Political News

1న రావల్సిన పింఛ‌ను 31నే వచ్చేస్తే

“నిన్న‌టితో నేను వాడే మందులు అయిపోయాయి. చేతిలో రూపాయి లేదు. నాకా.. పిల్ల‌ల్లేరు. ఒక్క‌దాన్నే బతుకుతున్నా. ఏం చేయాలో తోచ‌లేదు. పింఛ‌న్‌పైనే ఆధార‌ప‌డి బతుకుతున్నా. రేపు ఆదివారం కావ‌డం తో పింఛ‌ను ఆల‌స్యం అవుతుంద‌న్నారు. కానీ.. ఇంత‌లోనే చంద్ర‌బాబు నాకు పింఛ‌ను పంపించాడు. నా ప్రాణాలు కాపాడాడు. ఈ డ‌బ్బుల‌తో మందులు కొనుక్కుంటా.” అని విశాఖప‌ట్నం జిల్లా పాయ‌క‌రావు పేట నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన 72 ఏళ్ల వృద్ధురాలు ఆనందం వ్య‌క్తం చేశారు.

ప్ర‌తినెలా 1వ తేదీనే ఇచ్చే సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్‌ను.. జూన్ 1వ తేదీ ఆదివారం కావ‌డంతో మే 31న శ‌నివార‌మే రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేశారు. అయితే.. మ‌హానాడు హ‌డావుడిలో ఉన్న ప్ర‌భుత్వం దీనిపై పెద్దగా ప్ర‌చారం చేయ‌లేదు. ప‌ట్టించుకోలేదు. కానీ, జ‌ర‌గాల్సి కార్య‌క్ర‌మం మాత్రం జ‌రిగిపోయింది. దీంతో పింఛ‌ను పై ఆధార‌ప‌డిన పేద జీవులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఒక్క అవ్వ‌మాత్ర‌మే కాదు.. తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన పేద‌లు కూడా హ్యాపీ ఫీల‌వుతున్నారు.

ఎందుకంటే.. మేలో చాలా చోట్ల వ‌ర్షాలు కురిసాయి. దీంతో చిన్న చిన్న ప‌నులు చేసుకుని ఫించ‌నుతో పాటు మ‌రో ప‌దిరూపాయ‌లు సంపాయించుకునే కుటుంబాల‌కు ప‌నులు లేకుండా పోయాయి. ఈ నేప థ్యంలో వారు ఈ పింఛ‌ను సొమ్ముల కోసం ఎదురు చూశారు. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వంఒక్క రోజు ముందుగానే పింఛ‌న్ల‌ను పంపిణీ చేయ‌డం ప‌ట్ల స‌ర్కారుకు కృత జ్ఞ‌త‌లు చెబుతున్నారు. మ‌రోవైపు.. రైతు కుటుంబాల్లోని ల‌బ్ధి దారులు కూడా ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ సారి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా.. ఈ పింఛ‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టించి.. ల‌బ్ధిదారుల ఇళ్ల‌కు వెళ్లి.. వారికి స్వ‌యంగా పింఛ‌న్లు అందించారు. మంత్రులు అనిత‌, స‌విత‌, రామానాయుడు.. ఇలా.. అంద‌రూ ఉద‌యం 7 గంట‌ల‌కే రంగంలోకి దిగి.. సాధ్య‌మైనంత వేగంగా కార్య‌క్ర‌మాన్ని పూర్తి చేసి.. ల‌బ్ధిదారులకు మేలు చేశారు. ఈ సంద‌ర్భంగా వైసీపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు

This post was last modified on May 31, 2025 3:20 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

1 minute ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

4 minutes ago

9 మందికి పోలీసులకు ఉరిశిక్ష… సంచలన తీర్పు

తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…

53 minutes ago

బూతులు తిట్టటం ట్రంప్ తోనే ఆరంభం కాలేదు

నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…

2 hours ago

పవన్ ను తిట్టిన ద్వారంపూడి ఇప్పుడు టార్గెట్ అయ్యారా?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డికి ఎర్త్ పెడుతున్నారా?... ఆయ‌న ప్రాభ‌వాన్ని.. వైభ‌వాన్ని…

2 hours ago

రైటర్ గారు… చేదుగా ఉన్నా నిజమే చెప్పారు

రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…

4 hours ago