Political News

‘క‌విత పార్టీపై’ గంగుల షాకింగ్ కామెంట్స్‌!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె.. క‌వితపై ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల క‌మ‌లాక‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు దాగుడు మూత‌లుగా ఉన్న క‌విత వ్య‌వ‌హారంపై ఆయ‌న క్లూ ఇచ్చేశారు. “మ‌న‌ది ప్ర‌జాస్వామ్య దేశం. ఎవ‌రైనా ఎక్క‌డైనా ఎప్పుడైనా పార్టీ పెట్టుకునేందుకు స్వేచ్ఛ ఉంటుంది. అది క‌వితే అయినా..మ‌రెవ‌రైనా కూడా!” అని తేల్చి చెప్పారు.

అంటే.. క‌విత సొంత పార్టీ పెట్టుకునే ఆలోచ‌న‌లో ఉన్నార‌న్న వార్త‌ల నేప‌థ్యంలో గంగుల చేసిన వ్యాఖ్య లు కీల‌కంగా మారాయి. నిజానికి క‌విత పార్టీ పెట్టుకుంటార‌ని ఎక్క‌డా ప్ర‌క‌టించ‌క‌పోయినా.. జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను బ‌ట్టి ఆమె ఆదిశ‌గానే అడుగులు వేస్తున్నార‌న్న సంకేతాలు వ‌స్తున్నాయి. కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు బీఆర్ఎస్ నాయ‌కులు ఎవ‌రూ కూడా క‌విత పార్టీపై ప్ర‌క‌ట‌న‌లు చేయ‌లేదు. ఈ నేప‌థ్యంలో క‌మ‌లాక‌ర్ వ్యాఖ్య‌ల‌కు ప్రాధాన్యం ఏర్ప‌డింది.

అంతేకాదు.. క‌విత పార్టీ పెట్టుకుంటే.. ఎంత మంది ఆమెకు మ‌ద్ద‌తుగా నిలుస్తారో.. అప్పుడు తెలుస్తుందని ఓ చిన్న‌పాటి హెచ్చ‌రిక‌ను కూడా క‌మ‌లాక‌ర్ చేశారు. ఇదేస‌మ‌యంలో త‌న‌తో పాటు త‌న‌లాంటి వారు ఎవ‌రూ క‌విత‌తో న‌డిచే ప‌రిస్థితి లేద‌ని.. త‌మ‌కు కేసీఆరే నాయ‌కుడ‌ని.. ఆయ‌న వెంటే న‌డుస్తామ‌న్నారు. అయితే.. అంత‌ర్గ‌తంగా చ‌ర్చించాల్సిన అంశాల‌ను బ‌హిర్గ‌తం చేయ‌డం ఎంత‌వ‌ర‌కు సమంజ‌స‌మో.. క‌విత ఆలోచించుకోవాల‌న్న సూచ‌న చేశారు.

ఇక‌, క‌విత‌ను తెలంగాణ సమాజం కేసీఆర్ కుమార్తెగానే ఇప్ప‌టి వ‌ర‌కు కూడా చూసింద‌న్నారు. “ఆమె ఎంపీ అయ్యారు.. త‌ర్వాత‌.. ఓడిపోయారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇవ‌న్నీ.. కేసీఆర్ ద్వారానే వ‌చ్చాయి. కాబట్టి ఆమెను కేసీఆర్ కూతురుగానే చూస్తున్నారు. ఇప్పుడు సొంత పార్టీ పెట్టుకున్నాక‌.. ఏం జ‌రుగుతుందో చూడాలి.” అని గంగుల వ్యాఖ్యానించారు.

This post was last modified on May 26, 2025 12:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

57 minutes ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

4 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

5 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

7 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

7 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

8 hours ago