నికలు లేవు. సో.. ఎవరికి కోపం వచ్చినా.. చేయగలిగింది లేదు.
దీంతో ఒకరి కోపతాపాలతో పనిలేకుండా.. పనిచేసుకుంటూ పోతే.. ఎన్నికలకు ముందు ఏడాది కొంత మార్పు చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి.. ఈ ఏడాది మాత్రం స్పీడ్ పెంచి.. పనులు ముందుకు తీసు కువెళ్లేందుకు ప్రయత్నించనున్నారు. ఆకస్మిక తనిఖీలు.. అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తి, బనక చర్లను పట్టాలెక్కించడం..యువతకు ఉపాధికల్పించడం.. సమాజంలోని అట్టడుగు వర్గాలను పీ-4 ద్వారా పైకి తీసుకురావడం.. అవినీతికి తావులేకుండా పారదర్శక పాలన అందించేందుకు ఈ ఏడాది చంద్రబాబు స్వీయ లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. సో.. ఈ పరిణామాలను గమనిస్తే.. చంద్రబాబు లో 1995సీఎంను ఖచ్చితంగా చూడొచ్చు.
ఒకప్పుడు బంగారం నిల్వల విషయంలో కేజీఎఫ్ గురించి చర్చ జరిగేదని.. కానీ, ఇప్పుడు కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గురించి దేశవ్యాప్తంగా…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు తప్పదా? ఆమెపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన నివేదిక రెడీ అయిందా?…
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ఎట్లకేలకు ఖరారైంది. తన మిత్రుడే అయిన లెెజెండరీ నటుడు కమల్ హాసన్ నిర్మాణంలో…
విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర…
ప్రస్తుతం తెలుగులో ఉన్న ఉత్తమ గేయ రచయితల్లో అనంత శ్రీరామ్ ఒకరు. టీనేజీలో ఇంజినీరింగ్ చదువుతూ లిరిసిస్టుగా మారిన అనంత..…
పెద్ది విజయోత్సవ వేడుకలో చిరంజీవి నేషనల్ అవార్డు గురించి ప్రస్తావిస్తూ రామ్ చరణ్ కది రావడం రాకపోవడం అసలు సమస్యే…