తెలంగాణలో టీఆర్ఎస్ వెర్సస్ కాంగ్రెస్ పాత కథ. ఇప్పుడంతా టీఆర్ఎస్ వెర్సస్ బీజేపీనే. కాంగ్రెస్ను పక్కకు నెట్టేసి బీజేపీనే ప్రధాన ప్రతిపక్షస్థానంలోకి వచ్చేసింది. టీఆర్ఎస్ను గట్టిగా ఢీకొడుతోంది. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా రెండు పార్టీ మధ్య వైరం ఏ స్థాయిలో సాగిందో తెలిసిందే.
అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థికి బీజేపీ క్యాండిడేట్ గట్టి పోటీనే ఇచ్చాడని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఐతే తమ పార్టీని బీజేపీ ఎంతగా టార్గెట్ చేస్తుంటే.. అంతగా రివర్స్లో ఆ పార్టీని ఢీకొడుతున్నారు టీఆర్ఎస్ నేతలు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం మీదా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఐటీ మంత్రి కేటీఆర్.. కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. గణాంకాలతో మోడీ సర్కారును కడిగి పారేశారు.
గత నెలలో తెలంగాణ వరదలతో అల్లాడిపోయిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ సహా తెలంగాణలో పలు ప్రాంతాల్లో వేల కోట్ల నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో కేంద్రాన్ని 1350 కోట్ల తక్షణ సాయం అడిగింది తెలంగాణ సర్కారు. కానీ కేంద్రం నుంచి స్పందన లేదు. కానీ బీజేపీ పాలిత గుజరాత్కు మాత్రం వరద సాయం కింద ప్రధాని మోడీ రూ.500 కోట్లు విడుదల చేశారు. అలాగే ఆ పార్టీనే అధికారంలో ఉన్న కర్ణాటకకు అదనపు సాయం రూ.670 కోట్లు రిలీజ్ చేశారు.
తెలంగాణకు మాత్రం పైసా ఇవ్వలేదు. దీనికి సంబంధించిన వార్తల తాలూకు క్లిప్పింగ్స్ పెట్టి మరీ కేటీఆర్.. కేంద్రాన్ని నిలదీశారు. హైదరాబాద్ చేసిన తప్పేంటి? అక్కడ వరదలొస్తే తక్షణ సాయం, ఇక్కడ మాత్రం బురద రాజకీయం అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు 2014 నుంచి తెలంగాణ ప్రజలు పన్నుల రూపంలో కేంద్రానికి రూ.2,72,926 కోట్లు చెల్లిస్తే.. రాష్ట్రానికి కేంద్రం రూ.1,40,329 కోట్లు మాత్రమే ఇచ్చిందని కేటీఆర్ గుర్తు చేస్తూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు.
This post was last modified on November 9, 2020 7:59 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…