Political News

చివరి ఎన్నికల పేరుతో సెంటిమెంటును ప్రయోగించిన నితీష్

పదేళ్ళ పాలనలో రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేశానని చెప్పుకున్నా చివరకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సెంటిమెంటునే నమ్ముకున్నట్లున్నారు. బీహార్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో మూడో విడత ప్రచారంలో పూర్ణియా జిల్లాలో మాట్లాడుతూ ‘2020 ఎన్నికలే తన జీవితంలో చివరి ఎన్నికలం’టూ ప్రకటించేశారు. ఈ నెల 7వ తేదీన మూడో దశ పోలింగ్ జరగబోతోంది. దీనికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలతో నితీష్ బిజీగా ఉన్నారు. ఎన్డీయే తరపున ముఖ్యమంత్రి అభ్యర్ధిగా జేడీయు అధ్యక్షుడు నితీష్ కుమార్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

బీహార్ అసెంబ్లీలోని 243 సీట్లకు మూడు దశల్లో పోలింగ్ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. మొదటి దశలో పోలింగ్ జరిగిన 71 స్ధానాల్లో ఎన్డీయే వెనకబడిందని ఎగ్జిట్ పోల్ సర్వేలో బయటపడింది. మొన్నటి 3వ తేదీన 97 స్ధానాలకు జరిగిన రెండో దశ పోలింగ్ లో కూడా ఎన్డీయేకి పరిస్దితులు ఏమంత ఆశాజనకంగా లేదని సమాచారం. అందుకనే మూడో దశలో జరగబోయే పోలింగులో పుంజుకోకపోతే ఎన్డీయే కూటమిగా జేడీయు అధికారంపై ఆశలు వదులుకోవాల్సిందే.

అంటే పదేళ్ళ పాటు రాష్ట్రాన్ని తాను ఎంతో అభివృద్ది చేశానని చెప్పుకోవటం, కేంద్రంలో నరేంద్రమోడి ప్రభుత్వం కూడా పెద్దగా ఆదుకుంటున్నట్లు కనబడలేదు. అభివృద్దిని, మోడిని నమ్ముకునే కంటే సెంటిమెంటును నమ్ముకుంటేనే వర్కవుట్ అవుతుందని అనుకున్నట్లున్నారు. అందుకనే పూర్ణియా జిల్లాలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ తనకు ఇవే చివరి ఎన్నికలంటూ పెద్ద అస్త్రాన్ని వదిలారు. ‘బీహార్ ఎన్నికలకు ఇదే చివరి రోజు..నా రాజకీయ జీవితానికి కూడా ఇదే ఆఖరి రోజు..ఇవే నా చివరి ఎన్నికలు..రాజకీయ జీవితానికి ఈ ఎన్నికలతో రిటైర్మెంటు పలుకుతున్నా’ అంటూ బహిరంగసభలో ప్రకటించారు.

మొత్తానికి సెంటిమెంటు మాత్రమే తనను గట్టెక్కిస్తుందని నితీష్ డిసైడ్ అయినట్లున్నారు. అందుకనే జనాలపైకి సెంటిమెంటు అస్త్రాన్నిసంధించారు. మరి ఈ అస్త్రం ఫలితమిస్తుందా లేదా అన్నది 7వ తేదీన కానీ తెలీదు. ఎందుకంటే ఆరోజే పోలింగ్ జరగబోతోంది. 10వ తేదీన ఫలితాలు వచ్చేస్తాయి. అంతా బాగానే ఉంది కానీ ఇక్కడే చిన్న ట్విస్టు పెట్టినట్లున్నారు నితీష్. ఎందుకంటే గడచిన 30 ఏళ్ళల్లో ఎన్నడు అసెంబ్లీకి పోటి చేసింది లేదు. ఎంఎల్సీ సభ్యునిగానే అసెంబ్లీలోకి అడుగుపెడుతున్నారు.

అలాగే తన రాజకీయ జీవితంలో ఇదే చివరి ఎన్నికల్లన్నారే కానీ రాజకీయాల నుండి విరమించుకుంటున్నట్లు స్పష్టంగా ప్రకటించలేదు. రాజకీయ జీవితానికి ఈ ఎన్నికలతోనే రిటైర్మెంటు పలుకుతున్నట్లు చెప్పారంతే. అంటే బహుశా భవిష్యత్తులో రాజ్యసభ ఎంపిగా కేంద్రానికి వెళిపోతారేమో చెప్పలేం. ఎందుకంటే నితీష్ వయస్సు 70 ఏళ్ళే. రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు చెప్పలేం కదా.

This post was last modified on November 6, 2020 2:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

22 minutes ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

2 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

2 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

4 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

4 hours ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

5 hours ago