Political News

ఏపీ – రూ. 20 వేల కోట్లతో పరిశ్రమలు

తొందరలోనే వేల కోట్ల రూపాయలతో భారీ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. రూ. 20 వేల కోట్లతో అదానీ డేటా సెంటర్, అపాచీ కంపెనీలు తమ యూనిట్లను రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి చెప్పారు. ఇవే కాకుండా పర్యావరణ రహిత, ఎలక్ట్రిక్ పరిశ్రమల ఏర్పాటుకు తైవాన్ కంపెనీలు సిద్దంగా ఉన్నట్లు కూడా మంత్రి చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఏర్పాటుపై తైవాన్ చాలా ఆసక్తిగా ఉందట.

ఇక అదాని అయితే రూ. 15 వేల కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోంది. 130 ఎకరాల్లో ఏర్పాటు చేయబోయే సెంటర్ లో సుమారు 25 వేలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. అదాని, అపాచి లాంటి కంపెనీల ద్వారా తొందరలోనే 40 వేలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి. ఏదేమైనా రాష్ట్ర విభజన తర్వాత ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి మెల్లిగా అయినా పెట్టుబడులు పెట్టటానికి స్వదేశీ, విదేశీ పరిశ్రమలు రావటం శుభపరిణామమనే చెప్పాలి.

వైజాగ్-నెల్లూరు మద్యలో ఉన్న సముద్ర తీరం ఆధారంగా చేసుకుని షిప్పింగ్ పరిశ్రమలు, ఫార్మా ఇండస్ట్రీలు, సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేసే పరిశ్రమలు రాబోతున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆసక్తి చూపుతున్న పరిశ్రమలను ఒకేచోట కాకుండా వాటి సామర్ధ్యం, అవసరం, అవకాశాలను బట్టి రాష్ట్రంలోని అన్నీ జిల్లాల్లోకి తీసుకెళితే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది. లేకపోతే రాష్ట్ర విభజన సమయంలో ఏపి ఎదుర్కొన్న సమస్యలనే మిగిలిన ప్రాంతాలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది.

This post was last modified on November 7, 2020 4:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అవతార్ 3 టాక్ ఏంటి తేడాగా ఉంది

భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…

13 minutes ago

జననాయకుడుకి ట్విస్ట్ ఇస్తున్న పరాశక్తి ?

మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…

1 hour ago

ప్రియురాలి మాయలో మాస్ ‘మహాశయుడు’

గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…

2 hours ago

అభిమానులూ… లీకుల ఉచ్చులో పడకండి

కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…

2 hours ago

ఇంటిని తాక‌ట్టు పెట్టిన హ‌రీష్ రావు… దేనికో తెలుసా?

బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు.. త‌న ఇంటిని తాక‌ట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వ‌ద్దుకు…

2 hours ago

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

3 hours ago