“నిన్నటితో నేను వాడే మందులు అయిపోయాయి. చేతిలో రూపాయి లేదు. నాకా.. పిల్లల్లేరు. ఒక్కదాన్నే బతుకుతున్నా. ఏం చేయాలో తోచలేదు. పింఛన్పైనే ఆధారపడి బతుకుతున్నా. రేపు ఆదివారం కావడం తో పింఛను ఆలస్యం అవుతుందన్నారు. కానీ.. ఇంతలోనే చంద్రబాబు నాకు పింఛను పంపించాడు. నా ప్రాణాలు కాపాడాడు. ఈ డబ్బులతో మందులు కొనుక్కుంటా.” అని విశాఖపట్నం జిల్లా పాయకరావు పేట నియోజకవర్గానికి చెందిన 72 ఏళ్ల వృద్ధురాలు ఆనందం వ్యక్తం చేశారు.
ప్రతినెలా 1వ తేదీనే ఇచ్చే సామాజిక భద్రతా పింఛన్ను.. జూన్ 1వ తేదీ ఆదివారం కావడంతో మే 31న శనివారమే రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేశారు. అయితే.. మహానాడు హడావుడిలో ఉన్న ప్రభుత్వం దీనిపై పెద్దగా ప్రచారం చేయలేదు. పట్టించుకోలేదు. కానీ, జరగాల్సి కార్యక్రమం మాత్రం జరిగిపోయింది. దీంతో పింఛను పై ఆధారపడిన పేద జీవులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క అవ్వమాత్రమే కాదు.. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పేదలు కూడా హ్యాపీ ఫీలవుతున్నారు.
ఎందుకంటే.. మేలో చాలా చోట్ల వర్షాలు కురిసాయి. దీంతో చిన్న చిన్న పనులు చేసుకుని ఫించనుతో పాటు మరో పదిరూపాయలు సంపాయించుకునే కుటుంబాలకు పనులు లేకుండా పోయాయి. ఈ నేప థ్యంలో వారు ఈ పింఛను సొమ్ముల కోసం ఎదురు చూశారు. ఈ క్రమంలో ప్రభుత్వంఒక్క రోజు ముందుగానే పింఛన్లను పంపిణీ చేయడం పట్ల సర్కారుకు కృత జ్ఞతలు చెబుతున్నారు. మరోవైపు.. రైతు కుటుంబాల్లోని లబ్ధి దారులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సారి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా.. ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయా నియోజకవర్గాల్లో పర్యటించి.. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి.. వారికి స్వయంగా పింఛన్లు అందించారు. మంత్రులు అనిత, సవిత, రామానాయుడు.. ఇలా.. అందరూ ఉదయం 7 గంటలకే రంగంలోకి దిగి.. సాధ్యమైనంత వేగంగా కార్యక్రమాన్ని పూర్తి చేసి.. లబ్ధిదారులకు మేలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు
This post was last modified on May 31, 2025 3:20 pm
దేవర బ్లాక్ బస్టర్ తర్వాత వార్ 2 విపరీతంగా నిరాశ పరచడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆశలన్నీ ప్యాన్ ఇండియా…
తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధిపతి విజయ్ రాజకీయ విమర్శలకు కేంద్రంగా మారారు. ఆయనను కార్నర్ చేస్తూ.. బీజేపీసహా ఇతర పార్టీలు…
ఇంకో రెండు రోజుల్లో దృశ్యం 3 విడుదల కానుంది. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు డబ్బింగ్ రిలీజ్ కానుండటంతో…
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జోగి రమేష్ తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. వాస్తవానికి ఆయన అగ్రిగోల్డ్ కేసులోను…
ఏపీ సీఎం చంద్రబాబు మత్స్యకారుల మనసు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన మత్సకార సేవలో కార్యక్రమంలో…
దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…