Political News

కేంద్రాన్ని క‌డిగేసిన కేటీఆర్

తెలంగాణ‌లో టీఆర్ఎస్ వెర్స‌స్ కాంగ్రెస్ పాత క‌థ‌. ఇప్పుడంతా టీఆర్ఎస్ వెర్స‌స్ బీజేపీనే. కాంగ్రెస్‌ను ప‌క్క‌కు నెట్టేసి బీజేపీనే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షస్థానంలోకి వ‌చ్చేసింది. టీఆర్ఎస్‌ను గ‌ట్టిగా ఢీకొడుతోంది. దుబ్బాక ఉప ఎన్నిక సంద‌ర్భంగా రెండు పార్టీ మ‌ధ్య వైరం ఏ స్థాయిలో సాగిందో తెలిసిందే.

అక్క‌డ టీఆర్ఎస్ అభ్య‌ర్థికి బీజేపీ క్యాండిడేట్ గ‌ట్టి పోటీనే ఇచ్చాడ‌ని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఐతే త‌మ పార్టీని బీజేపీ ఎంత‌గా టార్గెట్ చేస్తుంటే.. అంత‌గా రివ‌ర్స్‌లో ఆ పార్టీని ఢీకొడుతున్నారు టీఆర్ఎస్ నేత‌లు. ఈ క్ర‌మంలో కేంద్ర ప్ర‌భుత్వం మీదా తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. తాజాగా ఐటీ మంత్రి కేటీఆర్.. కేంద్రాన్ని ల‌క్ష్యంగా చేసుకున్నారు. గ‌ణాంకాల‌తో మోడీ స‌ర్కారును క‌డిగి పారేశారు.

గ‌త నెల‌లో తెలంగాణ వ‌ర‌ద‌ల‌తో అల్లాడిపోయిన సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్ స‌హా తెలంగాణ‌లో ప‌లు ప్రాంతాల్లో వేల కోట్ల న‌ష్టం వాటిల్లింది. ఈ నేప‌థ్యంలో కేంద్రాన్ని 1350 కోట్ల త‌క్ష‌ణ సాయం అడిగింది తెలంగాణ స‌ర్కారు. కానీ కేంద్రం నుంచి స్పంద‌న లేదు. కానీ బీజేపీ పాలిత గుజ‌రాత్‌కు మాత్రం వ‌ర‌ద సాయం కింద ప్ర‌ధాని మోడీ రూ.500 కోట్లు విడుద‌ల చేశారు. అలాగే ఆ పార్టీనే అధికారంలో ఉన్న క‌ర్ణాట‌క‌కు అద‌న‌పు సాయం రూ.670 కోట్లు రిలీజ్ చేశారు.

తెలంగాణ‌కు మాత్రం పైసా ఇవ్వ‌లేదు. దీనికి సంబంధించిన వార్త‌ల తాలూకు క్లిప్పింగ్స్ పెట్టి మ‌రీ కేటీఆర్.. కేంద్రాన్ని నిల‌దీశారు. హైద‌రాబాద్ చేసిన త‌ప్పేంటి? అక్క‌డ వ‌ర‌ద‌లొస్తే త‌క్ష‌ణ సాయం, ఇక్క‌డ మాత్రం బుర‌ద రాజ‌కీయం అని ఆయ‌న వ్యాఖ్యానించారు. మ‌రోవైపు 2014 నుంచి తెలంగాణ ప్ర‌జ‌లు ప‌న్నుల రూపంలో కేంద్రానికి రూ.2,72,926 కోట్లు చెల్లిస్తే.. రాష్ట్రానికి కేంద్రం రూ.1,40,329 కోట్లు మాత్ర‌మే ఇచ్చింద‌ని కేటీఆర్ గుర్తు చేస్తూ కేంద్రంపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

This post was last modified on November 9, 2020 7:59 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మెగా ఛాన్స్ వదిలేసిన విశ్వంభర

మన శంకరవరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ ఫలితాన్ని విశ్వంభర క్యాష్ చేసుకునే దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరగకపోవడం అభిమానులను బాధ…

35 minutes ago

హార్దిక్ పాండ్య ఏం సాధించాడు?

గత కొన్నేళ్లలో మోస్ట్ అన్ పాపులర్ ఇండియన్ క్రికెటర్ ఎవరు అంటే మరో మాట లేకుండా హార్దిక్ పాండ్య పేరు…

59 minutes ago

క‌విత న‌న్ను ప‌దికోట్లు అడిగారు: పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప్ర‌జాశాంతి పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, ప్ర‌ముఖ సువార్తీకుడు కేఏ పాల్‌.. తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ…

2 hours ago

మ‌మ‌త ప‌రిస్థితి.. ఏపీకి పాఠం అవుతుందా?!

త‌మ్ముడు త‌మ్ముడే.. రాజ‌కీయం రాజ‌కీయ‌మే.. బీజేపీ విష‌యంలో ఇది అక్ష‌రాలా నిజం. త‌న‌కు అవ‌కాశం లేనంత సేపూ.. ఆ పార్టీ…

4 hours ago

‘అడ్డంకులెన్నైనా.. ఆకివీడు రామాలయ నిర్మాణం ఆగదు’

ఏపీలో మతపరమైన వివాదాలకు కేంద్రంగా మారిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఆదివారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది.…

5 hours ago

కెపాసిటీ లేకే ర‌జినీ సినిమా వ‌దిలేశా

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ హీరోగా లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ నిర్మించే సినిమా ద‌ర్శ‌కుడి ఎంపిక విష‌యంలో ఎంత త‌ల‌నొప్పి ఎదురైందో…

6 hours ago