వైసీపీ అధినేత జగన్.. కూటమి సర్కారుపై ఒత్తిడి తెచ్చే క్రమంలో జూన్ 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు రెడీ అయిన విషయం తెలిసిందే. ‘వెన్నుపోటు’ పేరుతో జూన్ 4న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేయడంతోపాటు.. కలెక్టరేట్లలో వినతి పత్రాలు కూడా ఇచ్చేందుకు ఆయన రెడీ అయ్యారు. రాష్ట్రం లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయినా.. ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు అమలు చేయలేదన్నది జగన్ నిరసనల తాలూకు అజెండా.
అయితే.. అదే రోజు.. కూటమి ప్రభుత్వం కూడా.. రెండు కార్యక్రమాలను ప్రకటించేందుకు రెడీ అయింది. దీనిలో ప్రధానంగా కూటమి పార్టీలు విజయం దక్కించుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని.. పార్టీల తరఫున పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు రెడీ అయ్యారు. ఇది పార్టీల తరఫున చేపట్టనున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో అధికారికంగా కూడా అదే రోజు.. “రాష్ట్రానికి విముక్తి” పేరుతో మరో కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కూడా రెడీ అయినట్టు తెలిసింది.
గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీలైన.. టీడీపీ, బీజేపీ, జనసేనలు విజయం దక్కించుకున్నాయి. దీనిలో రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి.. జనసేన 21 స్థానాల్లో పోటీ చేసిన 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ విజయం దక్కించుకుంది. ఇక, రెండు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసి రెండూ గెలుచుకుంది. ఈ సందర్బానికి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో పార్టీ తరఫున గ్రామ గ్రామాన కార్యక్రమాలు, అన్నదానం కూడా నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు.
ఇక, టీడీపీ విషయానికి వస్తే.. తొలిసారి 134 స్థానాల్లో విజయం దక్కించుకుంది. ఇది కూడా టీడీపీ పరంగా చూసుకుంటే రికార్డే. దీనిని పురస్కరించుకుని పార్టీ తరఫున కార్యక్రమాలు చేపడతారు. అదేవిధంగా ప్రభుత్వం మారి.. ఏడాది అవుతుంది కాబట్టి.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా.. కార్యక్రమాలను నిర్వహించను న్నట్టు తెలిసింది. ఇవన్నీ. . కూడా వైసీపీ నిర్వహించే వెన్నుపోటు కార్యక్రమానికి కౌంటర్గానే నిర్వహి స్తున్నామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. దీనిపై ఒకటి రెండు రోజుల్లోనే క్లారిటీ రానుంది. ఈ రెండు పార్టీలు ఇలా వ్యూహాత్మకంగా కార్యక్రమాలు నిర్వహిస్తే.. వైసీపీ నిర్వహించే వెన్నుపోటు ఏమేరకు సక్సెస్ అవుతుందన్నది ప్రశ్నార్థకమే.
This post was last modified on May 26, 2025 3:42 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…