Political News

టీడీపీలో ముగ్గురు మ‌హిళ‌ల పంతం.. హామీ ఇస్తేనే.. అడుగు బ‌య‌ట‌కు‌!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో అసంతృప్తులు, అస‌మ్మ‌తులు, నిర‌స‌న గ‌ళాలు ఎక్క‌డా స‌ర్దుమ‌ణ‌గ‌డం లేదు. ప‌దువుల పందేరాలు జ‌రిగినా.. జంబో క‌మిటీల‌ను ఏర్పాటు చేసి.. నాయ‌కుల‌కు, నాయ‌కురాళ్ల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించినా.. ఇంకా ఏదో కావాల‌నే ఆరాటం మాత్రం వారిలో ఎక్క‌డా త‌గ్గ‌క పోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ జాబితాలో ముగ్గురు కీల‌క మ‌హిళా నాయ‌కురాళ్లు తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్న‌ట్టు పార్టీలో చ‌ర్చ‌కు వ‌చ్చింది. వీరిలో గుమ్మ‌డి సంధ్యారాణి, తోట సీతారామ ల‌క్ష్మి, ప్ర‌తిభా భార‌తి ఉన్నార‌ని సీనియ‌ర్లు చెబుతున్నారు. ఇప్ప‌టికే ప్ర‌తిభా భార‌తి.. త‌న అసంతృప్తిని చంద్ర‌బాబుకు లేఖ రూపంలో వెల్ల‌డించారు.

మిగిలిన ఇద్ద‌రు మ‌హిళా నాయ‌కులు మౌనంగా ఉన్నారు. త‌మ‌కు అప్ప‌గించిన బాధ్య‌త‌ల‌ను కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు. దీంతో పార్టీలో ఈ ముగ్గురు నాయ‌కురాళ్ల విష‌యంపై చంద్ర‌బాబు ఏం చేస్తార‌నేది ఆస‌క్తిగా ఉంది. గుమ్మ‌డి సంధ్యారాణి… టీడీపీలో సీనియ‌ర్ నాయ‌కురాలు. అర‌కు ఎంపీ స్థానం నుంచి 2014లో పోటీ చేసి.. ఓడిపోయారు. అప్ప‌టి నుంచి ఆమె మ‌ళ్లీ పోటీకి సిద్ధంగానే ఉన్న‌ప్ప‌టికీ.. ఆశించిన విధంగా చంద్ర‌బాబు ఆమెకు అవ‌కాశం ఇవ్వ‌డం లేద‌నేది తీవ్ర అసంతృప్తి. పైగా ఆమెర‌కు సాలూరు ఎమ్మెల్యే స్థానంపై మ‌క్కువ ఎక్కువ‌గా ఉంది. ఈ నేప‌థ్యంలో ఆ టికెట్‌పై ఆశ‌లు పెట్టుకున్నారు.

గ‌త ఎన్నిక‌ల్లోనే ఆమె సాలూరు నుంచి టికెట్ ఆశించారు. కానీ, టీడీపీ అధినేత చంద్ర‌బాబు దీనిని భంజ్‌దేవ్‌కు ఇచ్చారు. ఇక‌, ఇప్పుడైనా.. త‌న‌కు సాలూరు టికెట్‌పై గ్యారెంటీ ఇవ్వాల‌నేది సంధ్యారాణి డిమాండ్‌. దీంతో తాజాగా త‌న‌కు అప్ప‌గించిన‌.. అర‌కు పార్ల‌మెంట‌రీ జిల్లా టీడీపీ బాధ్య‌త‌లు తీసుకునేందుకు కూడా ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని స‌మాచారం. ఇక‌, తోట సీతారామ‌ల‌క్ష్మి. మాజీ రాజ్య‌స‌భ స‌భ్యురాలు.. టీడీపీ సీనియ‌ర్ మోస్ట్ నాయ‌కురాలు. ఈమె కూడా కాకినాడ పార్లమెంటు స్థానంపై ఆశ‌లు పెట్టుకున్నారు. కానీ, చంద్ర‌బాబు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురం పార్ల‌మెంట‌రీ జిల్లా బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

ఈ నేప‌థ్యంలో ఆమె కూడా న‌ర‌సాపురం పార్ల‌మెంట‌రీ టీడీపీ బాధ్య‌త‌లు తీసుకునేందుకు ముందుకు రావ‌డం లేదు. త‌న‌కు కాకినాడ టికెట్‌పై హామీ ఇస్తేనే అడుగు ముందుకు వేస్తాన‌ని ఆమె స్ప‌ష్టం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. మాజీ స్పీక‌ర్ ప్ర‌తిభా భార‌తి విష‌యానికి వ‌స్తే.. త‌న కుమార్తె గ్రీష్మ విష‌యాన్ని తేల్చాల‌ని, త‌న‌కు ఆరోగ్యం స‌హ‌క‌రించ‌డం లేదని ఆమె ఇటీవ‌ల చంద్ర‌బాబుకు లేఖ‌రాశారు. అయితే, దీనిపై బాబు ఇప్ప‌టికీ స్పందించ‌లేదు. మ‌హిళ‌ల విష‌యంలో ప్ర‌స్తుతం ఈ ముగ్గురూ పార్టీలో నిర‌స‌న గ‌ళం వినిపిస్తున్నార‌ని, బాబు త్వ‌ర‌లోనే నిర్ణ‌యం ప్ర‌క‌టించాల‌ని సీనియ‌ర్లు కోరుతున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on November 14, 2020 12:55 pm

Share

Recent Posts

దేవర కలెక్షన్లపై డిస్ట్రిబ్యూటర్ క్లారిటీ

ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…

4 hours ago

ఏజెంట్‌లో నన్ను చూసి అసహ్యమేసింది – అఖిల్

అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…

6 hours ago

కొత్త విద్యా మంత్రిగా జోషి… ఎవరీయన?

కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…

7 hours ago

విజయ్ బలహీనతే కిరణ్ బలం

బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…

7 hours ago

‘స్పైడర్ మ్యాన్’ రచ్చ చేసేలా ఉన్నాడు

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…

8 hours ago

జగన్ లాజిక్… ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ కి లోకేష్ కు ముడి!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ…

8 hours ago