Political News

పొగరుతో వెళ్లి కరువులో ఇరుక్కున్న పాక్!

జలవనరుల విషయంలో చాలా కాలంగా గా ఓ లబ్ధిదారుగా ఉన్న పాకిస్థాన్ ఇప్పుడు నీటి కొరతతో అల్లాడుతోంది. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం ఇప్పుడు ప్రభావాన్ని చూపిస్తోంది. పొగరుతో నదిలో పారేది రక్తం అంటూ చేసిన కామెంట్స్ కు ప్రతిఫలంగా కరువుతో అల్లాడే పరిస్థితి ఎదురైంది. సింధు జలాల ఒప్పందాన్ని పూర్తిగా తిరస్కరించి, తన హక్కైన నీటిని నిలిపివేసిన భారత్ చర్యలతో పాకిస్థాన్ వ్యవసాయ రంగం ఘోరంగా దెబ్బతింటోంది. ముఖ్యంగా మంగ్లా, తర్బేలా డ్యామ్‌లలో నీటి నిల్వలు ప్రమాదకరంగా తగ్గిపోయాయి.

ఇప్పటికే పంజాబ్, సింధ్ రాష్ట్రాల్లో ఖరీఫ్ సాగు ప్రారంభానికి ముందు నుంచే రైతులు నీటి కోసం ఎదురుచూస్తున్నారు. పాకిస్థాన్ ఐఆర్‌ఎస్‌ఏ తాజా నివేదిక ప్రకారం, మొత్తం ప్రవాహంలో 21 శాతం నీటి కొరత తలెత్తగా, రెండు ప్రధాన డ్యామ్‌లలో అది 50 శాతం వరకూ పడిపోయింది. ఈ పరిస్థితుల్లో వేసవి పంటల సాగు తీవ్రంగా ప్రభావితమవుతుందని అంచనా వేస్తున్నారు. చీనాబ్ నది ప్రవాహం అకస్మాత్తుగా తగ్గడాన్ని కూడా ప్రత్యేకంగా గమనించారు.

ఈ పరిణామాలపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ న్యూయార్క్ వేదికగా జరిగిన హిమానీనదాల సదస్సులో స్పందించారు. భారత్ సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించారు. కానీ భారత్ మాత్రం ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ తజికిస్థాన్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, “ఒప్పందాన్ని వాస్తవంగా ఉల్లంఘించినది పాకిస్థానే. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, ఆ ఒప్పందానికి నైతికత లేకుండా చేసింది,” అని ఘాటుగా స్పందించారు.

వాస్తవానికి 1960లో జరిగిన సింధు జలాల ఒప్పందం ప్రకారం భారత్ తన వాటాలోని నదులన్నీ పాకిస్థాన్‌కు వదిలేసింది. కానీ ఇటీవల ఉగ్రదాడులు, పాక్ వ్యవహార శైలిని పరిగణనలోకి తీసుకొని, భారత ప్రభుత్వం పునఃసమీక్ష ప్రక్రియ ప్రారంభించింది. ఇది చారిత్రక దృష్టిలో ఒక పెద్ద మలుపు. ఇక ఈ పరిణామాలతో పాకిస్థాన్ లోపలే రాజకీయ ఒత్తిడులు పెరిగే అవకాశం ఉంది. ఉగ్రవాదానికి తగిన మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని భారత్ జలరహితంగా రూపొందించడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.

This post was last modified on June 2, 2025 2:36 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

1 hour ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

4 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

7 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

10 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

12 hours ago