Political News

పోలవరం..ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నారా ?

పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసేందుకు తాజాగా మొదలైన నిధుల వివాదం కారణంగా జగన్మోహన్ రెడ్డి ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నారా ? పార్టీ నేతల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. జగన్ అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్టు విషయంలో రూ. 47615 కోట్లతో సవరించిన అంచనాలకు ప్రతిపాదనలు పంపారు. ఇందుకు కేంద్ర జలశక్తి శాఖ కూడా ఆమోదం తెలిపింది. అయితే తాజాగా ఆర్ధికశాఖ మొకాలడ్డింది. 2014లో ఆమోదించిన అంచనాల ప్రకారం రూ. 20 వేల కోట్లే ఇస్తామని చెప్పేసింది. ఈ అంశమే ఇపుడు ఏపిలో హాట్ టాపిక్ అయిపోయింది.

పోలవరంకు నిధులిచ్చే విషయంలో కేంద్రం తాజా వైఖరికి చంద్రబాబునాయుడు ప్రభుత్వమే కారణమని వైసీపీ సర్కార్ మండిపోతోంది. ఇదే సమయంలో తమ హయాంలో రూ. 55 వేల కోట్లకు ఆమోదం తెలిపిన కేంద్రప్రభుత్వం ఇపుడు మాటమార్చటం వెనుక జగన్ చేతకాని తనమే ఉందంటూ టీడీపీ నేతలు ఎదురుదాడులు మొదలుపెట్టారు. ఇందులో ఏది నిజం ? ఏది అబద్ధం ? అనేది ఇప్పుడిప్పుడే తేలేది కాదు. చంద్రబాబు, జగన్ ప్రభుత్వాల్లో ఎవరిది తప్పన్న విషయాన్ని పక్కనపెట్టేస్తే ఇద్దరి నిస్సహాయతను కేంద్రప్రభుత్వం అడ్వాంటేజ్ తీసుకుంటోందన్నది మాత్రం వాస్తవం.

సరే దీనిపై ఎంత చర్చలు జరిపినా ఉపయోగం లేదన్నది కూడా తేలిపోయింది. ఈ విషయాన్ని జగన్ గ్రహించారట. కాకపోతే కేంద్రం నుండి నిధులు రాబట్టాలనే ఉద్దేశ్యంతోనే ప్రధానమంత్రి నరేంద్రమోడికి లేఖ రాశారు. అపాయిట్మెంట్ ఇస్తే వెంటనే నిధుల విషయం కోసమే ఢిల్లీ వెళ్ళి మోడి కలవటానికి జగన్ రెడీగా ఉన్నారు. సరే ఒకవేళ కేంద్రం అంగీకరించకోతే పరిస్దితి ఏమిటి ? ఇక్కడే జగన్ ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నారట. ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఫండింగ్ చేసే ప్రపంచబ్యాంకు, ఏషియా డెవలప్మెంట్ బ్యాంకుతో పాటు మరికొన్ని ఆర్ధిక సంస్దల విషయాన్ని కూడా జగన్ ఆర్ధిక సలహాదారులతో చర్చిస్తున్నట్లు సమాచారం.

ఎంతలేదన్నా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలంటే తక్కువలో తక్కువ రూ. 30 వేల కోట్లు అవసరం. ఇంత పెద్ద మొత్తాన్ని రాష్ట్రప్రభుత్వమే పెట్టుకునేంత సీన్ లేదు. అందుకనే ఇతర మార్గాలపై ఆధారపడక తప్పటం లేదు. ఇందులో భాగంగానే ప్రపంచబ్యాంకు, ఏషియా బ్యంకుతో పాటు చైనాలోని ఆర్ధిక సంస్ధలు, జపాన్ కోఆపరేటివ్ బ్యాంక్ లాంటి వాటితో చర్చలు జరపటానికి ప్రభుత్వం రెడీ అవుతోంది. అయితే విదేశాల నుండి ఫండింగ్ తెచ్చుకుంటే కేంద్రం అనుమతి అవసరం.

రాష్ట్రప్రభుత్వం తీసుకునే అప్పులను తీర్చే విషయంలో కేంద్రం కౌంటర్ గ్యారెంటీ ఇవ్వాల్సుంటుంది. నేరుగా కేంద్రమే నిధులివ్వలేనపుడు అప్పులు తెచ్చుకునేందుకు కౌంటర్ గ్యారెంటీ అన్నా ఇవ్వమని కేంద్రాన్ని అడగాలని రాష్ట్రం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. అయితే రాష్ట్రప్రభుత్వం అడిగినట్లు కౌంటర్ గ్యారెంటీకి రెడి అయితే ఇక పోలవరం నిధుల సమస్య కేంద్రానికి వదిలిపోతుంది. కాబట్టి కౌంటర్ గ్యారెంటీ ఇచ్చే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. మరి కేంద్రం ఏమంటుందో చూడాల్సిందే.

This post was last modified on November 8, 2020 3:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘కింగ్‌డమ్’ సౌండ్ తగ్గిందేంటి?

విజయ్ దేవరకొండ కెరీర్లో అత్యంత కీలకమైన సినిమా.. కింగ్‌డమ్. విజయ్ గత చిత్రాలు లైగర్, ఫ్యామిలీ స్టార్ ఎంత పెద్ద…

42 minutes ago

బాబుకు చిర్రెత్తితే ఇంతే.. ఫైబ‌ర్ నెట్ ప్ర‌క్షాళ‌న‌!

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు చిర్రెత్తుకొస్తే.. ఏం జ‌రుగుతుందో తాజాగా అదే జ‌రిగింది. ఒక్క దెబ్బ‌కు 284 మంది ఔట్ సోర్సింగ్…

3 hours ago

ఇది క‌దా.. నాయ‌కుడి ల‌క్ష‌ణం.. చంద్ర‌బాబు ఔదార్యం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు తాజాగా చేసిన ఓ ప‌ని.. నెటిజ‌న్ల‌నే కాదు.. చూసిన ప్ర‌జ‌ల‌ను కూడా ఫిదా అయ్యేలా చేసింది.…

5 hours ago

వైసీపీ లిక్క‌ర్ స్కామ్‌.. హైద‌రాబాద్‌లో సోదాలు

వైసీపీ హ‌యాంలో ఏపీలో లిక్క‌ర్ కుంభ‌కోణం జ‌రిగింద‌ని.. దాదాపు 2 వేల కోట్ల రూపాయ‌ల ప్ర‌జాధ‌నాన్ని వైసీపీ కీల‌క నాయ‌కులు…

6 hours ago

కాంగ్రెస్ ప్ర‌భుత్వం బుల్ డోజ‌ర్ల‌తో బిజీగా ఉంది: మోడీ సెటైర్లు

తెలంగాణ‌లోని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ నిశిత విమ‌ర్శ‌లు గుప్పించారు. ``అడ‌వుల్లోకి…

7 hours ago

అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన ఫలితాలపై చంద్రబాబు హర్షం

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సోమవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నేకల్లులో పర్యటించారు.…

7 hours ago