Political News

చివరి ఎన్నికల పేరుతో సెంటిమెంటును ప్రయోగించిన నితీష్

పదేళ్ళ పాలనలో రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేశానని చెప్పుకున్నా చివరకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సెంటిమెంటునే నమ్ముకున్నట్లున్నారు. బీహార్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో మూడో విడత ప్రచారంలో పూర్ణియా జిల్లాలో మాట్లాడుతూ ‘2020 ఎన్నికలే తన జీవితంలో చివరి ఎన్నికలం’టూ ప్రకటించేశారు. ఈ నెల 7వ తేదీన మూడో దశ పోలింగ్ జరగబోతోంది. దీనికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలతో నితీష్ బిజీగా ఉన్నారు. ఎన్డీయే తరపున ముఖ్యమంత్రి అభ్యర్ధిగా జేడీయు అధ్యక్షుడు నితీష్ కుమార్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

బీహార్ అసెంబ్లీలోని 243 సీట్లకు మూడు దశల్లో పోలింగ్ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. మొదటి దశలో పోలింగ్ జరిగిన 71 స్ధానాల్లో ఎన్డీయే వెనకబడిందని ఎగ్జిట్ పోల్ సర్వేలో బయటపడింది. మొన్నటి 3వ తేదీన 97 స్ధానాలకు జరిగిన రెండో దశ పోలింగ్ లో కూడా ఎన్డీయేకి పరిస్దితులు ఏమంత ఆశాజనకంగా లేదని సమాచారం. అందుకనే మూడో దశలో జరగబోయే పోలింగులో పుంజుకోకపోతే ఎన్డీయే కూటమిగా జేడీయు అధికారంపై ఆశలు వదులుకోవాల్సిందే.

అంటే పదేళ్ళ పాటు రాష్ట్రాన్ని తాను ఎంతో అభివృద్ది చేశానని చెప్పుకోవటం, కేంద్రంలో నరేంద్రమోడి ప్రభుత్వం కూడా పెద్దగా ఆదుకుంటున్నట్లు కనబడలేదు. అభివృద్దిని, మోడిని నమ్ముకునే కంటే సెంటిమెంటును నమ్ముకుంటేనే వర్కవుట్ అవుతుందని అనుకున్నట్లున్నారు. అందుకనే పూర్ణియా జిల్లాలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ తనకు ఇవే చివరి ఎన్నికలంటూ పెద్ద అస్త్రాన్ని వదిలారు. ‘బీహార్ ఎన్నికలకు ఇదే చివరి రోజు..నా రాజకీయ జీవితానికి కూడా ఇదే ఆఖరి రోజు..ఇవే నా చివరి ఎన్నికలు..రాజకీయ జీవితానికి ఈ ఎన్నికలతో రిటైర్మెంటు పలుకుతున్నా’ అంటూ బహిరంగసభలో ప్రకటించారు.

మొత్తానికి సెంటిమెంటు మాత్రమే తనను గట్టెక్కిస్తుందని నితీష్ డిసైడ్ అయినట్లున్నారు. అందుకనే జనాలపైకి సెంటిమెంటు అస్త్రాన్నిసంధించారు. మరి ఈ అస్త్రం ఫలితమిస్తుందా లేదా అన్నది 7వ తేదీన కానీ తెలీదు. ఎందుకంటే ఆరోజే పోలింగ్ జరగబోతోంది. 10వ తేదీన ఫలితాలు వచ్చేస్తాయి. అంతా బాగానే ఉంది కానీ ఇక్కడే చిన్న ట్విస్టు పెట్టినట్లున్నారు నితీష్. ఎందుకంటే గడచిన 30 ఏళ్ళల్లో ఎన్నడు అసెంబ్లీకి పోటి చేసింది లేదు. ఎంఎల్సీ సభ్యునిగానే అసెంబ్లీలోకి అడుగుపెడుతున్నారు.

అలాగే తన రాజకీయ జీవితంలో ఇదే చివరి ఎన్నికల్లన్నారే కానీ రాజకీయాల నుండి విరమించుకుంటున్నట్లు స్పష్టంగా ప్రకటించలేదు. రాజకీయ జీవితానికి ఈ ఎన్నికలతోనే రిటైర్మెంటు పలుకుతున్నట్లు చెప్పారంతే. అంటే బహుశా భవిష్యత్తులో రాజ్యసభ ఎంపిగా కేంద్రానికి వెళిపోతారేమో చెప్పలేం. ఎందుకంటే నితీష్ వయస్సు 70 ఏళ్ళే. రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు చెప్పలేం కదా.

This post was last modified on November 6, 2020 2:43 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

థియేట్రికల్ రిలీజ్‌లు లైట్.. ఓటీటీ సినిమాలే హైలైట్

ఏప్రిల్ చివరి వారం అంటే పీక్ సమ్మర్.. ఈ టైంలో పెద్ద పెద్ద సినిమాలతో థియేటర్లు కళకళలాడుతుండాలి. రెండు గంటలు…

1 hour ago

పింఛ‌న్ల‌పై పిడుగు.. వైసీపీకి క‌ష్ట‌మేనా?

సామాజిక పింఛ‌న్ల పై పిడుగు ప‌డిన‌ట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంట‌రి మ‌హిళ లు.. వంటి సామాజిక పింఛ‌నుపై…

6 hours ago

వైసీపీ మేనిఫెస్టోపై చంద్ర‌బాబు ఫ‌స్ట్‌ రియాక్ష‌న్

ఏపీలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సంబంధించి అధికార పార్టీ వైసీపీ తాజాగా ఎన్నిక‌ల మేనిఫెస్టోను ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. 2019…

7 hours ago

జై హనుమాన్ రూటు మారుతోంది

స్టార్ హీరోల పోటీని తట్టుకుని బ్లాక్ బస్టర్ మించిన వసూళ్లను సాధించిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఆల్రెడీ ప్రకటించిన…

7 hours ago

ఆ విషయంలో ఎవరైనా సుకుమార్ తర్వాతే..

టాలీవుడ్లో ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు.…

9 hours ago

బాబు సూప‌ర్ సిక్స్‌- జ‌గ‌న్ నైన్ గ్యారెంటీస్‌ ఎవ‌రిది ముందంజ‌!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎన్నిక‌ల ప్ర‌చారంలో సూప‌ర్ సిక్స్‌ను ఎక్కువ‌గా ప్ర‌చారం చేస్తున్నారు. తాను అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. వీటిని…

9 hours ago