Political News

‘క‌విత పార్టీపై’ గంగుల షాకింగ్ కామెంట్స్‌!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె.. క‌వితపై ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల క‌మ‌లాక‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు దాగుడు మూత‌లుగా ఉన్న క‌విత వ్య‌వ‌హారంపై ఆయ‌న క్లూ ఇచ్చేశారు. “మ‌న‌ది ప్ర‌జాస్వామ్య దేశం. ఎవ‌రైనా ఎక్క‌డైనా ఎప్పుడైనా పార్టీ పెట్టుకునేందుకు స్వేచ్ఛ ఉంటుంది. అది క‌వితే అయినా..మ‌రెవ‌రైనా కూడా!” అని తేల్చి చెప్పారు.

అంటే.. క‌విత సొంత పార్టీ పెట్టుకునే ఆలోచ‌న‌లో ఉన్నార‌న్న వార్త‌ల నేప‌థ్యంలో గంగుల చేసిన వ్యాఖ్య లు కీల‌కంగా మారాయి. నిజానికి క‌విత పార్టీ పెట్టుకుంటార‌ని ఎక్క‌డా ప్ర‌క‌టించ‌క‌పోయినా.. జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను బ‌ట్టి ఆమె ఆదిశ‌గానే అడుగులు వేస్తున్నార‌న్న సంకేతాలు వ‌స్తున్నాయి. కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు బీఆర్ఎస్ నాయ‌కులు ఎవ‌రూ కూడా క‌విత పార్టీపై ప్ర‌క‌ట‌న‌లు చేయ‌లేదు. ఈ నేప‌థ్యంలో క‌మ‌లాక‌ర్ వ్యాఖ్య‌ల‌కు ప్రాధాన్యం ఏర్ప‌డింది.

అంతేకాదు.. క‌విత పార్టీ పెట్టుకుంటే.. ఎంత మంది ఆమెకు మ‌ద్ద‌తుగా నిలుస్తారో.. అప్పుడు తెలుస్తుందని ఓ చిన్న‌పాటి హెచ్చ‌రిక‌ను కూడా క‌మ‌లాక‌ర్ చేశారు. ఇదేస‌మ‌యంలో త‌న‌తో పాటు త‌న‌లాంటి వారు ఎవ‌రూ క‌విత‌తో న‌డిచే ప‌రిస్థితి లేద‌ని.. త‌మ‌కు కేసీఆరే నాయ‌కుడ‌ని.. ఆయ‌న వెంటే న‌డుస్తామ‌న్నారు. అయితే.. అంత‌ర్గ‌తంగా చ‌ర్చించాల్సిన అంశాల‌ను బ‌హిర్గ‌తం చేయ‌డం ఎంత‌వ‌ర‌కు సమంజ‌స‌మో.. క‌విత ఆలోచించుకోవాల‌న్న సూచ‌న చేశారు.

ఇక‌, క‌విత‌ను తెలంగాణ సమాజం కేసీఆర్ కుమార్తెగానే ఇప్ప‌టి వ‌ర‌కు కూడా చూసింద‌న్నారు. “ఆమె ఎంపీ అయ్యారు.. త‌ర్వాత‌.. ఓడిపోయారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇవ‌న్నీ.. కేసీఆర్ ద్వారానే వ‌చ్చాయి. కాబట్టి ఆమెను కేసీఆర్ కూతురుగానే చూస్తున్నారు. ఇప్పుడు సొంత పార్టీ పెట్టుకున్నాక‌.. ఏం జ‌రుగుతుందో చూడాలి.” అని గంగుల వ్యాఖ్యానించారు.

This post was last modified on May 26, 2025 12:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

47 minutes ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

2 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

2 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

2 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

2 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

3 hours ago