Political News

ఏపీ స్కూళ్లలో కరోనా కలకలం?

కరోనా విజృంభణ మొదలవుతున్న తరుణంలో ముందు జాగ్రత్త చర్యగా ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలను ఈసీ వాయిదా వేస్తే దాని మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది జగన్ సర్కారు. ఐతే ఇప్పుడు ఇంకా కరోనా తగ్గుముఖం పట్టని నేపథ్యంలో ఈసీ స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి ప్రయత్నిస్తుంటే ప్రభుత్వం అందుకే ససేమిరా అంటోంది. అంత వరకు బాగానే ఉంది. కానీ ఎన్నికలు నిర్వహించకపోవడానికి కరోనాను కారణంగా చూపుతున్న అదే ప్రభుత్వం ఏపీలో స్కూళ్లు తెరవడానికి అనుమతులు ఇచ్చేసింది.

నవంబరు 2న అక్కడ పాఠశాలలు తెరుచుకున్నాయి. ముందుగా 9, 10 తరగతులను స్కూళ్లకు అనుమతిస్తున్నారు. ఐతే ఈ సందర్భంగా విద్యార్థులకు కరోనా వస్తే పాఠశాలది బాధ్యత కాదంటూ విద్యార్థుల తల్లిదండ్రులతో హామీ పత్రాలు రాయించుకుని మరీ వారిని పాఠశాలలకు రప్పిస్తున్న సంగతి తెలిసిందే.

ఐతే ఏపీలోనే కాదు.. దేశంలో ఎక్కడా కరోనా వ్యాప్తి పూర్తిగా ఆగిపోలేదు. కొంచెం తగ్గుముఖం పట్టింది. జనాల్లో భయం పోయిందంతే. స్కూళ్లు రీఓపెన్ చేస్తే విద్యార్థులకు కరోనా సోకే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నా సరే.. ప్రభుత్వం ముందడుగే వేసింది. తీరా చూస్తే ఇప్పుడు స్కూళ్లు తెరిచిన మూడు రోజుల్లోనే 262 మంది విద్యార్థులు, 160 మంది ఉపాధ్యాయులు కరోనా బారినట్లు సమాచారం బయటికి వచ్చింది.

ఈ విషయాన్ని ఓ ఉన్నతాధికారి వెల్లడించినట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. ఇప్పటికీ ఏపీలో రోజూ వేలల్లో కేసులు నమోదవుుతండగా.. స్కూళ్లలో కరోనా కేసులు బయటపడవని అనుకుంటే అంతకంటే వెర్రితనం ఇంకోటి లేదు. ఓవైపు ఎన్నికలు నిర్వహించడానికి కరోనాను అడ్డుగా చూపించిన ప్రభుత్వం.. పాఠశాలలు మాత్రం ఎలా తెరిచిందన్నది అర్థం కాని విషయం. పిల్లలకు కరోనా సోకితే తల్లిదండ్రులు ఎంతగా ఆందోళన చెందుతారో చెప్పేదేముంది? ఈ నేపథ్యంలో మళ్లీ ఏపీలో స్కూళ్లు మూతపడటం ఖాయమనే చెప్పాలి.

This post was last modified on November 5, 2020 6:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

2 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

6 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

7 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

8 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

9 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

9 hours ago