Political News

మూడు ద‌శాబ్దాల క‌ల‌.. వైసీపీ నోటికి తాళం వేసిన భువ‌న‌మ్మ‌.. !

టీడీపీ అధినేత, సీఎం చంద్ర‌బాబు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో అధునాత‌న సౌక‌ర్యాలతో ఇంటిని నిర్మించుకున్నారు. సుమారు 2 ఎక‌రాల విస్తీర్ణంలో అత్యాధునిక వ‌స‌తుల‌తో దీనిని నిర్మించారు. సుమారు 25 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ఖ‌ర్చు చేసిన‌ట్టు తెలిసింది. మొత్తంగా 7 బెడ్ రూమ్‌లు, సువిశాల‌మైన రెండు హాళ్లు, 12కు పైగా బాత్రూమ్‌ల‌తో ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. తాజాగా ఆదివారం తెల్ల‌వారు జామున ఈ ఇంటికి గృహ ప్ర‌వేశం కూడా నిర్వ‌హించారు.

అయితే.. ఇదేమీ అనుకుని నిర్మించిన భ‌వ‌నం కాదు. గ‌త ఐదేళ్ల కాలంలో వైసీపీ నాయ‌కులు చేసిన యాగీ.. పెట్టిన పోరు ఫ‌లితంగా.. దాదాపు 35 ఏళ్ల త‌ర్వాత‌.. చంద్ర‌బాబు నిర్మించుకున్న సొంతిల్లు. కుప్పం నుంచి చంద్ర‌బాబు ప్ర‌తి ఎన్నిక‌లోనూ విజ‌యం ద‌క్కించుకుంటున్నారు. కానీ, ఆయ‌న‌కు సొంతిల్లు లేదు. ఎప్పుడు ఇక్క‌డ‌కు వ‌చ్చినా.. నియోజ‌క‌వర్గ ప్ర‌జ‌ల‌తో ముఖాముఖి అయినా.. వారి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేసినా.. ఆయ‌న సొంతిల్లు మాత్రం ఇక్క‌డ లేదు.

ఎప్పుడు వ‌చ్చినా స్థానికంగా హోట‌ల్‌లో బ‌స చేసేవారు. అస‌లు సొంతిల్లు క‌ట్టుకోవాల‌న్న ఆలోచ‌న కూడా ఆయ‌న‌కు రాలేదు. కానీ.. వైసీపీ హ‌యాంలో చంద్ర‌బాబును ఈ కార‌ణంతోనే ఆ పార్టీ నాయ‌కులు ఏకేశారు. సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ఇల్లు లేని ముఖ్య‌మంత్రి అంటూ.. మంత్రుల నుంచి నాయ‌కుల వ‌ర‌కు ప‌లు సంద‌ర్భాల్లో విమ‌ర్శించారు. ఈ విమ‌ర్శ‌ల‌పై మౌనంగా ఉన్న‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు అంత‌ర్మ‌థ‌నం చెందేవ‌రు. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన ఆయ‌న స‌తీమ‌ణి.. భువ‌నేశ్వ‌రి.. 2023లో సొంతింటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

వైసీపీ నాయ‌కుల విమ‌ర్శ‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని.. ఇంటి నిర్మాణాన్ని ఆమె స్వ‌యంగా ప‌ర్య‌వేక్షించారు. వారానికి రెండు రోజుల పాటు కుప్పంలో మ‌కాం వేసిన భువ‌నేశ్వ‌రి.. ఇంటి ప‌నులను స్వ‌యంగా ప‌ర్య‌వేక్షించారు. ఇలా.. వ‌డివ‌డిగా సాగిన ఇంటి నిర్మాణం తాజాగా పూర్త‌యింది. రెండు లిఫ్టులు.. విశాల‌మైన పార్కింగ్ స‌దుపాయాలు.. ఎక్క‌డిక‌క్క‌డ లాన్‌ల‌తో స‌ర్వాంగ సుంద‌రంగా ఈ ఇంటిని తీర్చిదిద్దారు. మొత్తానికి మూడు ద‌శాబ్దాల క‌ల నెర‌వేర‌డంతోపాటు.. వైసీపీ నాయ‌కుల నోటికి కూడా భువ‌నేశ్వ‌రి తాళం వేశారు.

This post was last modified on May 25, 2025 5:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

23 minutes ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

1 hour ago

ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మ‌ధ్య జ‌రిగే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినానికి భారీ ప్ర‌క‌ట‌న చేసేందుకు ఏపీ మంత్రి నారా…

2 hours ago

అంబటి ఇంటిపై దాడి… హై టెన్షన్

ఏపీ సీఎం చంద్రబాబును మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు దుర్భాషలాడిన వైనంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు.…

3 hours ago

భాగ్య‌న‌గ‌రంలో గ‌న్ క‌ల్చ‌ర్.. డేంజ‌రే!

తెలంగాణ ప్ర‌భుత్వం... పెట్టుబ‌డుల‌కు స్వ‌ర్గ‌ధామంగా మారుస్తామ‌ని చెబుతున్న హైద‌రాబాద్‌లో గ‌న్ క‌ల్చ‌ర్ పెరుగుతోందా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. వ్య‌క్తిగ‌తంగా…

3 hours ago

‘చంద్రబాబును తిట్టలేదు.. అరెస్ట్ చేస్తే చేసుకోండి’

ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్న…

3 hours ago