Political News

టీడీపీ ఉత్తరాంధ్ర నేతలపై బీజేపీ కన్నేసిందా ?

అవుననే అంటున్నారు కమలంపార్టీ నేతలు. ఇందుకు ముందుగా ఉత్తరాంధ్రను వేదికగా ఎంచుకున్నట్లు చెబుతున్నారు. టీడీపీలో సంవత్సరాల పాటు కీలకంగా ఉన్న విజయనగరం జిల్లా నేత గద్దె బాబురావును బీజేపీలో చేర్చుకోవటం ఇందులో భాగమనే అంటున్నారు. గద్దె కూడా అనేక కారణాల వల్ల చంద్రబాబునాయుడు నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉంటున్నారు. ఈ విషయాన్ని కమలనాధులు గ్రహించారు. అందుకనే చురుగ్గా పావులు కదిపారు. కొందరు సీనియర్లను గద్దెతో మాట్లాడించారు. దాంతో గద్దె కూడా సానుకూలంగా స్పందించటంతో వెంటనే బీజేపీ కండువ కప్పేసుకున్నారు.

ఇదే పద్దతిలో మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు విషయంలో కూడా చర్చలు జరగుతున్నట్లు సమాచారం. గంటా టీడీపీలో ఇమడలేకపోతున్నారన్నది వాస్తవం. అధికార వైసీపీలో చేరాలని విశ్వప్రయత్నాలు చేసుకుంటున్నాడు. అయితే రాజసభ ఎంపి, జగన్మోహన్ రెడ్డి తర్వాత అంతటి కీలక నేత విజయసాయిరెడ్డితో పాటు మంత్రి అవంతి శ్రీనివాస్ అడ్డుకుంటున్నారు. వీళ్ళద్దరు అడ్డుకోకుంటే వైసీపీలోకి గంటా ఎంట్రీ ఎప్పుడో అయిపోయేదే.

ఇక మరో మాజీ ఎంఎల్ఏ మీసాల గీత కూడా ఇదే దారిలో ఉన్నట్లు సమాచారం. ఈమె కూడా చంద్రబాబు నాయకత్వంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారట. మొన్నటి ఎన్నికల్లో సిట్టింగ్ ఎంఎల్ఏ అయినా తనను పక్కనపెట్టేసి అశోక్ గజపతిరాజు కూతురు అదితి గజపతిరాజుకు టికెట్ ఇచ్చినప్పటి నుండి ఆమె పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పార్టిసిపేట్ చేయటం లేదట. దానికితోడు చంద్రబాబు ఈమధ్యనే నియమించిన పార్టీ కమిటీల్లో కూడా ఎందులోను అవకాశం ఇవ్వలేదు. దాంతో పార్టీలో నుండి ఎప్పుడెప్పుడు వచ్చేదామా అని చూస్తున్నట్లు సమాచారం. ఆమె మొదటి ప్రిఫరెన్సు వైసీపీనే అనటంలో సందేహం లేదు.

అయితే ఆమె మద్దతుదారులు మాత్రం వైసీపీకన్నా బీజేపీనే బెటర్ ఆప్షన్ అని చెబుతున్నారట. ఎందుకంటే విజయనగరం జిల్లాలో మంత్రి బొత్సా సత్యనారాయణ ధాటిని తట్టుకోవటం కష్టమంటున్నారట. అదే బీజేపీలో అయితే గట్టి నేతలు లేరు కాబట్టి ప్రాధాన్య ఉంటుందని చెప్పారట. ఇపుడు గంట అయినా, మీసాల గీత అయినా ఈ విషయంలోనే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే బీజేపీ రాష్ట్రంలో ఎప్పటికీ ఎదిగే అవకాశం లేదనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఇటువంటి పార్టీలోకి వెళ్ళి ఏమి చేస్తామనే ప్రశ్న అందరిని తొలిచేస్తోంది.

ఇదే సమయంలో టీడీపీని పక్కకునెట్టి ఆ స్ధానంలోకి బీజేపీ చేరుకోవాలనే ప్రయత్నాలను అందరు చూస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉండటమే పెద్ద ప్లస్ పాయింట్. కాబట్టి వైసీపీలో చేరలేని వాళ్ళంతా బీజేపీలో చేరటానికి సిద్ధమవుతున్నారు. దీన్నే బీజీపే అధ్యక్షుడు సోము వీర్రాజు అడ్వాంటేజిగా తీసుకుంటున్నారు. మరి ఎంతమంది టీడీపీ నేతలు కమలం కండువా కప్పుకుంటారో చూడాలి.

This post was last modified on November 7, 2020 4:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రెండు షాట్ల కోసం మహేష్ ఆరు నెలల కష్టం

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు.. ఈ వార్త నిజం కావడానికి దశాబ్దంన్నర పాటు ఎదురు చూడాల్సి వచ్చింది అభిమానులు. వీరి…

3 minutes ago

ఫ్యామిలీ మ్యాన్ హీరో చుట్టూ టైటిల్ వివాదం

రామ్ గోపాల్ వర్మ సత్యతో స్టార్ ఆర్టిస్టుగా మారిపోయిన మనోజ్ బాజ్ పాయ్ తెలుగులోనూ హ్యాపీ, ప్రేమకథ, కొమరం పులి…

26 minutes ago

చిరు సినిమాలో దురంధర్ పాప?

సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంతో భారీ విజయాన్నందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. దీని కంటే ముందు ఆయన మొదలుపెట్టిన…

49 minutes ago

లడ్డూ విషయం పక్క దారి పట్టేసిందా

తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో కల్తీ నెయ్యి వ్యవహారం మరింత కాక రేపుతోంది. గత 2024 సెప్టెంబరు నుంచి ఇప్పటి…

1 hour ago

వారణాసి విశేషాలతో అభిమానుల్లో హుషారు

గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు దర్శనం లేక డీలాపడిన అభిమానులకు ఊరట కలిగించేలా వారణాసి ఇంటర్వ్యూలు విడుదలయ్యాయి. మహేష్…

2 hours ago

ఐమాక్స్ కోసం రాజమౌళి ధర్నా

ప్రపంచంలోనే అతి పెద్ద సినిమా మార్కెట్ ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. ఐతే భారీ చిత్రాల వీక్షణలో అద్భుతమైన అనుభూతిని…

2 hours ago