Political News

1న రావల్సిన పింఛ‌ను 31నే వచ్చేస్తే

“నిన్న‌టితో నేను వాడే మందులు అయిపోయాయి. చేతిలో రూపాయి లేదు. నాకా.. పిల్ల‌ల్లేరు. ఒక్క‌దాన్నే బతుకుతున్నా. ఏం చేయాలో తోచ‌లేదు. పింఛ‌న్‌పైనే ఆధార‌ప‌డి బతుకుతున్నా. రేపు ఆదివారం కావ‌డం తో పింఛ‌ను ఆల‌స్యం అవుతుంద‌న్నారు. కానీ.. ఇంత‌లోనే చంద్ర‌బాబు నాకు పింఛ‌ను పంపించాడు. నా ప్రాణాలు కాపాడాడు. ఈ డ‌బ్బుల‌తో మందులు కొనుక్కుంటా.” అని విశాఖప‌ట్నం జిల్లా పాయ‌క‌రావు పేట నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన 72 ఏళ్ల వృద్ధురాలు ఆనందం వ్య‌క్తం చేశారు.

ప్ర‌తినెలా 1వ తేదీనే ఇచ్చే సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్‌ను.. జూన్ 1వ తేదీ ఆదివారం కావ‌డంతో మే 31న శ‌నివార‌మే రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేశారు. అయితే.. మ‌హానాడు హ‌డావుడిలో ఉన్న ప్ర‌భుత్వం దీనిపై పెద్దగా ప్ర‌చారం చేయ‌లేదు. ప‌ట్టించుకోలేదు. కానీ, జ‌ర‌గాల్సి కార్య‌క్ర‌మం మాత్రం జ‌రిగిపోయింది. దీంతో పింఛ‌ను పై ఆధార‌ప‌డిన పేద జీవులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఒక్క అవ్వ‌మాత్ర‌మే కాదు.. తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన పేద‌లు కూడా హ్యాపీ ఫీల‌వుతున్నారు.

ఎందుకంటే.. మేలో చాలా చోట్ల వ‌ర్షాలు కురిసాయి. దీంతో చిన్న చిన్న ప‌నులు చేసుకుని ఫించ‌నుతో పాటు మ‌రో ప‌దిరూపాయ‌లు సంపాయించుకునే కుటుంబాల‌కు ప‌నులు లేకుండా పోయాయి. ఈ నేప థ్యంలో వారు ఈ పింఛ‌ను సొమ్ముల కోసం ఎదురు చూశారు. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వంఒక్క రోజు ముందుగానే పింఛ‌న్ల‌ను పంపిణీ చేయ‌డం ప‌ట్ల స‌ర్కారుకు కృత జ్ఞ‌త‌లు చెబుతున్నారు. మ‌రోవైపు.. రైతు కుటుంబాల్లోని ల‌బ్ధి దారులు కూడా ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ సారి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా.. ఈ పింఛ‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టించి.. ల‌బ్ధిదారుల ఇళ్ల‌కు వెళ్లి.. వారికి స్వ‌యంగా పింఛ‌న్లు అందించారు. మంత్రులు అనిత‌, స‌విత‌, రామానాయుడు.. ఇలా.. అంద‌రూ ఉద‌యం 7 గంట‌ల‌కే రంగంలోకి దిగి.. సాధ్య‌మైనంత వేగంగా కార్య‌క్ర‌మాన్ని పూర్తి చేసి.. ల‌బ్ధిదారులకు మేలు చేశారు. ఈ సంద‌ర్భంగా వైసీపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు

This post was last modified on May 31, 2025 3:20 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

58 minutes ago

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

3 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

3 hours ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

3 hours ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

12 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

12 hours ago